-
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్కు టాప్ ఇనిస్టిట్యూట్స్లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్కు లండన్లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్ఫ్లామ్లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. -
ఇక్కడ సీటొస్తే.. విదేశాల్లో చదవొచ్చు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాలర్ల డ్రీమ్ ఇప్పటి యువత కల. అందుకోసం విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడాలని యువత భావిస్తోంది. ఈ కలను సాకారం చేసుకోవాలంటే.. పొరుగు దేశం వెళ్లి ఏ కోర్సు చేయాలన్నా ఆ దేశం నుంచి వీసా పొందటం, విదేశీ యూనివర్సిటీలలో సీటు పొందడం ఇలా ఎన్నింటినో దాటాలి. ఇలాంటి వ్యయప్రయాసలకు చెక్ పెట్టి విదేశాల్లో ఎంఎస్ చేయాలన్న కలను సాకారం చేస్తోంది కాకినాడలోని జేఎన్టీయూ. ఇప్పటికే స్వీడన్లో బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ, యూఎస్లో నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుని పలు కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ, ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీలకు అవకాశం కల్పిస్తోంది. 45 దేశాల యూనివర్సిటీలతో.. ఇటీవల నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ ప్లస్ హోదాను సాధించిన జేఎన్టీయూకే (కాకినాడ) విదేశీ విద్య కోసం 45 దేశాల్లోని వివిధ యూనివర్సిటీలతో ఒప్పందాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో సేవలందించిన డాక్టర్ షేక్ సులేమాన్, విదేశీ సేవల కోసం ఫారిన్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.శివనాగరాజును నియమించుకుంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వీసా నుంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వరకు అంతా జేఎన్టీయూకే చూసుకుంటోంది. జేఎన్టీయూకే అందిస్తున్న కోర్సులు స్వీడన్ బ్లేకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ విభాగాల్లో 20 సీట్ల చొప్పున 60 సీట్లతో జేఎన్టీయూకే ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సు వ్యవధి నాలుగు లేదా ఆరు సంవత్సరాలు. నాలుగు సంవత్సరాల కోర్సులో చేరితే మూడేళ్లు జేఎన్టీయూ (కాకినాడ)లోను, ఒక ఏడాది స్వీడన్లో అభ్యసిస్తే డిగ్రీ సర్టిఫికెట్ లభిస్తుంది. అదే మూడేళ్లు ఇక్కడ మరో మూడేళ్లు స్వీడన్లో అభ్యసిస్తే డ్యూయల్ డిగ్రీ అంటే ఎంఎస్ అర్హత గల సర్టిఫికెట్ అందజేస్తారు. ఫీజు జేఎన్టీయూకేలో ఏడాదికి రూ.1.50 లక్షలు, స్వీడన్లో ఏడాదికి సుమారు రూ.7 లక్షలు వరకు చెల్లించాలి. యూఎస్లోని నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో ఈసీఈ విభాగంలో నాలుగు సంవత్సరాల కోర్సుకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సును మూడేళ్లపాటు జేఎన్టీయూకేలోను, ఒక ఏడాది యూఎస్లోను అభ్యసించాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. జర్మనీలో స్టెబిన్సీ యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ మాస్టర్ ప్రోగ్రాం రెండేళ్ల కాల వ్యవధితో అందించేందుకు జేఎన్టీయూకే ఒప్పందం చేసుకుంది. బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. స్టెబిన్సీ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతతో సీటు సాధిస్తే ఉచిత విద్యతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రవేశాలు ఇలా.. ఈఏపీ సెట్ లేదా జేఈఈ, టీఎస్ ఎంసెట్లో అర్హత సాధించాలి. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ ఉత్తీర్ణులై కనీసం 60 శాతం మార్కులు పొందాలి. వివరాలకు జేఎన్టీయూకే ఫారిన్ వర్సిటీ రిలేషన్స్ డైరెక్టర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. విదేశీ ఒప్పందాలకు ప్రణాళిక ఇప్పటికే అందిస్తున్న కోర్సులకు స్పందన బాగుంది. ఇటీవల న్యాక్ ఏ ప్లస్ హోదా రావడంతో 45 దేశాల్లో పేరొందిన యూనివర్సిటీలతో ఒప్పందాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జేఎన్టీయూకేలో మూడేళ్లు అభ్యసించి నాలుగో ఏడాది విదేశీ కోర్సు చదవచ్చు. ఒప్పందం ప్రకారం విదేశీ యూనివర్సిటీలే మన విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తాయి. – జీవీఆర్ ప్రసాదరాజు, వీసీ, జేఎన్టీయూకే -
నైతిక పునాది లేని జాతీయవాదం
భారత్లో తమ క్యాంపస్లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఈ క్యాంపస్ను ఏర్పర్చాలనుకునే విదేశీ విశ్వవిద్యాలయం గ్లోబల్ ర్యాకింగ్స్లో టాప్ – 500ల్లో ఉండాలి. స్పష్టంగా వీటిలోని కోర్సులను ప్రపంచస్థాయిలో పోటీపడే సిలబస్తో ఇంగ్లిష్లో నేర్పుతారు. కేంద్రం ఇంగ్లిష్లో తమ ఇచ్ఛప్రకారం కోర్సులను బోధించే విశ్వవిద్యాలయాలను అనుమతించడం ఆశ్చర్యంగా లేదా? ఇదే ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా భాషగా చేయాలనీ, సిలబస్ భారతీయ సంçస్కృతిపై ఎక్కువగా ఆధారపడి ఉండాలనీ చెబుతూ వచ్చింది. ప్రశ్న ఏమిటంటే, భారతీయ విశ్వవిద్యాలయాల్లో హిందీలో చదివేవారు ఎవరు? విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్లో అధ్యయనం చేసేది ఎవరు? మన విద్యా వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాల వల్ల దెబ్బతింటోంది. తీవ్ర జాతీయవాది సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్, విదేశీ యూనివర్సిటీ విద్య నేర్పించడాన్నే ఇష్టపడుతున్నారు. మరోవైపు సంస్కృతి, వారసత్వం, మాతృభాష అంటూ రాగం ఎత్తుకుంటారు. ఒక కుటుంబానికి డబ్బుంటే, వారి పిల్లలు ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్లో చదవడానికి భారీగా ఖర్చు చేస్తారు. విదేశీ యూనివర్సిటీల్లో చదవడానికి అమెరికా లేదా ఇంగ్లండ్కు పోతారు. కానీ స్వదేశంలో అత్యున్నత విజ్ఞానాన్ని మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధించాలని వీరు కోరుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం భారత్లో తమ క్యాంప స్లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు (యేల్, హార్వర్డ్, ప్రిన్్సటన్) తలుపులు తెరిచింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్పర్సన్ ఎం. జగదీశ్ కుమార్ జనవరి 5న నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్ ్సలో ఈ ప్రకటన చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ‘భారత్లో తన క్యాంపస్ను ఏర్పర్చాలనుకునే విదేశీ విశ్వవిద్యా లయం గ్లోబల్ ర్యాకింగ్స్లో టాప్– 500ల్లో ఉండాలి.’ అంటే వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి యూనివర్సిటీలు భారత్ లోని కొత్త క్యాంపస్లపై దృష్టి సారిస్తాయని దీనర్థం. స్పష్టంగా వీటిలోని అన్ని కోర్సులను ప్రపంచస్థాయిలో పోటీపడే సిలబస్తో ఇంగ్లిష్లో నేర్పుతారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంగ్లిష్లో తమ ఇచ్ఛప్రకారం కోర్సులను బోధించే విశ్వవిద్యాలయాలను అనుమతించడం ఆశ్చర్యం కలిగించడం లేదా? ఇదే ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా భాషగా చేయాలనీ, సిలబస్ భారతీయ సంస్కృతి, వార సత్వంపై ఎక్కువగా ఆధారపడి ఉండాలనీ పదే పదే చెబుతూ వచ్చింది. యూనివర్సిటీ సిలబస్లో నిర్బంధంగా వేద, పురాణ అధ్యయనాలను చొప్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. వివాదా స్పదమైన ప్రశ్న ఏమిటంటే, భారతీయ విశ్వవిద్యాలయాల్లో హిందీలో చదివేవారు ఎవరు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్లో అధ్యయనం చేసేది ఎవరు? విదేశీ విశ్వవిద్యాలయాలు వేద విజ్ఞానం, గణితం, మానవ శాస్త్రాలను ‘ప్రపంచ’ నాగరికతా ఆధారాలుగా హిందీలో బోధిస్తాయా? ‘భారతీయ క్యాంపస్లో విదేశీ విశ్వవిద్యాలయం అందించే విద్యా నాణ్యత, దాని సొంత దేశంలోని ప్రధాన క్యాంపస్లో అందించే విద్యానాణ్యతకు సమానంగా ఉంటుందని హమీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే భారతీయ క్యాంపస్లోని విద్యార్థులకు అందించే విద్యా పరమైన అవార్డులు సొంతదేశంలోని ప్రధాన క్యాంపస్లోని ఉన్నత విద్యాసంస్థలు అందించే విద్యాపరమైన అవార్డులకు సరిసమానంగా ఉండటమే కాకుండా ఆ మేరకు తగిన గుర్తింపును కూడా ఇవ్వాల్సి ఉంటుంది’ అని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. భారత్లో విదేశీ విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు. క్యాంపస్లో విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతుల విషయంలో తప్ప, నిర్వహణాత్మక అంశంలో యూజీసీ నుంచి ఎలాంటి జోక్యం ఉండబోదని అన్నారు. జాతీయ విద్య వర్సెస్ గ్లోబల్ విద్యతో దేశాన్ని కుల, వర్గ ప్రాతిపదికన మరింతగా విభజించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లయితే, భారతీయ యూనివర్సిటీలలో విద్యా నాణ్యత, పట్టభద్రుల ఉపాధి విషయం ఏమిటి? ఇదే జరిగితే, భారత్ మరోసారి తన అంధకార గతం వైపు వెళ్లిపోతుంది. శూద్రులు, ఇతర వెనుక బడిన వర్గాలు (ఓబీసీలు), దళితులు, ఆదివాసీలు ఆధునిక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేరు. రిజర్వేషన్ ప్రయోజనాలు ఇకపై శూన్య మైపోతాయి. ఉత్పాదక వర్గాల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం విద్యా భారతిని చూపిస్తుంది. ఇది ఆరెస్సెస్ నిర్వహించే పాఠశాలల నెట్వర్క్. ఇలాంటి విద్యా నమూనా ద్వారా ఘనమైన ప్రాచీన నాగరికతను భారతీయులు అనుసరించాలని ఆరెస్సెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. అదే సమయంలో ఆధునిక ఉత్పత్తి, ఆధునిక విజ్ఞానశాస్త్రం, వనరుల పంపిణీ, సమానత్వం వంటివాటిని భార తీయేతరమైనవిగా ఇవి చూస్తున్నాయి. వర్ణవ్యవస్థ కేంద్రకంగా ఉన్న మానవ సంబంధాలు, ఆశ్రమాల్లో నివసించడమే సమాజ ఆద ర్శాలుగా మారిపోతాయి. అదే సమయంలో విదేశీ, భారతీయ ప్రైవేట్ పాఠశాలలు, యూనివర్సిటీలు దేశంలోని కులీన వర్గాల, పాలక వర్గాల పిల్లలకు హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, యేల్ యూనివర్సిటీల సిలబస్తో ఇంగ్లిష్లో బోధనను అందిస్తాయి. దీనివల్ల వీరు పాశ్చాత్య దేశాలతో వాటికి వెలుపలి ప్రపంచంతో కూడా కనెక్ట్ అవుతారు. వీరే నిజమైన విశ్వగురువులుగా లేదా ప్రపంచ నేతలుగా మారతారు. ఈ రకమైన విభజన వల్ల మన దేశంలోని సెక్యులర్, లిబరల్ ద్విజులు పెద్దగా కోల్పోయేది ఏమీ ఉండదు. తమ పిల్లలకు హిందీ మీడియం విద్యా భారతి సిలబస్ను నేర్పరని వీరందరికీ స్పష్టంగా తెలుసు. బోధనా పద్ధతులపై, బోధనా శాస్త్రంపై వీరి విమర్శ అటు భాష, ఇటు విషయంపై అస్పష్టతతోనే ఉంటుంది. కానీ వీరు సమా నతా విద్య గురించి వల్లిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యావేత్తలు ఈ విద్యా నమూనాతో పోరాడరు. గతంలో పేలవమైన విద్యా విధానాలను రూపొందించింది వీరే మరి. దీనివల్లే శూద్రులు, ఓబీసీలు, దళితలు, ఆదివాసుల్లో ఇంగ్లిష్ విద్య పొందిన మేధావులు అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ఉండిపోయారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ మేధావుల విషయానికి వస్తే ఈ విధమైన విద్యాపరమైన విభజన వారికి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పలువురు ముస్లిం విద్యార్థులు మదరసాల్లో, క్రిస్టియన్ విద్యార్థులు మిషనరీ స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారు. మదర సాలు, క్రిస్టియన్ స్కూళ్లు అంతరిస్తున్నాయనుకోండి! మరోవైపున విద్యావకాశాలకు దూరమైన శూద్రులు, ఓబీసీలు కూడా ఈ సమ స్యను పెద్దగా పట్టించుకోవడం లేదు. హిందూ సామ్రాట్ గుర్తింపుతో మొట్టమొదటి బీసీ ప్రధానిగా చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ తమను చారిత్రక బానిసత్వం నుంచి బయటపడేస్తారని వీరిలో చాలామంది భావిస్తున్నారు. భారతీయ ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజారాసులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే అది వారి సొంత భాషా దురహంకారానికి వ్యతిరేక మవుతుంది. ఇక ఓబీసీ, దళిత సంస్థల విషయానికి వస్తే విద్యా నాణ్యత కంటే రిజర్వేషన్ లో తమ వాటా గురించే ఆందోళన చెందుతున్నాయి. నిరంకుశమైన 2020 వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా వ్యవసాయ ప్రజా బాహుళ్యం చిన్న విజయం సాధించగలిగింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ విద్యా కుట్రతో తమ పిల్లలు మరింత ప్రమాదంలో పడనున్నారని వీరు గుర్తించడం లేదు. ప్రజారాసుల పిల్లలను చేర్చు కుంటామని హామీ ఇవ్వకుండానే అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు చాలావరకు ప్రజల భూములను కొనివేయబోతున్నాయి. రైతుల పిల్లల విద్యాపరమైన శక్తిసామర్థ్యాన్ని విచ్చిన్నపర్చడానికి పాలక వర్గాలు పథకం వేస్తున్నాయి. ఈ విధానాల ద్వారా వీరి భవిష్యత్తు అంధకారం కానుంది. ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉంటున్న రిజ ర్వేషన్లు పొందుతున్నవారేమో ఒకసారి ప్రైవేటీకరణ పూర్తి శక్తితో ముందుకొచ్చాక న్యూనతతో బాధపడక తప్పదు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. తొలిసారిగా అవి భారత్లో సొంతంగా క్యాంపస్లు నెలకొల్పేందుకు, అడ్మిషన్ల విధానం, ఫీజుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. నిధులను సొంత దేశాలకు బదిలీచేసేందుకు తదితర నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రతిని యూజీసీ విడుదలచేసింది. అయితే ఆ వర్సిటీలో భారతీయ క్యాంపస్లలో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలి. ఆన్లైన్, దూర విద్యా కోర్సులకు అనుమతి ఇవ్వబోమని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ చెప్పారు. విదేశీ వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థ(హెచ్ఈఐ)లు ఇక్కడ క్యాంపస్ల ఏర్పాటు అనుమతులను యూజీసీ నుంచి తీసుకోవాలి. సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాక ఈ నెల చివరికల్లా తుది నిబంధనలను రూపొందిస్తారు. ముసాయిదా ప్రకారం విదేశీ వర్సిటీలు తమ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై స్వీయనియంత్రణ కల్గిఉంటాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. ‘నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి విద్యాబోధన భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విదేశీ వర్సిటీలతో అనువైన ఫీజుల్లోనే అంతర్జాతీయ విద్యార్హతలు మన విద్యార్థులకు దఖలుపడతాయి. వర్సిటీలు స్వదేశానికి పంపే నిధులకు ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్(ఫెమా) చట్టం,1999 వర్తిస్తుంది. ఇవి తమ వార్షిక ఆడిట్ యూజీసీకి సమర్పిస్తారు’ అని జగదీశ్ అన్నారు. ర్యాంక్లు పొందిన వాటికే.. అత్యున్నత ర్యాంక్ పొందిన వర్సిటీలకే భారత్లో క్యాంపస్ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. అంటే ప్రపంచం మొత్తంలో 500 లోపు ర్యాంక్ లేదా సబ్జెక్ట్ వారీగా ర్యాంక్ లేదా స్వదేశంలో దిగ్గజ వర్సిటీలకే భారత్లో అవకాశం దక్కనుంది. తర్వాత వాటి దరఖాస్తుల పరిశీలనకు యూజీసీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేయనుంది. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన దేశీ వర్శిటీల సమన్వయంతో ఈ వర్సిటీలు పనిచేసే వీలుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజులు తదితర వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే వెల్లడించాలి. సరైన సంస్కరణలతో దేశీయ వర్సిటీలను బలోపేతం చేయాల్సిందిపోయి విదేశీ వర్సిటీలు తేవడం ఏంటని కొందరు విద్యావేత్తలు పెదవివిరిచారు. ‘ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీకే చరమగీతం పాడనున్నారు. అలాంటి యూజీసీ నేతృత్వంలో సంస్కరణలు తేవడం ఏంటి ?. గతంలో విదేశీ వర్సిటీల బిల్లును 2012–13 కాలంలో యూపీఏ సర్కార్ తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆనాడు దీనిని బీజేపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభ స్థాయీ సంఘం కూడా తప్పుబట్టింది. ఇప్పుడు అదే బీజేపీ ఇప్పుడు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అభా దేవ్ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement