-
ఎన్ఎస్ఈఎల్ స్కామ్ కేసులో జిగ్నేశ్ షా అరెస్ట్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్)లో రూ.13,000 వేల కుంభకోణం కేసుకు సంబంధించి ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఎఫ్టీఐఎల్) వ్యవస్థాకుడైన జిగ్నేశ్ షాను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మంగళవారం అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ-ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) సెక్షన్ 19 కింద జిగ్నేశ్ షా అరెస్ట్ జరిగింది. దర్యాప్తునకు సరిగ్గా సహకరించలేనందున ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఆయనను స్పెషల్ పీఎంఎల్ఏ కోర్ట్ ముందు బుధవారం ఉదయం హాజరు పరుస్తామని పేర్కొన్నారు. జిగ్నేశ్ షా మనీల్యాండరింగ్కు పాల్పడ్డారనేందుకు బలమైన ఆధారాలు లభించాయని, దాంతో ఆయన కస్టడీని కోరామని వివరించారు. -
కేంద్రం ‘స్పాట్’!
రూ. 5,600 కోట్ల చెల్లింపుల స్కామ్పై.. * ఫైనాన్షియల్ టెక్నాలజీస్లో ఎన్ఎస్ఈఎల్ విలీనం * కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశం... * ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసమేనని వెల్లడి * ఎన్ఎస్ఈఎల్ చెల్లింపులు, అప్పులనూ ఎఫ్టీఐఎల్ భరించాల్సిందేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) రూ. 5,600 కోట్ల చెల్లింపుల కుంభకోణంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. జిగ్నేశ్ షా నేతృత్వంలోని మాతృసంస్థ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్) గ్రూప్లో ఎన్ఎస్ఈఎల్ను విలీనం చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కామ్లో చిక్కుకొని నష్టపోయిన ఇన్వెస్టర్లు, బ్రోకర్ల సొమ్మును తిరిగి ఇప్పించడం, వాళ్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొం ది. కాగా, తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని.. దీనిపై తమ న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపడతామని ఎఫ్టీఐఎల్ పేర్కొంది. ఇక బాధ్యతంతా ఎఫ్టీఐఎల్దే... ఎన్ఎస్ఈఎల్ బకాయి పడిన చెలింపులతో పాటు ఆ కంపెనీ రుణాలన్నింటికీ ఎఫ్టీఐఎల్ బాధ్యత వహించాల్సిందేనని ఆదేశాల్లో కేంద్రం తేల్చిచెప్పింది. ఎస్ఎస్ఈఎల్ మొత్తం వ్యాపారం, ఆస్తులు ఇతరత్రా అన్నీకూడా ఎఫ్టీఐఎల్కు బదిలీఅవుతాయి. ప్రజా ప్రయోజనాల రీత్యాప్రైవేటు రంగ కంపెనీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న కంపెనీల చట్టంలోని సెక్షన్ 396(నిబంధన-క్లాజ్)ను ఎన్ఎస్ఈఎల్పై ప్రయోగించింది. ఈ క్లాజ్ను చాలా అరుదుగా మాత్రమే ప్రభుత్వాలు ఉపయోగిస్తుంటాయి. కాగా, 2009లో సత్యం కంప్యూటర్స్ ఖాతాల కుంభకోణం తర్వాత మళ్లీ ఒక ప్రైవేటు కంపెనీ వ్యవహరాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం దాదాపు ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. అయితే, సత్యం కేసు లో ఆ కంపెనీని థర్డ్పార్టీ(టెక్ మహీంద్రా)కి వేలం ద్వారా విక్రయిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అన్నీ పరిశీలించాకే... ఏడాది కాలంగా పెండింగ్లోఉన్న బకాయిల రికవరీ, చెల్లింపుల విషయంలో ఎన్ఎస్ఈఎల్ చేతులెత్తేసిందని.. దీంతో తగిన వనరులున్న ఎఫ్టీఐఎల్లో విలీనం చేయడంద్వారా చెల్లింపులను వేగంగా రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 2013 నాటికి ఎన్ఎస్ఈఎల్ నెట్వర్త్ రూ.175.76 కోట్లుగా అంచనా. విలీనానికి సంబంధించి విధివిధానాలన్నీ పాటిస్తామని.. ఇరు కంపెనీల వాటాదారులు, రుణదాతలు తమ అభ్యంతరాలు/సూచనలను 60 రోజుల్లోగా వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. ముఖ్యంగా కంపెనీల చట్టం-1956లోని పలు నిబంధనలను ఇరు కంపెనీలూ ఉల్లంఘించినట్లు తమ దర్యాప్తులో తేలిందని.. అంతేకాకుండా ఎఫ్టైఎల్, దాని కీలక యాజమాన్య వ్యక్తుల నియంత్రణలో ఎన్ఎస్ఈఎల్ నడిచిందన్న విషయం కూడా వెలుగుచూసినట్లు కార్పొరేట్ వ్యవహరాల శాఖ ముసాయిదా ఆదేశాల్లో తెలిపింది. ఎన్ఎస్ఈఎల్పై ఏవైనా కేసులు నమోదుకావాలన్నా, లేదంటే ఎలాంటి చట్టపరమైన చర్యలైనా ఎఫ్టీఐఎల్పైనే ఫైల్ చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ల ఆనందం... ఇదిలాఉండగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ల ఫోరం(ఎన్ఐఎఫ్) స్వాగతించింది. చెల్లిం పులు నిలిచిపోయిన 13,000 మంది ఇన్వెస్టర్లు కలసి ఈ ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఎన్ఐఎఫ్ చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షేరు క్రాష్: ప్రభుత్వ విలీన ఆదేశాల వార్తలతో ఎఫ్టీఐఎల్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 20 శాతం కుప్పకూలి లోయర్ సర్కూట్ను తాకింది. రూ.169.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.200 కోట్ల మేర ఆవిరైంది. రూ.781.72 కోట్లకు దిగజారింది. -
61శాతం పడిన ఫైనాన్షియల్ టెక్ లాభం
న్యూఢిల్లీ: జిగ్నేష్ షా నేతృత్వంలోని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఇం డియా) నికర లాభం రెండవ త్రైమాసికంలో 61 శాతంపైగా పడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన సంస్థ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే రూ.70 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పడిపోయింది. సంక్షోభంలో కూరుకుపోయిన అనుబంధ సంస్థ నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఎల్)కి కేటాయింపులు జరపాల్సి రావడం దీనికి ప్రధాన కారణం. ఇక నిర్వహణపరమైన ఆదాయం సైతం రూ.125 కోట్ల నుంచి రూ.93 కోట్లకు పడిపోయింది. సాఫ్ట్వేర్ బిజినెస్పరంగా రెవెన్యూ తగ్గడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది. వ్యయాలు రూ.55 కోట్ల నుంచి రూ. 68 కోట్లకు ఎగశాయి. కాగా షేర్కు రూ. 2 మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 20న ఈ చెల్లింపులు ఉంటాయి. -
ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం సర్వనాశనం చేసింది: జిగ్నేష్ షా
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం తన జీవిత కాలం పడ్డ కష్టాన్ని సర్వనాశనం చేసిందని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా (ఎఫ్టీఐఎల్) చైర్పర్సన్ జిగ్నేష్ షా వ్యాఖ్యానించారు. ఆర్థిక నష్టంకన్నా కూడా తన విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రల వల్ల తాను, తన కుటుంబం తీవ్ర క్షోభకు గురయ్యామని ఆయన చెప్పారు. ఎంసీఎక్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఆయన రాజీనామా చేశారు. ఎన్ఎస్ఈఎల్, ఎంసీఎక్స్ సంస్థలకు ఎఫ్టీఐఎల్ మాతృ సంస్థ. రూ. 5,600 కోట్ల చెల్లింపులకు సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) కొత్త ఎండీ, సీఈవో కోసం అన్వేషణ ప్రారంభించింది. కనీసం 20 ఏళ్ల అనుభవమున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఇప్పటికే ఆహ్వానించింది. ఈ నెల 19న ఎండీ శ్రీకాంత్ జవల్గేకర్ రాజీనామా చేసిన నేపథ్యంలో తాజా అన్వేషణ అనివార్యమైంది. ప్రస్తుతం డిప్యుటీ ఎండీ పర్వీన్ కుమార్ సింఘాల్ ఎంసీఎక్స్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. -
డిఫాల్టర్లపై చర్యలు
న్యూఢిల్లీ: చెల్లింపులలో విఫలమైన(డిఫాల్టర్లు) కొనుగోలుదారులపై చర్యలు తీసుకోమంటూ నేషనల్స్పాట్ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)ను ప్రభుత్వం ఆదేశించింది. ఎన్ఎస్ఈఎల్ గత వారం ప్రభుత్వానికి సమర్పిం చిన ప్రణాళిక ప్రకారం ఈ నెల 16న తొలి పేమెం ట్ రోజు కావడంతో కొంతమంది కొనుగోలుదారులు నగదు చెల్లింపులో విఫలమై ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. డిఫాల్టర్లపై నిబంధనల ప్ర కారం చర్యలను తీసుకోవడమేకాకుండా వారి వివరాలను కూడా ఇవ్వమంటూ ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఎన్ఎస్ఈఎల్ గిడ్డంగులలో ఉన్న సరుకులపై ఆడిట్ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇన్వెస్టర్లకు సంబంధించి రూ. 5,600 కోట్ల సెటిల్మెంట్లకు హామీదారు(గ్యారంటర్) కావడంతో బాధ్యతలను పూర్తిచేయాల్సిందిగా కూడా ఎన్ఎస్ఈఎల్ను వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఆదేశించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement