-
వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత వానాకాలం (2022–23) కస్టమ్ మిల్లింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ జై ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుతో పూర్తవుతున్న సీఎంఆర్ గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న కేంద్రానికి లేఖ రాసింది. గత సంవత్సరం వానాకాలానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సీఎంఆర్ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యం అప్పగించకుండా ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం పెండింగ్ సీఎంఆర్ను డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. మిల్లుల వారిగా రాతపూర్వకంగా షెడ్యూల్ను తీసుకోవాలని సూచించింది. ఎఫ్సీఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలనీ, ప్రొటోకాల్ ప్రకారం సీఎంఆర్ డెలివరీ సమయంలో బియ్యాన్ని పరీక్షించి ఎప్పటి బియ్య మో నిర్ధారించాలని ఎఫ్సీఐని ఆదేశించింది. -
సమీక్షల షో
►కస్టమ్ మిల్లింగ్లో అక్రమాలపై సర్కారు తీరిది ►రూ.68 కోట్లుబకాయిపడిన 23 మంది మిల్లర్లు ►రెండేళ్లుగా చర్యలు శూన్యం ►మంత్రి మారటంతో మిల్లుల తనిఖీలు, ►కేసుల నమోదుకు ఆదేశాలు నెల్లూరు : ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని దొడ్డిదారిన అమ్మేసుకుని ఖజానాకు తూట్లు పొడిచిన అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. సమీక్షల పేరిట హడావుడి చేస్తూ.. తెరవెనుక నుంచి అక్రమార్కులకు ఆశీస్సులు అందజేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటన సాగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు నియోజకవర్గాలో పర్యటించిన ఆయన రెండుచోట్ల శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. కొన్ని మిల్లులను తనిఖీ చేశారు. కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన బియ్యాన్ని (సీఎంఆర్) అమ్మేసుకున్న మిల్లర్లపై కేసులు నమోదు చేసి నెల రోజుల్లో ఆ సొమ్ము రికవరీ చేయాలని ఆదేశించారు. ఖజానాకు గండికొడితే ఉపేక్షించేది లేదని ప్రకటించి వెళ్లారు. ప్రతిసారి ఇలాగే ‘షో’ నిర్వహించటం మినహా ఎలాంటి ప్రయోజనం లేకపోతోంది. ఏటా ఇదే తంతు కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్న మిల్లర్ల విషయంలో ఏటా ఇదే తంతు నడుస్తోంది. జిల్లాలో 23 మంది మిల్లర్లు సుమారు రూ.68 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి.. బియ్యాన్ని అమ్మేసుకున్నారు. వారినుంచి సొమ్మును రికవరీ చేసే పేరిట ఏటా నాలుగుసార్లు సమీక్షలు నిర్వహించడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మిల్లర్ల వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఉండటంతో మంత్రి హడావుడి చేసి వెళ్లడం.. ఆనక లాబీయింగ్తో చర్యలు నిలుపుదల చేయించుకుని కాలం గడపటం పరిపాటిగా మారింది. నిధుల స్వాహా సాగుతోందిలా జిల్లాలో సుమారు 300 రైస్ మిల్లులు ఉండగా, వాటిలో 250 మిల్లులు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. రెండేళ్ల నుంచి ధాన్యం కొనుగోళ్లలో ఆంక్షలు లేకపోవటం, జిల్లాలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండటంతో ఇక్కడి మిల్లర్లు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతోపాటు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం ఐకేపీ కేం ద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం ఆడే నిమిత్తం కస్టమ్ మిల్లింగ్ పేరిట మిల్లర్లకు అప్పగిస్తోంది. బియ్యం ఆడినందుకు వారికి కమీషన్ చెల్లిస్తోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.3.65 కోట్ల విలువైన 17.70 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లర్లు.. ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో దర్జాగా అమ్మేసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.40.90 కోట్ల విలువైన 18,907 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ పేరిట తీసుకున్న మిల్లర్లు స్వాహా చేశారు. దీనికి సంబంధించి 23 మంది మిల్లర్లు వడ్డీలు, జరిమానాలతో కలిపి రూ.68 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మంత్రులు మారినా.. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన పరిటాల సునీత అనేక మార్లు జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ బియ్యాన్ని బొక్కిన మిల్లర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా గురువారం అదే శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో పర్యటించారు. రెండు మిల్లుల్ని సీజ్ చేసి, నెలలోగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. గతంలోనూ కొందరిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా ఎలాంటి పురోగతి లేదు. అధికార పార్టీ నేతలు లాబీయింగ్ నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. కొందరు మిల్లర్ల నుంచి సొమ్ములు దండుకుని వారిపై చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేయిస్తున్నారు. మొత్తం మీద మంత్రి పర్యటన పరోక్షంగా అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించేందుకు దోహదపడుతుందనే విమర్శ వినిపిస్తోంది. -
అవే అక్రమాలు
ఫలితమివ్వని పకడ్బందీ చర్యలు రూ.71.76 లక్షల సర్కారు ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైన నిజాలు నిజామాబాద్ : వర్ని మండలంలోని ఓ రైసుమిల్లుకు ఈ ఖరీఫ్ కొనుగోలు సీజనులో 9,468 క్వింటాళ్ల సర్కారు ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ కోసం కేటాయించారు. ఈ మిల్లరు 2,012 క్వింటాళ్ల ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని సర్కారుకు అప్పగించాడు. ఇంకా ఈ మిల్లరు వద్ద 7,456 క్వింటాళ్ల సర్కారు ధాన్యం ఉండాలి. అనుమానం వచ్చి రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ బృందం ఇటీవల ఈ మిల్లును ఆకస్మిక తనిఖీ చేయగా.. కేవలం 2,672 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే స్టాక్ ఉంది. మిగిలిన 4,784 క్వింటాళ్ల సర్కారు ధాన్యం ఏమైనట్లు. ఈ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించిన టాస్క్ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ మిల్లరుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. జిల్లాలో ఒకే ఒక్క మిల్లరు పక్కదారి పట్టించిన సర్కారు ధాన్యం విలువ సుమారు రూ.71.76 లక్షలు ఉంటుంది. పైగా ఉన్న ధాన్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. సదరు మిల్లరు నిబంధనల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని అధికారుల చర్యలు సాగకుండా చేయడం గమనార్హం. ఎన్ని చర్యలు చేపట్టినా.. కస్టం మిల్లింగ్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఎన్ని ప్రత్యేక చర్యలు చేపట్టినా.. అక్రమాల్లో ఆరితేరిన మిల్లర్లు మాత్రం తమ ‘దందా’ య«థేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.కోట్లు సర్కారుకు కుచ్చు టోపి పెట్టిన మిల్లర్లు.. తాజాగా ఈ ఖరీఫ్ కొనుగోలు సీజను కస్టం మిల్లింగ్లోనూ తమ నైజాన్ని ప్రదర్శించారు. పైన పేర్కొన్న ఒక్క ఉదాహరణ చాలు కస్టం మిల్లింగ్లో అక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి. బ్యాంకు గ్యారంటీ.. క్రిమినల్ కేసుల హెచ్చరికలు.. ఇవేవీ అక్రమార్కులు ఖాతరు చేయడం లేదు. ఈసారి సీఎంఆర్ వేగవంతం.. ఈ ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ప్రభుత్వం 186 చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సుమారు రూ.300 కోట్లు వెచ్చించి రైతుల వద్ద 2.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. సేకరించిన ఈ ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ చేసి.. బియ్యం ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా 183 మిల్లర్లకు కేటాయించింది. ఈ« ధాన్యాన్ని తీసుకున్న మిల్లరు 1.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అప్పగించాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కస్టం మిల్లింగ్ ఈసారి వేగవంతమవుతోంది. ఇప్పటి వరకు సుమారు 1.09 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సర్కారుకు తిరిగి వచ్చేసింది. అంటే 80 శాతం కస్టం మిల్లింగ్ పూర్తయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కస్టం మిల్లింగ్ ఈ సారి వేగవంతం కాగా, అక్రమాలు మాత్రం అలాగే కొనసాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది. గతంలో సెప్టెంబర్ మాసాంతానికి కూడా కస్టం మిల్లింగ్ జరిగేది కాదు. కానీ.. ఈసారి జనవరి నెలాఖరు వరకు 95 శాతానికి పైగా ఈ కస్టం మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి చర్యలు చేపట్టారు. అక్రమాలు మాత్రం య«థేచ్ఛగా కొనసాగుతుండటంతో పౌరసరఫరాల శాఖను విమర్శలు వెంటాడుతున్నాయి. ‘కస్టం’ కేటాయింపుల్లో చేతివాటం జిల్లాలో కస్టం మిల్లింగ్ కేటాయింపుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. గతంలో ఇదే కస్టం మిల్లింగ్ పేరుతో సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.కోట్లులో ప్రభుత్వానికి ఎగనామం పెట్టిన బడా మిల్లర్లు ఇప్పుడా బినామీ పేర్లతో కొత్త లైసెన్సులు తీసుకున్న వారికి అధికారులు తిరిగి కోట్లు విలువైన ధాన్యం కస్టం మిల్లింగ్ కోసం అప్పగించడం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. సర్కారుకు ఎగనామం పెట్టినట్లు అధికారులకు తెలిసినప్పటికీ.. సాంకేతిక కారణాలు సాకుగా చూపి వారికే మళ్లీ ధాన్యాన్ని కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల చిత్తశుద్ధిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మిల్లర్లకు బ్లాక్ స్పాట్
-ఎఫ్సీఐకి తరలిస్తున్న బియ్యంపై నల్లచుక్కలు -40 వేల టన్నులు తిరస్కరణ -ఘొల్లుమంటున్న రైస్ మిల్లర్లు తాడేపల్లిగూడెం : రైస్ మిల్లర్లకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ‘బ్లాక్ స్పాట్’ పేరిట కొర్రీ వేస్తోంది. బియ్యం గింజల మధ్యలో నల్లటి మచ్చ ల్లాంటివి ఉన్నాయంటూ గడచిన 20 రోజుల్లో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని వెనక్కి పంపించింది. ఈ పరిస్థితితో మిల్లర్లు ఘొల్లుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి కస్టమ్ మిల్లింగ్ పేరిట బియ్యం ఆడించింది. ధాన్యాన్ని మరాడించినందుకు క్వింటాల్కు రూ.15 చొప్పున మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ధాన్యాన్ని ఆడగా వచ్చే ఊక, చిట్టు, తవుడు తదితరాలను మిల్లర్లకే ఇస్తోంది. క్వింటాల్ ధాన్యానికి బదులుగా 67 కిలోల చొప్పున బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఆ బియ్యాన్ని నేరుగా ఎఫ్సీఐకి అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లంతా ఎఫ్సీఐ డిపోలకు తరలించడం మొదలుపెట్టారు. టిప్ డ్యామేజీ ఉందంటూ.. మిల్లర్లు తీసుకొచ్చిన బియ్యాన్ని దిగుమతి చేసుకునే ముందు వాటి నాణ్యతను ఎఫ్సీఐ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేస్తుంటారు. అయితే, ఇటీవల మిల్లర్లు తీసుకొస్తున్న బియ్యంపై నల్లటి మచ్చలు (టిప్ డ్యామేజీ) ఉందని క్వాలిటీ కంట్రోల్ గుర్తించింది. అలాంటి బియ్యాన్ని దిగుమతి చేసుకునేది లేదంటూ ఎఫ్సీఐ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. గడచిన 20 రోజుల్లో సుమారు 60 వేల టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఎఫ్సీఐ డిపోలకు తరలించగా, టిప్ డ్యామేజీ పేరిట అందులో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియక రైస్మిల్లర్లు బేలచూపులు చూస్తున్నారు. 1.85 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా జిల్లావ్యాప్తంగా 10,65,436 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈ ధాన్యాన్ని మరాడించి 6,63,842 టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 50 వేల టన్నులను రేషన్ బియ్యం నిమిత్తం ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎఫ్సీఐకి బియ్యం తరలింపు ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ వరకు 4,79,137 టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ డిపోలకు చేరవేశారు. ఇంకా 1,84,709 టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. గత నెల వరకూ రోజుకు 3 వేల నుంచి 4 వేల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకి చేరవేసేవారు. గడచిన 20 రోజులుగా రోజుకు కనీసం వెయ్యి టన్నులు కూడా ఎఫ్సీఐ స్వీకరించడం లేదు. టిప్ డ్యామేజీ పేరిట బియ్యాన్ని తిప్పిపంపుతున్నారని మిల్లర్లు చెబుతున్నారు. నాణ్యత గుర్తించేదిలా ఎఫ్సీఐకి తరలించే బియ్యంలో ఒక బస్తా నుంచి 10 గ్రాముల్ని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బయటకు తీస్తారు. రంగు, పాలిష్, నూకల శాతం ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తారు. 10 గ్రాముల్లో 0.03 గ్రాములకు మించి దెబ్బతిన్న (డ్యామేజీ) బియ్యం ఉండకూడదు. అందులో నూకల శాతం 25 వరకు ఉండవచ్చు. అంతకుమించితే చెల్లించే సొమ్ములో కోత విధించడం లేదా వెనక్కి పంపించడం చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి కారణాలేమీ లేకపోయినా బియ్యంపై నల్లమచ్చలు ఉన్నాయంటూ బియ్యాన్ని వెనక్కి పంపిస్తున్నారు. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన 1.85 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ బియ్యాన్ని వెనక్కి తీసుకు రావాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ నష్టాన్ని ఎలా భరించాలని ప్రశ్నిస్తున్నారు. -
రైస్ మిల్లులపై దాడులు
విజయనగరం కంటోన్మెంట్ :రైస్మిల్లర్లపై ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు దాడులకు ఉపక్రమించారు. పేరుకుపోయిన ధాన్యం నిల్వలు, కస్టమ్ మిల్లింగ్ ముందుకు సాగకపోవడం తదితర కోణాల్లో వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వీరికి సమాంతరంగా పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా తనిఖీలు చేశారు. కాకపోతే, దాడుల పరిస్థితి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది. జేసీ ఆదేశాలకు, విజిలెన్స్ దాడులకు మధ్య సమయం ఎక్కువగా ఉండడం వల్ల ఈలోపు మిల్లర్లు జాగ్రత్త పడ్డారని, అందు వల్లేవాస్తవాలు బయటికి రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు లెవీలో రేషన్ బియ్యం వినియోగిస్తున్నారన్న సమాచారంతో పాటు పలుమార్లు రేషన్ బియ్యం కూడా అక్రమ రవాణా జరుగుతూ పట్టుబడడంతో జిల్లాలో ఏదో జరుగుతుందోనన్న అనుమానాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని పక్కన పెట్టి పీడీఎస్ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్గా ఇచ్చేస్తున్నారని, కొన్ని చోట్ల అందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. వీటిన్నింటిపై ‘సాక్షి’ లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అంతవరకు నోరు మెదపని జిల్లా అధికారులు డిఫెన్స్లో పడ్డారు. చివరకు తమ పీకకు చుట్టుకుంటుందన్న భయంతో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎదురైంది. అందు లో భాగంగానే మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, గుట్టురట్టు చేయాలని విజిలెన్స్ అధి కారులకు ఆదేశించారు. దీంతో మంగళవారం భోగాపురం, డెంకాడ, గంట్యాడ, పార్వతీపురం మండలాల్లోని మిల్లులపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఉపకలెక్టర్లు దాడులు నిర్వహించారు. మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలు, వారిచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్, ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది? అన్న వివరాలను సేకరించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. గంట్యాడ మండలం సిరిపురంలోని యడ్ల రమణమూర్తికి చెందిన కృష్ణవేణి మిల్లులో విజిలెన్స్ సీఐలు ఉమాకాంత్, రేవతమ్మల నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. 20 కిలోల ధా న్యం మాత్రమే తేడా వచ్చినట్టు మొదట తేల్చారు. గం ట్యాడ మండలంలోని కనకదుర్గ ఫ్లోర్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు గజపతిరావు నేతృత్వంలో భోగాపురం మండలంలోని శుభకరి రైస్మిల్లును, డెంకాడలోని శ్రీమన్నారాయణ రైస్మిల్ను ఆయా మండలాల తహశీల్దార్లతో కలిసి తనిఖీ చేశారు. అయితే అక్కడ మిల్లుల్లో ఎటువంటి పొరపాట్లూ లేవని తేల్చేశారు. రికార్డులు మాత్రం నిర్వహించలేదని వారిని రికార్డులు సక్రమంగా నిర్వహించుకోవాలని హె చ్చరించినట్లు డీఎం ఎం గణపతిరావు సాక్షితో చెప్పారు. అదేవిధంగా పార్వతీపురంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామయ్య కూడా మిల్లులను తనిఖీ చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ బి రామారావు మాట్లాడుతూ విజిలెన్స్ అధికారులు గానీ, తాము నియమించిన ఇతర అధికారులు గానీ రాత్రికి లేదా రేపు ఉదయం నివేదిక ఇస్తారని, నివేదిక ఆధారంగా వారిపై చర్యలు ఉంటాయని తెలి పారు. మిల్లుల్లో లెక్కలు తేలేదాకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూర్తి లెక్కలు తేలాకే మళ్లీ కొనుగోళ్లు చేపడతామన్నారు. అయి తే ఉదయం నుంచే దాడు లు మొదలు పెట్టినా ఏ మిల్లులోనూ అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించలేదు. సిఫార్సులకు, దాడులకు మధ్య సమయం ఎక్కువగా ఉండడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న వాదనలు తాజాగా వినిపిస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement