-
రెండున్నరేళ్లకే నూరేళ్లు..!
- ఆడుకుంటూ.. పట్టాలపైకి.. - రైలు ఢీకొని కవలలు మృతి కామారెడ్డి క్రైం: ఆడుకుంటూ తమకు తెలియకుండానే వారు వేసిన అడుగులు మృత్యువు వైపు నడిపించాయి. ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపై ఆడుకుంటుండగా.. రైలు రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళిచింది. ముద్దుముద్దు మాటలతో సందడి అప్పటి వరకు సందడి చేసిన ఆ కవల చిన్నారులు విగత జీవులై కనిపించడం గ్రామస్తులను కలచివేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చిన ఈ ఘటన కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లిలో సోమవారం జరిగింది. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చందన భానుశ్రీ, చంద్రంలకు రెండున్నరేళ్ల క్రితం కవల పిల్లలు విద్వేశ్, విఘ్నేశ్లు ఉన్నారు. చంద్రం కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయమే పనిపై వెళ్లాడు. భానుశ్రీ ఏడు నెలల గర్భిణి. మధ్యాహ్నం 2 గంటల వరకు పడుకున్న పిల్లలు.. లేచి ఆడుకోవడానికి ఇంటి పక్కనే ఉన్న కొట్టం దగ్గరికి వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపైకి చేరి ఆడుకోసాగారు. వీరి ఇల్లు గ్రామ శివారులో ఉండడంతో చిన్నారులు రైలు పట్టాలపై ఉన్న విషయాన్ని ఎవరూ గమనించలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ పట్టాలపై ఉన్న వీరిని ఢీ కొట్టింది. అయితే, పట్టాలపై పిల్లలను కొద్దిదూరంలో గమనించిన లోకోపైలట్ రైలును ఆపడానికి బ్రేక్ వేసినా ఫలితం లేకపోయింది. దీంతో కవలలు అక్కడికక్కడే మరణించారు. కవలల్లో ఒకరి మృతదేహం పట్టాల పక్కన పడిపోగా మరొకరి మృతదేహం తునాతునకలైంది. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు çఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనాస్థలానికి వచ్చి బోరున విలపించారు. సంఘటనాస్థలాన్ని కామారెడ్డి రూరల్ ఇన్చార్జి సీఐ కోటేశ్వర్రావు, దేవునిపల్లి ఎస్సై సంతోష్కుమార్, రైల్వే పోలీసులు సందర్శించి, వివరాలు సేకరించారు. -
నచ్చిన సీటుకోసం 2000 మందికి నరకం
ముంబయి: తనకు నచ్చిన చోట సీటు ఇవ్వాలంటూ శివసేన పార్టీ ఎమ్మెల్యే అతడి అనుచరులు నానా రచ్చ చేశారు. చత్రపతి శివాజీ టర్మినస్ పై దాదాపు గంటసేపు ఎక్స్ ప్రెస్ రైలును ముందుకెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో దాదాపు 2000 మంది ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినట్లయింది. నాందేడ్ ప్రాంతానికి చెందిన హేమంత్ పాటిల్ అనే ఎమ్మెల్యే దేవగిరి ఎక్స్ ప్రెస్ లో తనకు సెకండ్ ఏసీ కోచ్ లో పక్క సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రి పదిగంటల వరకు రైలు కదలకుండా అడ్డుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement