-
మొబైల్ స్పీడ్లో మెరుగుపడ్డ భారత్.. 5జీ రాకతో దూకుడు!
దేశంలో 5జీ సేవలు విస్తృతం కావడంతో మొబైల్ స్పీడ్లో భారత్ మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా సగటు మొబైల్ వేగంలో మన దేశం జనవరిలో 10 స్థానాలు ఎగబాకింది. డిసెంబర్లో 79వ స్థానంలో ఉన్న భారత్ జనవరిలో 69వ స్థానానికి చేరుకున్నట్లు ఊక్లా నివేదిక పేర్కొంది. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్లోనూ భారత్ తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుంది. డిసెంబర్లో 81వ స్థానంలో ఉండగా జనవరిలో 79వ స్థానానికి చేరుకుందని నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్సైట్స్ ప్రొవైడర్ ఊక్లా నివేదించింది. ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటు డిసెంబర్లో 49.14 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 50.02 ఎంబీపీఎస్కి స్వల్పంగా పెరిగింది. కాగా ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటులో భారత్ నవంబర్లో 105వ స్థానంలో ఉండేది. ఈ ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటు గత డిసెంబర్లో 25.29 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 29.85 ఎంబీపీఎస్కు మెరుగుపడింది. జనవరి స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ఓవరాల్ సగటు మొబైల్ స్పీడ్ చార్ట్లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. ఇదే సమయంలో పపువా న్యూగినియా ర్యాంక్ ఏకంగా 24 స్థానాలు మెరుగుపడటం గమనార్హం. ఇక ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటులో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా సైప్రస్ 20 స్థానాలను మెరుగుపరుచుకుంది. -
బ్రాడ్బ్యాండ్ నిర్వచనం మార్పు
న్యూఢిల్లీ: బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ నిర్వచనాన్ని ప్రభుత్వం సవరించింది. కనీస డౌన్లోడ్ స్పీడ్ను 2 ఎంబీపీఎస్కు (మెగాబిట్స్ పర్ సెకండ్) పెంచింది. 2013 జూలై నాటి నిర్వచనం ప్రకారం ఇది 512 కేబీపీఎస్గా (కిలోబిట్స్ పర్ సెకండు) ఉండేది. తాజా మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత వినియోగదారులకు ఈ కొత్త నిర్వచనంతో ప్రయోజనం చేకూరగలదని బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టీవీ రామచంద్రన్ చెప్పారు. డౌన్లోడ్ స్పీడ్ను బట్టి ఫిక్సిడ్ బ్రాడ్బ్యాండ్ను బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఊక్లా నిర్వహించే స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం గతేడాది డిసెంబర్లో భారత్లో సగటున మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ 25.29 ఎంబీపీఎస్గా నమోదైంది. నవంబర్లో ఇది 18.26 ఎంబీపీఎస్గా ఉండేది. 2022 నవంబర్ 30 నాటికి దేశీయంగా 82.54 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ యూజర్లు ఉండగా, వీరిలో 79.35 కోట్ల మంది వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. -
అదిరిపోయేలా 5జీ డౌన్లోన్ స్పీడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా 5జీ డౌన్లోడ్ స్పీడ్ 5.92 జీబీపీఎస్ నమోదైనట్టు ప్రకటించింది. ఎరిక్సన్తో కలిసి మహారాష్ట్రలోని పుణేలో నిర్వహిస్తున్న 5జీ పరీక్షల్లో ఈ మైలురాయిని చేరుకున్నట్టు కంపెనీ శుక్రవారం వెల్లడించింది. గతంలో డౌన్లోడ్ స్పీడ్ 4 జీబీపీఎస్ నమోదైందని వివరించింది. చదవండి: 5జీ ప్రొడక్ట్స్ తయారీకి విప్రో, హెచ్ఎఫ్సీఎల్ జోడీ -
రిలయన్స్ జియో సరికొత్త రికార్డు..!
2021 సెప్టెంబర్ గాను పలు టెలికాం సంస్థల డౌన్లోడింగ్, ఆప్లోడింగ్ స్పీడ్స్ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసింది. ఎప్పటిలాగే రిలయన్స్ జియో డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో మరోసారి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రిలయన్స్ జియో అత్యధికంగా 20.9 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని సాధించింది. ట్రాయ్ 4జీ స్పీడ్ చార్ట్ ప్రకారం... డౌన్లోడింగ్ విషయంలో వోడాఫోన్ ఐడియా సగటున 14.4 ఎమ్బీపీఎస్ వేగంతో, ఎయిర్టెల్ సగటున 11.9 ఎమ్బీపీఎస్ వేగాన్ని సాధించాయి. చదవండి: ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి! వోడాఫోన్ ఐడియానే టాప్...! అప్లోడింగ్ విషయంలో వోడాఫోన్ ఐడియా 7.2 ఎమ్బీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది. వోడాఫోన్ ఐడియా తరువాత రిలయన్స్ జియో 6.2 ఎమ్బీపీఎస్, భారతీ ఎయిర్టెల్ 4.5 ఎమ్బీపీఎస్ అప్లోడ్ వేగాన్ని సాధించాయి. వినియోగదారులకు ఇంటర్నెట్ నుంచి కంటెంట్ను యాక్సెస్ చేయడంలో రిలయన్స్ జియో ముందుంది. గత నెలలో మూడు టెలికాం ప్రైవేట్ ఆపరేటర్ల 4జీ అప్లోడ్ వేగం మెరుగుపడినట్లు ట్రాయ్ వెల్లడించింది. డౌన్లోడింగ్, అప్లోడింగ్ వేగాన్ని వేగాన్ని ట్రాయ్ తన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో లెక్కిస్తోంది.ట్రాయ్ డేటా ప్రకారం...జియో 4జీ నెట్వర్క్ వేగం 15 శాతం మేర పెరిగింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వరుసగా 85 శాతం, 60 శాతం మేర డౌన్లోడింగ్ స్పీడ్ పెరిగింది. చదవండి: షావోమీ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ..! ఎప్పుడు వస్తాయంటే..? -
4జీ స్పీడ్లో రికార్డు సృష్టించిన జియో..!
న్యూ ఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరోసారి సత్తా చాటింది. 4జీ నెట్వర్క్ డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో జియోకు సాటిలేదని మరోసారి రుజువైంది. మే నెలలో డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో ఇతర నెట్వర్క్లకంటే సెకనుకు సరాసరి 20.7 ఎమ్బీపీఎస్ స్పీడ్తో జియో నెట్వర్క్ ముందంజలో ఉంది. కాగా ఈ విషయాన్ని టెలికాం రెగ్యూలేటర్ ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతోపాటుగా వోడాఫోన్ అప్లోడింగ్ స్పీడ్లో ముందంజలో నిలిచింది. వోడాఫోన్ సుమారు 6.7 ఎమ్బీపీఎస్ అప్లోడింగ్ స్పీడ్ను కలిగి ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జూన్ 8 న ప్రచురించిన గణాంకాల ప్రకారం.. వోడాఫోన్-ఐడియా మే నెలలో సగటున 6.3 ఎమ్బిపిఎస్ అప్లోడ్ వేగాన్ని కలిగి ఉండగా, దీని తరువాత రిలయన్స్ జియో 4.2 ఎమ్బీపీఎస్ వేగంతో, భారతి ఎయిర్టెల్ 3.6 ఎమ్బీపీఎస్ అప్లోడింగ్ వేగాన్ని కల్గి ఉన్నట్లు ట్రాయ్ పేర్కొంది. కాగా తాజాగా రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్ స్పీడ్ స్వల్పంగా పెరగ్గా, ఇది వోడాఫోన్-ఐడియాతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువ. ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ ఎంచుకున్న ప్రాంతాల్లోనే 4జీ సేవలను ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ 4జీ స్పీడ్ను ట్రాయ్ తన నివేదికలో తెలుపకపోవడం గమనార్హం. దేశ వ్యాప్తంగా రియల్ టైమ్ ప్రాతిపదికన నెట్వర్క్ స్పీడ్ను మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో ట్రాయ్ లెక్కిస్తుంది. చదవండి: జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement