-
సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లపై దాడులు
నగరంలోని పంజాగుట్టలో కుటుంబ ఆర్థిక గణన సర్వే కోసం ఇంటికి వచ్చి వివరాలు అడిగిన ఎన్యూమరేటర్కు సమాచారం అందించేందుకు నిరాకరించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇలాంటి ఘటనలు మాస్ ఏరియాలో కాకుండా క్లాస్ ఏరియాలో ఎదురు కావడం విస్మయానికి గురిచేస్తోంది. సాక్షి, హైదరాబాద్: నగరంలో కుటుంబ ఆర్థిక గణన సర్వేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వివరాలు అందించేందుకు కొందరు సవాలక్ష సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దాడులకు సైతం పాల్పడుతున్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు నగరంలో ఏడో ఆర్థిక గణన సర్వే మూణ్నెల్లుగా కొనసాగుతోంది. ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారు. దీని ద్వారా దారిద్యరేఖకు దిగువ, ఎగువ కుటుంబాల తలసరి ఆదాయాల లెక్క తేలనుంది. 11.4 లక్షల కుటుంబాల సర్వే పూర్తి.. ⇔ నగరంలో ఇప్పటి వరకు సుమారు 11.4 లక్షల కుటుంబాల గణన పూర్తయ్యింది. అందులో 10,28,462 నివాస గృహాలు, 64,694 వాణిజ్య దుకాణాలు, 10,917 ఇతరత్రా సముదాయాల సర్వే పూర్తయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ⇔ హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 15 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసిన అధికారులు ఆర్థిక గణన సర్వే కోసం సుమారు 1,394 ఎన్యూమరేటర్లను రంగంలోకి దింపారు. 196 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో మొత్తం 266 యూనిట్లుగా విభజించగా ఇప్పటి వరకు 134 యూనిట్లు పూర్తి చేశారు. మార్చి 31నాటికి సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. 30 అంశాలపై .. ⇔ నగరంలో కుటుంబ ఆర్థిక గణన సుమారు 30 అంశాలపై కొనసాగుతోంది. ప్రతి కుటుంబం జీవనశైలి, నివాసాలు, ఆర్థిక వనరులు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారు. ప్రతి కుటుంబంనుంచి సేకరించిన వివరాలను అక్కడికక్కడే ఎన్యూమరేటర్ మొబైల్ యాప్లో పొందుపరుస్తున్నారు. ⇔ ఎన్యూమరేటర్లకు జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్, యాప్ లెవల్ డేటా ధ్రువీకరణ, డేటాను సంరక్షించేందుకు సురక్షితం కోసం లాగిన్,వెబ్ అప్లికేషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదికలను పైస్థాయి అధికారులకు అప్లోడ్ చేసేలా సులభతరంగా వీటిని రూపొందించారు. ⇔ సర్వే రెండు రకాలుగా ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ఇల్లు తీరును పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇంటి ముందు దుకాణాలు ఉన్నా, ఇంటి ముందు కమర్షియల్ గదులు ఉన్నా, మొత్తంగా కమర్షియల్ దుకాణాలు ఉన్నా వివిధ విభాగాల కింద వివరాలను సేకరించి నమోదు చేస్తారు. ⇔ నార్మల్ హౌస్హోల్డ్, సెమీ నార్మల్ హౌస్హోల్డ్, కమర్షియల్ విభాగాల కింద సర్వే వివరాలను నమోదు చేస్తారు. ఆర్థిక గణన కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన కామన్ సర్వీసెస్ సెంటర్స్ ద్వారా సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లా మేనేజర్లు శివారెడ్డి, గౌతం ఈ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. సర్వేకు సహకరించండి.. కుటుంబ ఆర్థిక గణన సర్వేకు సహకరించాలి. భవిష్యత్తులో బహుళ ప్రయోజనకారిగా ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలు వెల్లడిస్తే సరిపోతుంది. ఇబ్బందేమీ ఉండదు. - డాక్టర్ ఎన్.సురేందర్, జిల్లా ప్రణాళిక అధికారి -
హైదరాబాద్లో వన్ మిలియన్ డిజిటల్ సర్వేలు
సాక్షి, హైదరాబాద్: యువతకు డిజిటల్ లిటరసీపై అవగాహన కల్పిస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరిచిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) మరో శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడో ఆర్థిక సర్వే(డిజిటల్)లో ఎన్యూమరేటర్లుగా దాదాపు ఐదారువేల మందికి అవకాశం కల్పించబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ని ‘టీటా’ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల విడుదల చేసి సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఐటీ అసోసియేషన్ అనుబంధ సంస్థ డిజిథాన్తో కలిసి ‘సీఎస్సీ’ ఈ సర్వేను నిర్వహిస్తున్నదని తెలిపారు. సర్వేలో భాగంగా పది లక్షల నివాసాలకు వాలంటీర్లు వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలు సేకరిస్తారని తెలిపారు. గ్రేటర్ పరిధిలో 573 ఇన్వెస్టిగేటర్ యూనిట్లు ఉన్నాయని, ఒక్కో యూనిట్కు పది మంది వరకు ఎన్యూమరేటర్లు అవసరమని ఆయన వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, స్మార్ట్ ఫోన్ వాడకంలో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు bit.ly/censussurvey వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని సందీప్ చెప్పారు. ఈ డిజిటల్ సర్వేను సీఎస్సీ హైదరాబాద్ విభాగం మేనేజర్ పర్యవేక్షిస్తున్నారని, మరిన్ని వివరాలకు కార్యాలయ వేళల్లో 6300368705/ 9542809069/ 7989702090/ 9948185053 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఎన్పీఆర్ అమలుకు రంగం సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరణ, జనాభా గణన, గృహ ఆస్తుల వివరాల సేకరణ (హౌస్ లిస్టింగ్)కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వం శిక్షణ ఇచ్చి నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి వివిధ వివరాలు సేకరించనున్నారు. ‘మీరు, మీ తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం ఏమిటి?.. మీరు భారతీయులేనా? మీ ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నంబర్ ఏమిటి?. మీకు చట్టబద్ధంగా, సంప్రదాయబద్ధంగా పెళ్లైందా లేక సహజీవనం చేస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన రుజువులను ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే ఎన్యూమరేటర్లు తీసుకోనున్నారు. అయితే సర్వేకు వచ్చినప్పుడు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్యూమరేటర్లు కుటుంబ పెద్దను కోరనున్నట్లు ఎన్పీఆర్–2020 యూజర్ మాన్యువల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పౌరసత్వ చట్టం–1955, పౌరసత్వ నిబంధనలు–2013 కింద ఎన్పీఆర్కు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దేశ పౌరులతోపాటు దేశంలో నివాసముంటున్న విదేశీయుల సమాచారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా సేకరించనుంది. ఎన్పీఆర్ కింద అడిగే ప్రశ్నలు.... 1. ఎన్పీఆర్ బుక్లెట్పై ముద్రించిన పేరు సరైనదేనా? (ఒకవేళ తప్పులుంటే పేరును బుక్లెట్లో సరిచేస్తారు. ప్రతి వ్యక్తి పేరును కరెక్టుగా నమోదు చేయడం కీలకమని ఎన్పీఆర్ నియమావళి పేర్కొంటోంది) 2. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎంత మంది? (కుటుంబ సభ్యులు ఎవరైనా వలస వెళ్లినా, చనిపోయినా నమోదు చేసుకుంటారు) 3. కుటుంబ పెద్దతో ఇతర సభ్యుల బంధుత్వం. 4. పురుషులా.. మహిళలా లేక ఇతరులా? 5. వివాహ స్థితిగతులు. (అవివాహితులు, వివాహితులు, వితంతువు/భార్య చనిపోయిన వ్యక్తి, విడిపోయిన వారు, విడాకులు పొందిన వారు వంటి వివరాలు సేకరిస్తారు. రెండోసారి పెళ్లి చేసుకున్నా లేక సహజీవనం చేస్తున్నా పెళ్లయిన వ్యక్తుల కిందే లెక్కగట్టనున్నారు) 6. కుటుంబ సభ్యుల పుట్టిన తేదీ ఏమిటి? (తప్పుగా ఉంటే సరిచేస్తారు. ఒకవేళ ఎవరైనా తమ పుట్టిన తేదీ, నెల వివరాలు అందించలేని స్థితిలో ఉంటే కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే నమోదు చేస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్లో పుట్టిన తేదీ కీలకం. ఒకవేళ పుట్టిన తేదీ సమాచారం అందించలేని పరిస్థితిలో ఉంటే సంబంధిత వ్యక్తుల స్కూల్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్కార్డు, పాస్పోర్టు, ఇతర పత్రాల ఆధారంగా పుట్టిన తేదీని సేకరిస్తారు. అవి కూడా లేకపోతే సభ్యుల జాతక చక్రాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. జాతకచక్రం కూడా లేకుంటే ఎన్యూమరేటర్లే వయసును అంచనా వేసి నమోదు చేసుకోనున్నారు) - కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే తెలిసి ఉంటే పుట్టిన తేదీని అంచనా వేసేందుకు ఎన్యూమరేటర్లు పలు ప్రశ్నలు అడగనున్నారు. వర్షాకాలంలో పుట్టారా లేదా తర్వాత? పుట్టిన నెలలో దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ వంటి ఏమైనా పండుగలు వచ్చాయా? గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి సెలవులు వచ్చాయా? వంటి ప్రశ్నలను సంధించడం ద్వారా పుట్టిన తేదీని అంచనా వేయనున్నారు. - పుట్టిన తేదీ, సంవత్సరం రెండూ తెలియని పక్షంలో ఎప్పుడు పుట్టారో తెలుసుకోవడానికి దేశ చరిత్రలో కీలక ఘట్టాలుగా నిలిచిన సంఘటనల ఆధారంగా వ్యక్తుల వయసును ఎన్యూమరేటర్లు అంచనా వేయనున్నారు. తొలి ప్రపంచ యుద్ధం (1914–18), దండి యాత్ర (1930), క్విట్ ఇండియా ఉద్యమం (1942), స్వాతంత్య్ర దినోత్సవం (1947), చైనాతో యుద్ధం (1962), పాకిస్తాన్తో యుద్ధం (1965), బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం (1971), ఏసియాడ్ క్రీడలు (1982), భారత్ తొలి క్రికెట్ ప్రపంచకప్ విజయం (1983) సాధించినప్పుడు పుట్టారా? అని అడిగి తెలుసుకోనున్నారు. 7. మీరు పుట్టిన ప్రాంతం ఏమిటి? (దేశంలో పుడితే రాష్ట్రం, జిల్లా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది) 8. మీ జాతీయత ఏమిటి? భారతీయులేనా? (మీరు పాస్పోర్టు నంబర్ స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించనున్నారు) 9. మీ విద్యార్హతలు ఏమిటి? (ప్రీ ప్రైమరీ, ప్రాథమిక, 1–12 తరగతులు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ డిప్లొమా, టీటీసీ, ఇతర డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్, పీజీ ఆపై, సరైన విద్య లేని, నిరక్షరాస్యులా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు) 10. మీ వృత్తి ఏమిటి? (వ్యవసాయం, రోజుకూలీ, స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగి యజమాని, ప్రైవేటు ఉద్యోగి, డొమెస్టిక్ హెల్పర్, నాన్ వర్కరా? అని అరా తీయనున్నారు) 11. తల్లి మాతృ భాష ఏమిటి? 12. మీ శాశ్వత చిరునామా చెప్పండి 13. ప్రస్తుత చిరునామాలో ఓ సభ్యుడు పుట్టినప్పటి నుంచి ఉంటున్నాడా? (ఒకవేళ లేకుంటే ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాడు? అంతకు ముందు ఎక్కడ ఉన్నాడో తెలపాలి) 14. తండ్రి, తల్లి, భాగస్వామి వివరాలు (తల్లిదండ్రుల గణన ఈ ఇంట్లో జరగని పక్షంలో వారి పేర్లు, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. భాగస్వామి అయితే కేవలం పేరు మాత్రమే రాస్తారు. అదే ఇంట్లో తల్లిదండ్రులు, భాగస్వామి గణన నిర్వహిస్తే వారి పేర్లు, దేశం/విదేశంలో పుట్టిన ప్రాంతం, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రుల పుట్టిన తేదీ వివరాలు రూఢీ కాకపోతే సంబంధిత కాలమ్లో ‘–’అని పెడతారు. 15. ఆధార్, మొబైల్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లు అందుబాటులో ఉంటే తీసుకుంటారు. జనాభా గణనకు అర్హులైన వారు.. - ఎన్యూమరేటర్ వచ్చిన సమయంలో ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు. - జనాభా గణన నిర్వహించే సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఇంటి సాధారణ నివాసితులు. - ఇంటి సాధారణ నివాసితులై ఉండి ఎన్యూమరేటర్ సందర్శనకు వచ్చిన సమయంలో ఇంట్లో లేని వ్యక్తులు జనాభా గణన ముగిసేలోగా తిరిగి వస్తే వారి వివరాలను సైతం సేకరించనున్నారు. - సందర్శకులు, పనిమనుషులు, అద్దెకు ఉండే వ్యక్తులు, డ్రైవర్లు లేదా అలాంటి వ్యక్తులు ఓ గృహ పరివారంతో కలసి ఉండటంతోపాటు పైన పేర్కొన్న మూడు అర్హతలను కలిగి ఉంటే వారి వివరాలను సైతం సేకరిస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్–2010 ఆధారంగా... దేశంలో నివాసముంటున్న ప్రజలందరికీ సంబంధించిన ఎన్పీఆర్ డేటాబేస్ను తొలిసారిగా 2010లో తయారు చేశారు. జనగణన–2011 కార్యక్రమంలో భాగంగా 2010లో నిర్వహించిన సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్పీఆర్ డేటాను రూపొందించారు. ఆ వివరాలతో ‘ఎన్పీఆర్ డేటా బుక్లెట్’ను ముద్రించనున్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ పెద్ద నుంచి జనాభా గణనతోపాటు ఎన్పీఆర్కు సంబంధించి తాజా సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్పీఆర్ బుక్లెట్స్లో సంబంధిత కుటుంబం/వ్యక్తులకు సంబంధించి ముద్రించి ఉన్న సమాచారాన్ని సరిపోల్చి చూడనున్నారు. ఇందుకు అవసరమైతే ఆధార్, ఓటర్ ఐడీ కార్డు వంటి రుజువులను చూపాలని కోరనున్నారు. పాత ఎన్పీఆర్ డేటాబేస్లో ఎవైనా తప్పులుంటే సరిచేయడంతోపాటు అవసరమైన కొత్త సమాచారాన్ని నమోదు చేసుకోనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా పాత ఎన్పీఆర్ డేటాబేస్లో ఉన్న కుటుంబాల్లో కొత్త సభ్యులున్నట్లుగానీ, కొత్త కుటుంబాలున్నట్లుగానీ గుర్తిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లకు ‘ఖాళీ ఎన్పీఆర్ ఫారాలను’కేంద్రం అందించనుంది. ఓ కుటుంబానికి సంబంధించిన ఎన్పీఆర్ బుక్లెట్లో ఆ కుటుంబానికి సంబంధించిన కొత్త సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు అవసరమైన ఖాళీ పేజీలుంటే అదే బుక్లెట్లో నమోదు చేయనున్నారు. - కుటుంబలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన ఎన్పీఆర్ డేటాబేస్ను నవీకరిస్తారు. - నవీకరించిన ఎన్పీఆర్ డేటాబేస్ను కుటుంబ పెద్దకు చూపించడంతోపాటు బుక్లెట్పై అతడి/ఆమె సంతకం/వేలిముద్రను సేకరించనున్నారు. - కుటుంబ సభ్యుల పేర్లు, సంఖ్య, ఇతర అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దది అని ఎన్పీఆర్ నిబంధనలు పేర్కొంటున్నాయి. - ఒకే గృహంలో నివాసముంటూ ఉమ్మడి కిచెన్పై ఆధారపడిన రక్తసంబంధికులతోపాటు ఏ సంబంధం లేని వ్యక్తుల ఎన్పీఆర్ డేటాను ‘సాధారణ గృహాల’విభాగం కింద స్వీకరించనున్నారు. - బోర్డింగ్ గృహాలు, మెస్లు, హాస్టళ్లు, హోటళ్లు, రెస్క్యూ గృహాలు, అబ్జర్వేషన్ హోంలు, బెగ్గర్ హోంలు, జైళ్లు, ఆశ్రమాలు, వద్ధాశ్రమాలు, బాల గృహాలు, అనాథాశ్రమాలు వంటి భవనాల్లో నివాసముండే ఏ బంధుత్వం లేని వ్యక్తుల ఎన్పీఆర్ డేటాను వ్యవస్థాగత గృహాల విభాగం కింద సమీకరించనున్నారు. - ఎన్పీఆర్ బుక్లెట్పై రాష్ట్రం/జిల్లా/తహసీల్/తాలుకా/పోలీస్ స్టేషన్/డివిజన్ బ్లాక్/సర్కిల్ బ్లాక్/మండలం/పట్టణం/గ్రామం పేర్లతో వాటికి సంబంధించిన కోడ్లు ముద్రించి ఉండనున్నాయి. వార్డు, హౌస్హోల్డ్ బ్లాక్ నంబర్, సబ్బ్లాక్ నంబర్, పిన్కోడ్ వంటి వివరాలు సైతం ఉండనున్నాయి. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
► జిల్లాలో పూర్తి కావచ్చిన పల్స్ సర్వే ► సిబ్బందికి చెల్లించాల్సిన గౌరవ వేతనంలో జాప్యం ► ఎన్యూమరేటర్ల ఎదురుచూపు జనాలకు నిద్రపట్టినివ్వలేదు.. సిబ్బందిని పడుకోనివ్వలేదు.. సామాన్యుల్లో ఒకటే టెన్షన్. స్మార్ట్ సర్వేలో నమోదు అరుుతే చిక్కులు తప్పవని.. దాని తీరూ అలాగే ఉంది. ప్రస్తుతానికి ఆ విషయం పక్కనపెడితే రేరుుంబవళ్లు సర్వే పేరుతో ఒళ్లు గుల్ల చేసుకొని.. పని పూర్తి చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. చేసిన శ్రమకు గౌరవ వేతనం ఇంకా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది. - ఒంగోలు టౌన్ ‘ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే చివరి దశకు చేరుకొంది. ఆరునెలలపాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది. అరుుతే కష్టపడిన ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఊసే ఎత్తడం లేదు. దీని కోసం వారంతా ఎదురు చూస్తున్నారు’ జేబులో డబ్బుతో.. సర్వే చేసిన సమయంలో సిబ్బంది కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. సిగ్నల్స్ దొరక్కపోవడంతో పాటు జేబులో డబ్బు పెట్టి మరీ నెట్ బిల్లు చెల్లించి సర్వే పూర్తి చేశారు. అరుుతే ఈ నగదు కూడా తమ ఖాతాలో జమ అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే ప్రారంభం కాగా.. 8,60,463 ఇళ్లను సందర్శించి 33,59,220 మంది వివరాలు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిలో 2251 మంది ఎన్యూమరేటర్లను, వారి పనితీరును పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించేందుకు 295 మంది సూపర్వైజర్లను నియమించారు. ఒక్క పేరుకు రూ. 4 ఒక్కో ఎన్యూమరేటర్ ఒక పేరు సర్వేలో పొందుపరిస్తే నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేటర్ చేసిన సర్వేలో దానిలో పదిశాతం సూపర్వైజర్కు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీంతో కొన్ని శాఖలకు చెందినవారు తమ విధులను పక్కనపెట్టి పూర్తి స్థారుులో సర్వేలో పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులంతా అందుబాటులో లేకపోవడంతో ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు తిరిగిన సందర్భాలున్నారుు. పైగా కొంతమంది అథంటికేషన్(థంబ్, ఐరిష్) వంటివి లేకపోవడంతో మరోమారు వివరాలను సేకరించాల్సి వచ్చింది. రూ 3.47కోట్లకు రూ. 1.70 కోట్లే! జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి 3.47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్ల రెమ్యునరేషన్ నుంచి మెటీరియల్ తదితర వాటికి లెక్కలు వేసి నివేదించారు. అరుుతే ప్రభుత్వం కోటి 70లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం వచ్చిన ఈ మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు సర్వే ప్రారంభించిన సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన వారిలో కొంతమంది శాఖాపరమైన విధి నిర్వహణకు సంబంధించి ఒత్తిళ్లు ఉండటంతో స్మార్ట్ పల్స్ సర్వే నుంచి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. సర్వే చేస్తూ మధ్యలో మానివేసిన వారి వివరాలు, ప్రస్తుతం సర్వే చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూ వారి ఖాతాల్లో రెమ్యునరేషన్ వేసే విషయంలో గందరగోళం నెలకొంది. -
ఎన్యూమరేటర్ సస్పెన్షన్
► స్మార్ట్ పల్స్ సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం ►విజయనగరం మున్సిపాలిటీలోని పలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ విజయనగరం మున్సిపాలిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే తుది దశకు చేరుకుందని, ఇప్పటికీ సర్వే పరిధిలోకి రాని ప్రజలను గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ వివేక్యాదవ్ ఆదేశించారు. మంగళవారం విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని పలుప్రత్యేక శిబిరాల్లో చేపడుతున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిధిలో గల లంకాపట్నం ఆది ఆంధ్ర మున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్ను పరిశీలించారు. అక్కడ సర్వే కోసం ప్రజలెవ్వరు రాకపోగా... నియమించిన ఇద్దరు ఎన్యూమరేటర్లలో విధులకు గైర్హాజరైన త్రినాథ్ను విధుల నుంచి సస్పెన్షన్ చేయాలని మున్సిపల్ ఇంజినీర్ను ఆదేశించారు. అదేవిధంగా 10వ వార్డులోని ఆదిభట్ల నారాయణ దాసు పురపాలక ప్రాథమిక పాఠశాలలో, 20వ వార్డులోని జొన్నగుడ్డి వినాయకనగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ను పరిశీలించారు. ఈ సందర్భంగా 20 వ వార్డకు కేటారుుంచిన ఇద్దరు ఎన్యూమరేటర్లు 209 మందిని సర్వే చేయాల్సి ఉండగా.. మరో 94మంది సర్వే పరిధిలోకి రావాల్సి ఉన్నట్లు వివరించారు. తరువాత 30 వ వార్డు పరిధిలోని కంటోన్మెంట్ హిందూమున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్ను పరిశీలించారు. సర్వే చేపడుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. వివిధ కారణాల వల్ల జిల్లాలో సర్వే పరిధిలోకి రాకుండా మిగిలిపోరుున వారి కోసం ఈనెల 19 నుంచి 23వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీ కార్యాలయాలతో పాటు పట్టణ పరిధిలో వార్డు పోలింగ్ బూత్లలో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారంతా విధిగా వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెనుక మున్సిపల్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, విజయనగరం తహసీల్దార్ శ్రీనివాసరావు, టౌన్ప్లానింగ్ అధికారి శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement