-
కవిత పూర్తి పాత్రను బయటపెట్టిన సీబీఐ
-
Delhi High Court : జేమ్స్బాండ్ సీక్వెల్సా?
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పదేపదే పిటిషన్లు దాఖలవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ వేసిన ఈ తరహా పిటిషన్పై ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘దీనిపై ఢిల్లీ లెఫ్ట్గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పష్టం చేసినా పదేపదే అవే పిటిషన్లు వేస్తున్నారు. ఇవేమీ జేమ్స్బాండ్ సినిమా సీక్వెల్స్ కావు. వ్యవస్థను వెక్కిరించేలా పిటిషన్లు వేస్తే ఊరుకోం. మీకు రూ.50,000 జరిమానా వేస్తాం’’ అని సందీప్ను హెచ్చరించింది. ఆయన తరఫున లాయర్ వాదించబోయినా, ‘‘రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలనుకుంటే వీధి చివరికెళ్లి ఇచి్చ రండి. మీ క్లయింట్ నేత కాబట్టి రాజకీయాలు చేస్తారు. మేం రాజకీయాల్లో మునగదల్చుకోలేదు’’ అని స్పష్టం చేసింది. -
బాబుకు ‘ఈడీ’ వేడి
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది! హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్లు ఆధారాలున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరైనదేనని పేర్కొంది. ఈ కేసులో హవాలా మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు చేరిన తరహాలోనే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల మధ్య చాలా సారూప్యతలు న్నాయి. ఇప్పటికే స్కిల్ కుంభకోణంపై షెల్ కంపెనీలను విచారిస్తున్న ఈడీ ఇక చంద్రబాబును కూడా బోనెక్కించే అవకాశాలున్నాయి. ‘ఆప్’ చేతికి రూ.50 కోట్లు ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మళ్లించినట్లు ఈడీ నిర్థారించింది. 2022లో గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు హవాలా మార్గంలో రూ.50 కోట్లు చేరినట్లు ఆధారాలతో తేల్చింది. ఈ మేరకు గోవాలో ఆప్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అభ్యర్థి వాంగ్మూలం కూడా ఇవ్వడం గమనార్హం. కేజ్రీవాలే బాధ్యత వహించాలి మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ, పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్ దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం రాజకీయ పార్టీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సంఘం. కంపెనీల చట్టం ప్రకారం ఓ కంపెనీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సముదాయం. రెండు వేర్వేరు చట్టాల ద్వారా నమోదైన రాజకీయ పార్టీ, కంపెనీల నిర్వచనం మాత్రం ఒకటే. కాబట్టి అక్రమ నిధులు పొందిన ఓ కంపెనీపై ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లుగానే అక్రమంగా నిధులు పొందిన రాజకీయ పార్టీపై కూడా అదే విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు’ అని న్యాయమూర్తి ప్రకటించారు. ‘మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆ పార్టీకి జాతీయ సమన్వయకర్త (అధ్యక్షుడు)గా ఉన్న కేజ్రీవాలే అందుకు బాధ్యత వహించాలి. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ఆయన అరెస్ట్ సరైనదే’ అని తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్లో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు – బాధ్యత వహించాల్సింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్లో కొల్లగొట్టిన నిధులు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జర్మనీలోని సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ నిధులు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చిన అవినీతి నెట్వర్క్ గుట్టును సిట్ బయట పెట్టింది. అందులో రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు పక్కా ఆధారాలతో గుర్తించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీహిల్స్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలున్నాయి. వాటిల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 చొప్పున జమ చేశారు. జూబ్లీ హిల్స్లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయి నోట్లను కట్టల రూపంలో తరలించి ఈ అక్రమ నిధులను జమ చేశారు. విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించి ఆదాయ మార్గాలు వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86 కోట్లు జమ కావడం గమనార్హం. నోట్ల డిపాజిట్ సమయంలో ‘పే–స్లిప్’లో ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి. ఇక బాబుపై ఈడీ కొరడా! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి సిట్ పూర్తి ఆధారాలను ఈడీకి అందచేసింది. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో నిధుల తరలింపుపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఇప్పటికే సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్తోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం సరైన చర్యేనని ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లో చేరిన అక్రమ నిధులపై ఈడీ దృష్టి సారించాల్సి ఉంది. తాజా తీర్పు ప్రకారం రాజకీయ పార్టీ ఖాతాలో చేరే అక్రమ నిధులకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంటే టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబే నిందితుడు అన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులతోపాటు సిట్ కూడా ఈడీ దృష్టికి తీసుకెళ్లనుంది. -
కేజ్రీవాల్కు మరో ఎదురు దెబ్బ
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఆయన వేసిన మరో పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉదయం కొట్టేసింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ని లాయర్ కలిసేందుకు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో కోరిన కేజ్రీవాల్ కోరారు. అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ.. కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టేసింది. ఇదిలా ఉంటే.. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్టును సమర్థించిన కోర్టు.. సామాన్యులకు, సీఎంలకు న్యాయం ఒక్కోలా పని చేయదంటూ వ్యాఖ్యానించింది. -
లిక్కర్ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు తాజాగా మంగళవారం(ఏప్రిల్ 9) దానిని వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ అరెస్టు సబబేనని పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు, సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది. కాగా, లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 దాకా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి..మళ్లీ తీహార్ జైలుకే కవిత -
కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లోని జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. తనను ఈడీ అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించడంపై గతంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్పై మంగళవారం న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసుపై కీలక తీర్పు వెలువరించనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్ ఎమ్మెలే దుర్గేశ్ పాఠక్తో పాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ను సోమవారం ఈడీ ప్రశ్నించింది. సౌత్ గ్రూప్ నుంచి హవాలా రూపంలో తీసుకున్న రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడిందని ఈడీ ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గోవాకు పాఠక్ ఇన్చార్జిగా ఉన్నారు. ఎన్నికల వేళ జరిగిన నగదు లావాదేవీలపై ఆయన్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో కీలక పత్రాలకు సంబంధించిన వివరాల కోసం విభన్ను విచారించింది. పాఠక్ను విచారించడంపై ఢిల్లీ మంత్రి అతిశి మండిపడ్డారు. ఆప్ నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే విచారణ పేరుతో బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట..
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేదుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వ పాలన కొరవడిందని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఈ ప్రజా ప్రయోజన పిటిషన్ను దాఖలు చేశారు. దీనిని గురువారం జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన డివిజన్ బెంచ్ బెంచ్ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే పిటిషనర్ ఈ అంశంపై రాజ్యాంగ అధికారులను(రాష్ట్రపతి లేదా గవర్నర్) సంప్రదించాలని హైకోర్టు కోరింది. ‘కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలి. కానీ అది అతని (కేజ్రీవాల్) వ్యక్తిగత నిర్ణయం. ఇది న్యాయస్థానం, కోర్టు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన విధించిన సందర్భాలు ఉన్నాయా? దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: తీహార్ జైలు నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సందేశం ప్రభుత్వం పనిచేయడం లేదని మేము ఎలా చెప్పగలం? దానిని నిర్ణయించడానికి లెఫ్ట్నెంట్ గవర్నర్కు పూర్తి సామర్థ్యం ఉంది. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. చట్టాం ప్రకారం ఏం చేయాలో ఆయన చేస్తారు’ అని పేర్కొంది. అనంతరం పిటిషనర్ గుప్తా మాట్లాడుతూ.. తన పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు దీనిని ప్రస్తావించనున్నట్లు చెప్పారు. కాగా సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలంటూ హైకోర్టులో దాఖలైన రెండో పిటిషన్ ఇది. కాగా మార్చి 28న సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. -
కునాల్ కపూర్ విడాకులు : భార్య అంత వేధించిందా?
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్కు ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించిందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. భర్తను అప్రతిష్టపాలు చేసేలా ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని క్రూరత్వానికి సమానమని కోర్టు పేర్కొంటూ ఆయనకు విడాకుల పిటీషన్ను కోర్టు సమర్ధించింది. అసలు ఇంతకీ కునాల్ కపూర్ మాజీ భార్య ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది నిజంగానే క్రూరంగా ప్రవర్తించింది లాంటి వివరాలను పరిశీలిద్దాం..! పలు మీడియా నివేదికల ప్రకారం 2008, ఏప్రిల్లో కునాల్ ఏక్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వారి పెళ్లయిన తొలిరోజులో, లగ్జరీ కారు లేదనీ, ఉన్న కారు చిన్న కారంటూ ఎగతాళి చేసింది. ఏమీ లేదంటూ ఎద్దేవా చేసేదట. అతనికి చెప్పకుండానే తన ఉద్యోగాన్ని వదిలేసింది. అతనిపై కక్షసాధించేందుకే ఇంట్లో పనిలేకుండా కూర్చుంది. ఏక్తా కపూర్ భర్తపట్ల, అతని తల్లి దండ్రుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేదని, ఒకటిరెండుసార్లు అతనిపై చేయి కూడా చేసుకుంది అనేది ప్రధాన ఆరోపణ. (భార్య క్రూరత్వం : సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్కు భారీ ఊరట) కానీ కునాల్ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాడు. ఫారిన్ టూర్లు తీసుకెళ్లాడు. కానీ ఆమె ఎప్పుడూ కావాలనే తగాదా పడేది. ఈ వివాదాల నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం ప్రయత్నించాడు. ఆమె ఏమీ మారలేదు. టీవీ షో మాస్టర్ చెఫ్కి ఎంపికైనప్పుడు వీరిద్దరి మరిస్థితులు మరింత దారుణంగా మారాయి. అతనికి మంచి పేరు రావడం కూడా ఆమె తట్టుకోలేకపోయింది. యష్రాజ్ స్టూడియోస్లో షో షూట్లో ఉండగా కొడుకుతో కలిసి స్టూడియోకు వచ్చి గొడవ చేసింది. టీవీ షో జడ్జ్గా పాపులర్ అయిన తర్వాత, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని నిరంతరం బెదిరించేంది.షూట్కి ఒకరోజు ముందు చెంపదెబ్బ కొట్టిందని కునాల్ ఆరోపించాడు. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) కొడుకు పుట్టిన తర్వాత బిడ్డను కూడా సరిగ్గా పట్టించు కోలేదు. పిల్లాడిని పనిమనిషికి వదిలేసి మాల్స్కు వెళ్లిపోయేది. 2013లో కునాల్ని కొట్టింది కూడా. దీన్ని కునాల్ తండ్రి రికార్డ్ చేశాడు. దీంతో ఆమె ఆ ఫోన్ లాక్కొని వృద్ధుడని కూడా చూడకుండా కర్రతో కొట్టడానికి కూడా ప్రయత్నించింది. ఈ వ్యవహారం పోలీసుల దాకా పోయింది. 2014లో జరిగిన మరో సంఘటనలో, కునాల్ తండ్రిని ప్లాస్టిక్ కుర్చీతో దాడి చేయడంతో విభేదాలు మరింత రాజుకున్నాయి. 2015లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆమె ఇంటిముందు గలాటా చేసింది. చివరికి విసిపోయిన కునాల్ ఆమెనుంచి దూరంగా వెళ్లాడు. అప్పటినుంచి కునాల్ , అతని భార్య విడివిడిగా ఉంటున్నారు. కుమారుడు మాత్రం తల్లితోనే ఉంటున్నాడు. అయితే బిడ్డను కలవడానికి లేదా మాట్లాడటానికి కూడా ఏక్తా అనుమతించేది కాదు. ప్రతిదానికీ డబ్బులు డిమాండ్ చేసేదని కునాల్ చాలా సార్లు వాపోయాడు. ఏక్తా కపూర్ వాదన: వివాహేతర సంబంధాలు అయితే ఈ ఆరోపణలన్నింటినీ ఏక్తా కపూర్ గతంలోనే ఖండించింది. తనకు విడాకులు ఇవ్వడానికి పన్నిన పన్నాగమని ఆరోపించింది. బాగా పేరు సంపాదించిన తర్వాత భర్తకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించింది. అయితే భర్తను కొడుతున్న వీడియోను ఫ్యామిలీ కోర్టు తీరస్కరించింది. ఆమె నిగ్రహం కోల్పేయాలా కునాల్ ప్రవర్తించాడని కోర్టు ఈ వీడియోను తోసిపుచ్చింది. వరకట్న ఆరోపణలు చేసింది, అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో వీటిని ధృవీకరించలేకపోయింది. అయితే ఫ్యామిలీ కోర్టు విడాకులకు అంగీకరించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణలో భార్య క్రూరత్వాన్ని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు కునాల్కు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై ఏక్తా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
నేరస్థులను జైలులో పెట్టాల్సిందే.. కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీ వాదనలు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు బుధవారం(ఏప్రిల్ 3)న విచారించి తీర్పును రిజర్వు చేసింది. ఎన్నికల వేళ ఢిల్లీ సీఎంను అరెస్టు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తరపున వాదించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి రాజు ఘాటుగా స్పందించారు. ఎన్నికల కారణంగా తమను అరెస్టు చేయవద్దనే హక్కు నిందితులకు లేదన్నారు. విచారణ సక్రమంగా సాగాలంటే నిందితులను అరెస్టు చేసి జైలులో ఉంచాల్సిందేనని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ అక్రమ అరెస్టు పిటిషన్పై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. తీహార్ జైలు నుంచి ఆప్ ఎంపీ రిలీజ్ -
అవమానించేందుకే అరెస్ట్ చేశారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి 23న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం కేజ్రీవాల్ పిటీషన్పై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపిస్తున్నారు. తన క్లైంట్ అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేముందు ఆయన నివాసం వద్ద ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అరెస్టకు ముందు ఈడీ అసలు అటువంటి ప్రయత్నమే చేయలేదని కోర్టుకు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ పారిపోయే అవకాశం ఉందా?. ఆయన ఒకటిన్నర ఏళ్లలో ఎవరైనా సాక్షిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా?. ప్రశ్నించడానికి నిరాకరించారా? అని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ ఈడీని ప్రశ్నించారు. అంతకుముందు హైకోర్టులో హాజరుపరిచే క్రమంలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో నన్ను అవమానపరిచేందుకు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకు అరెస్టు చేశారు. ఈడీ నా నుంచి ఎలాంటి స్టెట్మెంట్ రికార్డ్ చేయలేదు’ అని అన్నారు. ఇక.. ఈడీ కస్టడీ ముగిసిన అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు సోమవారం జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. అయన్ను తీహార్ జైల్క తరలించారు. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. మార్చి 21 తేదీన సాయంత్రం ఈడీ రెండున్నర గంటల పాటు విచారించి.. అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట
ఢిల్లీ, సాక్షి: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించాలని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే.. ఢిల్లీ హైకోర్టు గురువారం ఆ పిల్ను కొట్టేసింది. కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేమని.. అలాగే జైలు నుంచి కేజ్రీవాల్ పాలన నడిపించడాన్ని కూడా తాము అడ్డుకోలేమని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్కు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ మన్మోహన్(తాత్కాలిక), జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్థిక కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన రైతు, సామాజిక వేత్త సుర్జిత్సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. -
హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ‘ఈనాడు’ అసత్య ఆరోపణలు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రిక తన సర్కులేషన్ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ‘ఈనాడు’ అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి. వలంటీర్లు విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏ దినపత్రికనైనా కొనుగోలు చేయవచ్చంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్ల సాక్షి సర్క్యులేషన్ ఆమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు, శుద్ధ అబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా? మరి ఏబీసీ గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సూటిగా సంధించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానమే లేకుండా పోయింది. సాక్షి సర్క్యులేషన్ విషయంలో తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో చేసేదేమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది. హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించేందుకు అనుమతినిచ్చింది. దీంతో చేసేదేమీ లేక సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించకుండా ఏబీసీని నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ దినపత్రికనైనా కొనుక్కునేందుకు వలంటీర్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రతీమ్ సింగ్ ఆరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కేజ్రీకి ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట
న్యూఢిల్లీ: కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని, వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ను అత్యవసరంగా, వీలైతే ఆదివారమే విచారించాలని కోరారు. అయితే బుధవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. జర్మనీ ప్రకటన, రాయబారికి భారత్ సమన్లు కేజ్రీవాల్ అరెస్ట్పై జర్మనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ అరెస్ట్ను మేం గమనిస్తున్నాం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రమాణాలు, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు ఈ కేసుకు వర్తిస్తాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ న్యాయమైన, నిష్పక్షపాత విచారణకు అర్హులు. చట్టపరమైన పరిష్కారాలను పరిమితుల్లేకుండా ఉపయోగించుకునే హక్కు ఆయనకుండాలి’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ తీవ్ర నిరసన తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆక్షేపించింది. జర్మనీ వ్యాఖ్యలను అసమంజసం, పక్షపాతపూరితమని పేర్కొంటూ ఢిల్లీలోని జర్మనీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జార్జి ఎన్జ్వీలర్కు సమన్లు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు. -
సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు షాక్ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరెస్ట్, ఈడీ రిమాండ్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా.. ఈడీ మార్చి 28 వరకు తమ క్లైంట్కు ఈడీ కస్టడీ విధించటం చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. మార్చి 24 ఆదివారంలోపు తను దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్లో కోరారు. అత్యవసర విచారణ కోసం కేజ్రివాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేశారు. కాగా.. ఢిల్లీ హైకోర్టు అత్యవసరణ విచారణకు అనుమతించకపోవటం గమనార్హం. ఇక.. గురువారం ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. నిన్న శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ను కోర్టుకు హాజరుపరిచి.. ఈడీ పదిరోజుల కస్టడీకి కోరింది. దీంతో కోర్టు ఆరు రోజుల పాటు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. చదవండి: కేజ్రీవాలే అసలు కుట్రదారు -
ఈడీ చెరలో కేజ్రీవాల్!
పీఠం ఎక్కింది మొదలు కేంద్రం కంట్లో నలుసులా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కటకటాల వెనక్కి వెళ్లక తప్పింది కాదు. గురువారం రోజంతా జరిగిన డ్రామాకు పతాకస్థాయిగా రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను అదుపు లోకి తీసుకున్నారు. దర్యాప్తునకు హాజరు కావాలంటూ తొమ్మిది దఫాలు ఈడీ పంపిన సమన్లను ఆయన బేఖాతరు చేస్తూ రాగా, పదోసారి నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్ అధికార నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించటంతో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్యవ హారం కీలకమలుపు తిరిగింది. మొన్న జనవరి 31న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను భూకుంభకోణంలో ఈడీ అరెస్టు చేయగా, ఆ వరసలో అరెస్టయిన రెండో ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అవినీతికి వ్యతిరేకంగా పుష్కరకాలం క్రితం అన్నా హజారే నాయకత్వాన ఢిల్లీలో రగిలిన నిరసనో ద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు చివరకు అలాంటి ఆరోపణల్లోనే చిక్కుకుని అరెస్టు కావటం ఒక వైచిత్రి. అప్పటి యూపీఏ ప్రభుత్వం 2జీ స్ప్రెక్ట్రమ్ కేటాయింపుల్లో రూ. 1.76 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకులు ఆరోపించారు. ఆ కేసులో సీబీఐ సరైన సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడి 2017లో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తీర్పుపై 2018 మార్చిలో సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ను ఆరేళ్ల తర్వాత శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఐఆర్ఎస్ కొలువుకు రాజీనామా చేసి ఉద్యమంలోకొచ్చిన కేజ్రీవాల్ను ఆదినుంచీ వివాదాలు చుట్టుముడుతూనే వున్నాయి. అవినీతి వ్యతిరేకోద్యమం చల్లారి దాన్లోని ప్రముఖులంతా తెరమరు గవుతున్న రోజుల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్థాపించటం ఆయన సహచరులకు మింగుడు పడలేదు. ఉద్యమాన్ని స్వలాభానికి వాడుకుంటున్నాడంటూ అనేకులు విరుచుకుపడ్డారు. తొలుత ఆయనతో చేతులు కలిపిన కేంద్ర మాజీ న్యాయ మంత్రి శాంతి భూషణ్, ఆయన కుమారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు కొద్దికాలంలోనే కేజ్రీవాల్పై ఆరోపణలు చేస్తూ వైదొలిగారు. అధికారంలోకొచ్చాక ఆయనపై దాదాపు డజనుసార్లు దుండగులు దాడిచేశారు. ఇంకుతో, కోడిగుడ్లతో, కర్రలతో, రాడ్లతో ఈ దాడులు జరిగాయి. ఒకసారైతే దుండగుడు పాదాభి వందనం చేస్తున్నట్టు నటించి ముఖంపై కారం జల్లాడు. అవినీతి వ్యతిరేకోద్యమంలో కీలక పాత్ర పోషించిన అనేకమంది మాదిరే కేజ్రీవాల్ కూడా సంఘ్ పరివార్ సంస్థలతో సన్నిహితంగా మెలిగిన వారే. అందుకే ఆప్ స్థాపన వారికి నచ్చలేదంటారు. 2013లో స్వల్ప ఆధిక్యతతో తొలిసారి అధికారం చేపట్టినప్పుడు నాటి యూపీఏ సర్కారుతో పేచీ తప్పలేదు. ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకొ చ్చినా ఏదో ఒక అంశంపై ఘర్షణ కొనసాగుతూనేవుంది. లెఫ్టినెంట్ గవర్నర్లుగా వచ్చినవారు ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపుల్లలేయటం, కొన్నిసార్లు న్యాయస్థానాల జోక్యంతో ఆయన విజయం సాధించటం రివాజైంది. నిజానికి కేజ్రీవాల్ కార్యక్షేత్రం చిన్నది. ఆయన ప్రభావం ఢిల్లీకి పరిమితం. పంజాబ్లో సైతం ఆప్ ప్రభుత్వాన్ని స్థాపించగలిగినా అది నిలకడగా వుండగలదా అన్నది ప్రశ్నార్థకం. మతం, కశ్మీర్ తదితర అంశాల్లో కేజ్రీవాల్ వైఖరి బీజేపీకి భిన్నమేమీ కాదు. అందువల్ల ఆయనపై అస్త్రాలు సంధించి బలహీనపరచటం బీజేపీకి సాధ్యంకావటం లేదు. చిత్రమేమంటే అటు కాంగ్రెస్ సైతం ఆయన బలపడితే తమకే ముప్పని భావించి కేజ్రీవాల్ను తగినంత దూరంలోవుంచింది. దేశవ్యాప్తంగా వేరే పార్టీలు పెద్ద బలంగా లేవు. ఏతావాతా తమ నేతల అరెస్టుపై ఆప్ది ఒంటరి పోరాటమే కావొచ్చు. ఇంతకూ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారన్నది వాస్తవమేనా? అది ఎన్ని దశాబ్దాలకు తేలుతుందో ఎవరూ చెప్పలేరు. ఆయన సర్కారు ఢిల్లీ మద్యం విధానంలో మార్పులు చేయటం ద్వారా కొన్ని వర్గాలకు లాభం చేకూర్చి వందకోట్ల రూపాయల మేర ముడుపులు తీసుకుందన్నది ఈడీ ఆరోపణ. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఏడాదిన్నరగా జైల్లో వున్నారు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఇటీవలే అరెస్టు చేశారు. కొందరు అప్రూవర్లుగా మారారు. కేసులోని నిజానిజాలేమిటన్న సంగతలావుంచి సీబీఐ, ఈడీ వ్యవహార శైలిపై యూపీఏ సర్కారుకాలం నుంచీ అనుమానాలున్నాయి. ఆ సంస్థల నిర్వాకాన్ని అడపా దడపా న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్న ఉదంతాలు లేకపోలేదు. అయినా వాటి తీరుతెన్నులు మారిన దాఖలా లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ అరెస్టుల వెనక రాజకీయప్రమేయం, ప్రయోజనం లేవని ఎవరూ అనుకోలేరు. నిజానికి సుప్రీంకోర్టు పుణ్యమా అని బయట పడిన ఎలక్టోరల్ బాండ్ల ఆనుపానులు, కార్యకారణ ప్రమేయాలు గమనిస్తే ఈ మద్యం కుంభకోణం పిపీలిక ప్రాయం అనిపిస్తుంది. అవినీతి కేసుల విషయంలో ఈమధ్య పార్టీల పరస్పర ఆరోపణలు వింతగా వుంటున్నాయి. కవితను అరెస్టు చేయకపోవటంవల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడామని బీజేపీ నేతలు ఖేదపడగా... బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కు కావటంవల్లే ఆమె అరెస్టు జరగలేదని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆప్ తమ కూటమిలో వుంది గనుక కేజ్రీవాల్ అరెస్టును తప్పుబడుతున్నది. ఈ అష్టావక్ర రాజకీయాలవల్ల బీజేపీ ఎడాపెడా లాభపడుతోంది. ఏదేమైనా అగ్రనాయకత్వం అరెస్టుతో సైన్యాధిపతిలేని సేనలా తయరైన ఆప్ ఈ సార్వత్రిక ఎన్ని కలనూ, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలనూ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. -
ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. తమ అకౌంట్లను ఆదాయపు పన్నుశాఖ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కాగా లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చర్యలను ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ సవాల్ చేసింది. 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా ఐటీ అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్లు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈ కేసులో టాక్స్ అథారిటీ ఎలాంటి చట్టబద్దమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని.. పార్టీ ఎగ్గొ ఆదాయం రూ. 520 కోట్ల కంటే ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ రిట్ పిటిషన్లను కొట్టివేస్తున్నామని తెలిపింది. అయితే తొలుత ఈ పిటిషన్లపై మార్చి 20న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసి నేడు తీర్పు వెల్లడించింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్న రూ. 105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దీంతో లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. చదవండి: అందుకే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు: శరద్ పవార్ కాగా అంతకుముందు ఐటీ శాఖ సీజ్ చేసిన రూ.105 కోట్లను రిలీజ్ చేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. 2018-19 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి రూ.102 కోట్ల బకాయి పన్నును రికవరీ చేయాలని ఐటీ శాఖ కాంగ్రెస్కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్టే విధించాలని హస్తం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నోటీసుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ.. స్టే కోరుతూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇక తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అబద్దంగా మారిందని ఆరోపిన్నారు. ఎన్నికల్లో పోరాడకుంటా తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాటి చర్యలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ న్యాయస్థానంలోనూ కాంగ్రెస్కు నిరాశే ఎదురైంది. -
Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు షాక్..!
-
Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు షాక్..
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని చెప్పింది. ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కాగా లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం హాజరు కావాలంటూ ఈడీ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే లిక్కర్ కేసులో ఇవాళ తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో హడావిడిగా మరో పిటిషన్ వేశారు. ఈడీ విచారణకు తాను సిద్ధమని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని, ఈడీ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్లో అభ్యర్థించారు. దీనిపై జస్టిస్లు సురేష్ కుమార్ కైత్, మనోజ్ జైన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ దశలో ఉపశమనం కల్పించే ప్రసక్తే లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేయకుండా ఈడీ నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22న చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా లిక్కర్ కేసు వ్యవహారంలో ఈడీ ఇప్పటికే కేజ్రీవాల్కు తొమ్మిదిసార్లుసమన్లు జారీ చేయగా.. సీఎం ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో సమన్ల ఉల్లంఘన కింద ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా.. ఆయన బెయిల్ దక్కించుకున్నారు. చదవండి: తమిళనాడు గవర్నర్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం -
ఈడీ విచారణకు సిద్ధం.. కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు సిద్ధమని ప్రకటించారు. కోర్టు గనుక తనకు ఈడీ అరెస్ట్ చేయదని అభయం ఇస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. నేడు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో.. తాజాగా గురువారం ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారాయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హాజరు కావాలంటూ ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే తొమ్మిదిసార్లు సమన్లు జారీ అయ్యాయి. సమన్ల ఉల్లంఘన కింద ఈడీ సైతం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా.. ఆయన బెయిల్ దక్కించుకున్నారు. అయితే లిక్కర్ కేసులో ఇవాళ తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో హడావిడిగా మరో పిటిషన్ వేశారు. ఈడీ విచారణకు తాను సిద్ధమని, అరెస్ట్ కాకుండా తనకు రక్షణ కల్పించాలని, ఈడీ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్లో ఆయన అభ్యర్థించారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారణ చేపట్టింది. ‘‘ నేనేం నేరస్తుడిని కాదు. పారిపోవాల్సిన అవసరం నాకేంటి?. సమాజంలో నా కంటే గట్టి మూలాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా?. ఈడీ విచారణకు నేను హాజరవుతా. వాళ్లు అడిగిందానికి సమాధానాలిస్తా. కానీ, నాకు రక్షణ కావాలి. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వండి’’ అని కేజ్రీవాల్ హైకోర్టును అభ్యర్థించారు. విచారణ చేపట్టడం అనేది దర్యాప్తు సంస్థల సాధారణ ప్రక్రియే అని.. మొదటిరోజో, రెండో రోజో అరెస్ట్ చేయడం జరగబోదని.. ముందుగా స్టేట్మెంట్లను రికార్డు చేయడం లాంటి చేపడుతుందని.. అరెస్ట్ చేస్తే కారణాలను సైతం వివరిస్తుందని కోర్టు కేజ్రీవాల్కు తెలిపింది. సమన్ల ప్రకారం ఆయన హాజరైతే స్థితిగతులను తెలుసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయినా అరెస్టు ఊహిస్తే తగిన చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది. అయితే.. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అలాంటి పద్ధుతులు పాటించడం లేదని.. కొత్త తరహాలో వ్యవహరిస్తున్నాయని సింఘ్వీ బెంచ్ ముందు వాదించారు. మరోవైపు నిందితుడిగానో, అనుమానితుడిగానో కేజ్రీవాల్ పేరును ప్రస్తావించకుండా ఈడీ సమన్లు పంపిందని సింఘ్వీ బెంచ్ వద్ద ప్రస్తావించారు. మరోవైపు.. బుధవారం కేజ్రీవాల్ దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణ సందర్భంగా.. ఈడీ ఎదుట ఎందుకు హాజరుకావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే.. ఎన్నికల వేళ తనను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని.. అందుకే హజరు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. -
కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ రెండు వారాల గడువును ఈడీకి ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీన ఉంటుందని తెలిపింది. లిక్కర్ కేసులో తొలి నుంచి ఈడీ సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. ఈలోపు ఈడీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఈలోపు మార్చి 21న తమ ముందు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈడీ నుంచి తొమ్మిదిసార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ అయినట్లైంది. అయితే.. ఈ సమన్లపై ఢిల్లీ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలను ఉల్లంఘిస్తూ జారీ చేశారని కేజ్రీవాల్తన పిటిషన్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ పిటిషన్ను విచారించిన హైకోర్టు జస్టిస్ సురేశ్ కైత్, మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం.. చివరకు ఈడీని వివరణ కోరుతూ విచారణ వాయిదా వేసింది. రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ అంతకుముందు లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు జారీ చేయగా.. విచారణకు హాజరు కాకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యేలా చూడాలని కోరారు. దీంతో రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ బెయిల్ పొందారు. రూ.15వే వ్యక్తిగత బాండ్తో పాటు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. -
కోర్టు ఉత్తర్వులకూ తప్పుడు భాష్యం
సాక్షి– అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ప్రతీ రోజూ తప్పుడు కథనాలు వండివారుస్తున్న ఈనాడు దినపత్రిక, తాజాగా కోర్టు ఉత్తర్వుల విషయంలోనూ అదే వైఖరిని బయటపెట్టుకుంది. కోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్లు ప్రచురించి, ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. ‘సాక్షి’ దినపత్రిక సర్క్యులేషన్ వివరాలను వెల్లడించవద్దంటూ ఆడిట్బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ను (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా తప్పుడు కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. వాస్తవానికి సర్క్యులేషన్ వివరాలను తనకు సీల్డ్ కవర్లో సమర్పించాలని ఏబీసీని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు... ఈ నెల 27వరకూ ఏ తెలుగు దినపత్రిక సర్క్యులేషన్ వివరాలనూ వెల్లడి చేయవద్దని స్పష్టంగా తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ‘ఈనాడు’తో సహా తెలుగు దినపత్రికలన్నింటికీ వర్తిస్తాయి. కానీ ‘ఈనాడు’ మాత్రం... ఒక్క సాక్షి పత్రిక సర్క్యులేషన్ వివరాలను మాత్రమే వెల్లడించవద్దని ఏబీసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా కథనాన్ని ప్రచురించటంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని వివరాలు చూస్తే... విస్తృత సర్కులేషన్ ఉన్న ఏదైనా పత్రికను కొనుగోలు చేసుకోవటానికి గ్రామ, వార్డు వలంటీర్లకు, సచివాలయాలకు నెలకు రూ.200 ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఆ మేర బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ఏ పత్రికను కొనాలన్నది చెప్పలేదు. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసుకోవచ్చునని వలంటీర్లకు ఛాయిస్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రై వేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే వలంటీర్లు, సచివాలయాలు ఒకవేళ ‘సాక్షి’ దినపత్రికను కొనుగోలు చేస్తే ఆ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్కులేషన్ను (ఏబీసీ) ఆదేశించడంతో పాటు నిర్ధిష్ట కాలాల్లో సాక్షి పత్రికు ఇచ్చిన సర్కులేషన్ సర్టిఫికేషన్ను పునస్సమీక్ష చేయాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక ప్రభుత్వ జీవోల అమలును నిలిపేయడంతో పాటు, 2022 జూలై– డిసెంబర్, ఆ తరువాత కాలానికి సాక్షి సర్కులేషన్ను ఆడిట్ చేయకుండా ఏబీసీని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీజే ధర్మాసనం మొదట ఈ అనుబంధ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అటు ఈనాడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నది. అనంతరం ఉషోదయ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేసింది. దీనిపై ఉషోదయ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత ఏడాది ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉషోదయ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉషోదయ వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గత ఏడాది జూలై నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక వాదనల సమర్పణకు సైతం ఆదేశాలిచ్చింది. అయితే సర్క్యులేషన్ వివరాలను వెల్లడి చేయకుండా ఏబీసీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని బుధవారం (మార్చి 13) ఉషోదయ మరో పిటిషన్ వేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏబీసీ తరఫు న్యాయవాది ఎవరూ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తాజా సర్కులేషన్ వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంటూ ఏబీసీకి నోటీసులిచ్చింది. అంతేకాక ఈ నెల 27 వరకూ తెలుగు దినపత్రికలన్నింటి సర్కులేషన్ వివరాలను వెల్లడి చేయవద్దని కూడా ఏబీసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉంటే, ఈనాడు మాత్రం ఆ ఉత్తర్వులను దురుద్దేశాలతో తప్పుగా ప్రచురించింది. ఢిల్లీ హైకోర్టు ‘సాక్షి’ సర్కులేషన్ వివరాలను, గణాంకాలు ప్రచురించవద్దంటూ ఏబీసీని ఆదేశించినట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించి తన నైజాన్ని చాటుకుంది. -
మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మహువా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ)పై దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ తనకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తోందని.. దాన్ని నిరోధించాలని మహువా ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై గరువారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తీర్పును రిజర్వులో పెట్టి నేడు(శుక్రవారం) విడుదల చేశారు. మహువా మొయిత్రి చేసిన ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది ఖండించాడు. ఈ కేసు సంబంధించి మహువా సమాచారాన్ని ప్రెస్ రిలీజ్ లేదా మీడియాకు వెల్లడించటం చేయలేదని తెలిపారు. ఇక.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన మహువా మొయిత్రా హాజరుకాలేదు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో ఈడీ ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి 19న హాజరుకావాలని ఈడీ ఇంతకుముందు ఆమెను కోరింది. అయితే... తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారు. అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని.. వచ్చే వారంలో తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహువా మొయిత్రాపై సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోంది. భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్పాల్ ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత డిసెంబరులో మహువా లోక్సభ సభ్యత్వం కూడా రద్దయింది. మొయిత్రా.. తాను ఏ తప్పు చేయలేదని లోక్సభ సభ్యత్వ రద్దును ఖండించారు.తన బహిష్కరణ వేటుపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వచ్చిన బాంబుల బెదింపులు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ మెయిల్ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైకోర్టుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టులో భారీ బాంబు పేలుడు సంభిస్తుందని బుధవారం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మెయిల్ వచ్చింది. ‘ఫిబ్రవరి 15న హైకోర్టులో బాంబు పేల్చుతా. ఈ పేలుడు ఢిల్లీలోనే అతిపెద్దది కానుంది. ఎంతమంది భద్రతా బలగాలైనా పెట్టుకోండి.. అందరినీ పేల్చివేస్తాం’ అని గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే రోజు మరోవైపు బిహార్ డీజీపీకి వాట్సప్ ఆడియో క్లిప్ ద్వారా బాంబు బెదిరింపు రావటం గమనార్హం. అయితే ఈ ఘటనలో నిందితుడిని కర్ణాటకలో పటుకున్నామని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి అతన్ని విచారణ కోసం పట్నా తరలించారు. నిందితుడిని అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
27 వారాల గర్భవిచ్చిత్తికి అనుమతి.. భర్త మృతితో తీవ్ర..
ఢిల్లీ: గర్భం వద్దని కోర్టును ఆశ్రయించిన ఓ మహిళా పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సదరు మహిళ 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భర్త మరణించిన ఓ మహిళ తనకు తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని.. 27 వారాల అబార్షన్ను అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పిటిషిన దాఖలు చేసిన మహిళ ఒక వితంతువని ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమె తన భర్తను కోల్పోవడంతో తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ అన్నారు. అయితే ఆమె మానసికస్థితి సరిగా లేనందున, ముఖ్యంగా ఆమె గర్భంతో ఉంటే తనకు తాను హాని చేసుకునే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా ఆమెకు 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుతిస్తున్నట్లు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పు వెల్లడించారు. దీంతోపాటు.. గర్భంతో 24 వారాలు దాటినప్పటికీ సదరు మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ ఆస్పత్రిని ఢిల్లీ కోర్టు కోరింది. చదవండి: బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్.. నాలుగు మరణాలు -
రాహుల్పై చర్యలు తీసుకోండి.. ఈసీకి హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను ‘పిక్ పాకెట్స్’గా అభివర్ణించిన కేసులో రాహుల్పై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని ధర్మాసనం పేర్కొంది. రాహుల్ కామెంట్స్పై చర్యలు తీసుకునేందుకు ఎలక్షన్ కమిషన్కు ఎనిమిది వారాల గడువు విధించింది. అయితే ఈ విషయాన్ని ఈసీఐ పరిశీలిస్తున్నందున దీనిని ఎన్నికల సంఘమే పరిష్కరిస్తుందని ఢిల్లీ హైకోర్టు తమ ఉత్వర్వుల్లో తెలిపింది. కాగా ఇప్పటికే పిక్పాకెట్స్ కేసు వ్యవహారాన్ని ఈసీ విచారిస్తుంది. నవంబర్ 26 లోపు సమాధానం ఇవ్వాలని నవంబర్ 23న ఎన్నికల సంఘం రాహుల్కు నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయినప్పటికీ రాహుల్ స్పందించలేదు. దీంతో కోర్టు ఆయనపై చర్యలకు ఆదేశించింది. అయితే ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం కోర్టు స్పష్టం చేయలేదు. చదవండి: జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి.. ఆర్మీ కాన్వాయ్పై కాల్పులు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement