-
హైదరాబాద్ జిల్లా అధికారులపై ఈసీకి వరుస ఫిర్యాదులు
-
అమ్మాయి పేరులోనే ఉన్నది గుర్తింపు
మన సమాజాలలో కూతురి పేరును ఇంటి బయట నేమ్ప్లేట్గా బిగించడం ఎంత విస్తృతంగా చూస్తాం? చాలా కొన్ని ఇళ్లకి భార్య పేరుతో ఇంటి పేరు పెట్టడం కనిపిస్తుంది. కాని ఎక్కువ ఇళ్లకు భర్త ఉద్యోగాన్ని, హోదాని, ఆ ఇంటి యజమాని ఎవరో తెలిపే వివరాన్ని చెప్పే నేమ్ప్లేట్లే ఉంటాయి. న్యాయమూర్తులైనా, పోలీస్ ఆఫీసర్లైనా, ఐ.ఏ.ఎస్లైనా, టీచర్లైనా, వ్యాపారవేత్తలైనా ఎవరైనా సరే వారి పేరు ఇంటి బయట నేమ్ప్లేట్గా పెట్టుకుంటారు. ఆ ఇళ్లలో భార్య మంచి ఉద్యోగంలో ఉన్నా ఆమె నేమ్ప్లేట్ కనిపించదు. ఇక ఇంట్లో కూతురు ఉంటే ఆ కూతురికి ఆ ఇల్లు ఎప్పటికీ చెందదనే వారసత్వ భావజాలం తరతరాల్లో ఉంది. ‘ఇలా ఉంటే అమ్మాయి పుడితే బెంబేలు పడే రోజులు ఎలా పోతాయి’ అనుకున్నారు ఉత్తరాంచల్ పౌరి గర్వాల్ జిల్లా అధికారులు. దానికి కారణం ఉంది. పౌరి గర్వాల్ జిల్లా కొండ ప్రాంతం. ఆడపిల్ల, మగపిల్లాడు అనే తేడా పెద్దగా అంటని ప్రాంతమే అయినా మెల్లగా పరిస్థితులు మారాయి. అక్కడ 2011 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1103 మంది స్త్రీలు ఉండేవారు. కాని తాజాగా 0–6 ఏళ్ల వయసు పిల్లల లెక్కలు తీసినప్పుడు వెయ్యి మంది అబ్బాయిలకు 904 మంది అమ్మాయిలే తేలారు. అమ్మాయిల వల్ల ‘పెళ్లి ఖర్చు’ అనేది తల్లిదండ్రుల సమస్య. అమ్మాయి ఏ ఇంట్లో పుట్టినా పెళ్లి తర్వాత ఆమెకు ఆ ఇంటి మీద ఏ హక్కు ఉండదు కదా అని ఆ అమ్మాయిని చేసుకుని వెళ్లేవారి సమస్య. అంటే ఇరువైపుల నుంచి ఆర్థిక విషయంగానే అమ్మాయిని చూసి ఆమె జననాన్ని నిరాకరించే పరిస్థి్థతులు ఏర్పడుతున్నాయి. నేమ్ప్లేట్లను పంచుతున్న జిల్లా యంత్రాంగం ‘అమ్మాయి చదవగలదు. మంచి ఉద్యోగం చేయగలదు. తాను స్వావలంబన పొందడమే కాదు... ఇంటిని, సమాజాన్ని కూడా ముందుకు నడపగలదు. ఆమెకు ఆస్తిలో హక్కు ఉంటుంది. అమ్మాయికి ఇంటిలో సమాన వాటా ఉంటుంది అని పదే పదే చెప్తే తప్ప మనుషులు గ్రహించరు’ అని పౌరి గర్వాల్ యంత్రాంగం గ్రహించింది. వెంటనే వారొక ఉద్యమాన్ని మొదలెట్టారు. ఆ ఉద్యమం పేరు ‘ఘౌర్ కి పచయన్... నౌని కి నౌ’. అంటే ‘ఇంటి కూతురిని బట్టి.. ఇంటిని గుర్తించు’ అని అర్థం. అధికారులు ఈ ఉద్యమం ప్రకారం జిల్లాలోని పల్లెలకు వెళ్లి సొంత ఇల్లు ఉన్న అన్ని కుటుంబాలతో మాట్లాడటం మొదలెట్టారు. ‘మీ అమ్మాయి పేరుతో నేమ్ప్లేట్ చేసిస్తాం. మీ ఇంటి బయట తగిలించండి’ అని కోరసాగారు. ఆశ్చర్యకరంగా ముందుగా ఈ ప్రతిపాదనకు తల్లులే స్పందించారు. ‘మా పెద్దమ్మాయి పేరు పెట్టండి’, ‘మా చిన్నమ్మాయి పేరు పెట్టండి’ అని సూచించసాగారు. ఇందుకు తండ్రులు, ఇళ్లల్లో ఉన్న కుమారులు పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు. ‘నా పేరుతో ఉన్న నేమ్ప్లేట్ దగ్గర నిలబడి నా ఇంటి ఫొటో దిగడం నాకు చాలా ఆత్మవిశ్వాసం ఇచ్చింది’ మథనా గ్రామానికి చెందిన ఆర్తి చెప్పింది. ఆమె సోషియాలజీలో మాస్టర్స్ చేస్తోంది. ‘ఇక మీదట మా ఇంటిని మా నాన్న పేరుతో కాకుండా ఇది ఆర్తీ ఇల్లేనా అని ఎవరైనా అడగాల్సిందే’ అని ఆ అమ్మాయి సంతోషపడింది. ఆర్తికి ఇంటర్ చదువుతో మానేసిన తమ్ముడు ఉన్నాడు. ఇంకో చెల్లెలు కూడా ఉంది. ‘ఇది మా ముగ్గురి ఇల్లు అనే భావం ఆ కుర్రాడి మనసులో మొదలయ్యేందుకు ఇలాంటి పనులు తోడ్పడతాయి’ అని ఒక ప్రభుత్వ అధికారి అన్నారు. మల్లి అనే ఊళ్లో టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్న ముకేష్ కుమార్ ఈ ఉద్యమంలో భాగంగా తన ఇంటికి తన 14 ఏళ్ల కూతురు ‘సిమ్రన్’ నేమ్ప్లేట్ బిగించాడు. ‘పూర్వపు రోజులు పోయాయి. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే’ అని అతడు సంతోషంగా అన్నాడు. అతను ఆ మాట అనడంతోటే పక్కనే ఉన్న సిమ్రన్ ‘ఇక నాకు దిగులు పోయింది. నా తల్లిదండ్రులు నన్ను పై చదువులు చదివిస్తారనే భావిస్తున్నా’ అని అంది. ఉత్తరాంచల్లో ఆడపిల్లలకు చదువు, ఉపాధి, కెరీర్ను ఎంపికను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఘర్షణతో సాధించుకోవాలి. కాని ప్రభుత్వం చేసే ఇలాంటి పనులు, ఆయా సంస్థలు చేసే చైతన్య కార్యక్రమాలు, మీడియా మార్పును తీసుకురాగలవు. ఇప్పుడు ఉత్తరాంచల్లో ఇంటింటా వెలుస్తున్న కూతురి పేర్ల నేమ్ప్లేట్లు ఆ సంగతినే చెబుతున్నాయి. – సాక్షి ఫ్యామిలీ -
కరోనా వైరస్: త్రిముఖ వ్యూహం..
సాక్షి, శ్రీకాకుళం: కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జిల్లా వాసులకు ఆ త్రిమూర్తులు అభయమిచ్చారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి సిక్కోలును కరోనా బారి నుంచి కాపాడడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి మధ్యనే గడు పుతూ ప్రజలకు ధైర్యం చెబుతున్నా రు. లాక్డౌన్లో జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. లాక్డౌన్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం అంతా చక్క గా పనిచేసినా వారిని సమన్వయపరచుకుని ముందుకెళ్లడంలో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విజయవంతమయ్యారు. ఈ ము గ్గురు అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజలకు ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కలెక్టర్ చొరవ ప్రశంసనీయం కరోనా ప్రభావం దేశంలో మొదలైన దగ్గరి నుంచే కలెక్టర్ జె.నివాస్ అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై కన్నేసి ఉంచారు. అధికారుల దగ్గరి నుంచి వలంటీర్లు, ఆశ కార్యకర్తల వరకు అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక, వైరస్ వ్యాప్తి జోరుగా జరుగుతున్న వేళ స్వయంగా జనంలోకి వచ్చి అప్రమత్తం చేశారు. లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ని త్యావసర సరుకులు, మందులు, కూరగాయలు అందుబాటులోకి తెచ్చారు. నిర్దేశిత ధరలకు ప్రజల దరి చేర్చా రు. లాక్డౌన్కు ముందు ఒక్కసారిగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రావడంతో వారిని ఊళ్లలోకి పంపించకుండా ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు పెట్టారు. జిల్లాకు 1,445 మంది విదేశాల నుంచి రాగా వారిలో 562 మందిని ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లలో పెట్టి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి బాగోగులు కూడా చూసుకున్నారు. 819 మందికి ఉచితంగా సరుకులు డోర్ డెలివరీ చేయించారు. వలస కూలీల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి రోజుకో రకం భోజనం పెడుతున్నారు. అనాథలు, నిరాశ్రయులకు కూడా రెడ్క్రాస్ సాయంతో రోజూ భోజనం పెడుతున్నారు. ప్రభు త్వ ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ.. సొంత వ్యూహంతో ముందుకువెళ్లారు. ఢిల్లీ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి ముస్లిం పెద్దలతో సమావేశమై సమస్త వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించిన వారి వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు లాక్డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్న మత్స్యకారులకు అండగా ఓ బృందాన్నే అక్కడకు పంపారు. ఎస్పీ అవిశ్రాంత యోధుడు జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక మరింత వేగం పెంచి, రోడ్లపైనే ఎక్కువగా ఉంటున్నారు. కరోనాపై స్వయంగా అవగాహన కలి్ప స్తున్నారు. ప్రధాన కూడళ్లల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్ల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధుల్లో ఉన్న పోలీసులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. ప్రతి రోజూ పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ముఖ్యమైన ఆదేశాలిస్తూ వస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ముందుగా గుర్తించి క్వారంటైన్లో ఉంచడమే కాకుండా వారు బయటికి రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాక్డౌన్లో రాష్ట్రంలో ప్రతి చోట పోలీసుల తీరుపై కొన్ని విమర్శలు వచ్చినా ఇక్కడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దూసుకుపోతున్న జేసీ లాక్డౌన్ అమల్లోకి రాగానే తిండికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. వైరస్ వస్తే ఎలా ఉంటుందో తెలీదు గాని తినడానికి తిండి దొరకకపోతే ఇలాగే చనిపోతేమోనన్న ఆందోళన మొదట్లో ఉండేది. కానీ వాటిన్నింటినీ జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పటాపంచలు చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు దొరకలేదన్న విమర్శలు రాకుండా చూసుకోగలిగారు. సామాజిక దూరాన్ని పాటించేలా షాపుల వద్ద చర్య లు తీసుకుంటూనే కూరగాయలు, మొబైల్ రైతు బజా ర్లు, కూరగాయలు డోర్ డెలివరీ, నిత్యావసర సరుకు లు, మందులు డోర్ డెలివరీ ఇలా ప్రతీది ప్రజల వద్దకే తీసుకొచ్చారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ధరలు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ట్రేడర్స్, పౌల్ట్రీ యజమానుల సమావేశమై ధరలపై దిశా నిర్దేశం చేశారు. రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు కూడా చేశారు. వ్యవసాయానికి ఇబ్బందుల్లేకుండా చూడగలిగారు. జిల్లా యంత్రాంగం పనితీరు భేష్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం మన అదృష్టమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్లో వ్యాధి నియంత్రణలో ఉందని అన్నారు. శ్రీకాకుళంలో రోడ్డుపై వాహనచోదకులను ఆపి జాగ్రత్తలు చెబుతున్న దాసన్న కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు స మన్వయంతో చక్కగా పనిచేశాయని ప్రశంసించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి అహరి్నశలు ప్రజా సంక్షేమం తపిస్తోందన్నారు. కరోనా కట్టడిలో ఇది కీలక సమయమని, ఇక ముందు కూడా పూర్తి నిబద్ధత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రతినిధులకు బియ్యంతో పాటు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు. అలాగే సోమవారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై తిరుగుతున్న వారిని మంత్రి ఆపి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. జిల్లాలో ఒక్క పాటిజివ్ కేసు కూడా నమోదు కాలేదని ఇకపై కూడా రాకుండా మనమంతా కలిసికట్టుగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. -
31 జిల్లాల ఉన్నతాధికారులతో సీఈసీ సమావేశం
-
పంచాయతీలను పటిష్టం చేద్దాం
సాక్షి, వికారాబాద్: పంచాయతీలను బలోపేతం చేయడానికి, గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడానికి గానూ వందశాతం పన్నులు వసూలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా నగరంలోని ప్రగతి భవన్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో మంగళవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. దీనికి జిల్లా నుంచి కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్, ఇన్చార్జ్ జేసీ సంధ్యారాణి, డీపీఓ మాజిద్ హాజరయ్యారు. ముఖ్యంగా పంచాయతీల పాలనపై సీఎం కేసీఆర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8,684 పంచాయతీలున్నాయని, పరిపాలనా సౌలభ్యంకోసం కొత్తగా మరో 4వేల జీపీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 500లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, వెయ్యి మంది జనాభా దాటితే రూ.10 లక్షలు, ఆపైన స్థాయిని బట్టి పంచాయతీకి రూ.15, రూ.20, రూ.25 లక్షల నిధులు అందజేస్తామని వివరించారు. ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నామని, ఆలోగానే కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి, సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలను సైతం శాసన ప్రక్రియ ద్వారానే నిర్వహించాలని ఆలోచిస్తున్నామన్నారు. ప్రత్యక్ష ఎన్నికలా.. పరోక్ష ఎన్నికలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పటిష్ట పంచాయతీ వ్యవస్థ నిర్మాణానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. మార్చి 11న గ్రామాల్లో ఈ– పాసు పుస్తకాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ గ్రామానికి ఒక అధికారిని నియమించి అదే రోజు పాసు పుస్తకాలు అందజేయాలని ఆదేశించారు. రికార్డుల ప్రక్షాళన తర్వాత భూములు వివరాలన్నీ ధరణి వెబ్సైట్లోనే ఉంటాయని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ విధానంలో సమూల మార్పులు తీసుకురానున్నామని సీఎం వివరించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు లేనిచోట తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారం కట్టబెడుతామన్నారు. జిల్లాలోని 18 మండలాలకు గానూ ప్రస్తుతం 4 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మినహా 14 మండలాల్లో తహసీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్ అధికారాలు వరించనున్నాయి. తాగునీరు, విద్యుత్, సాగునీటి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఈ ఫలాలు ప్రతిఒక్కరికీ అందాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలను తెలుసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాల అమలుకు మరింత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement