-
ఖైదీలకు ‘ఉపాధి’ నైపుణ్య శిక్షణ
నెల్లూరు : కారాగారాల్లో శిక్ష, రిమాండ్ అనుభవిస్తున్న ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన తర్వాత ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని అందించేందుకు జైళ్ల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో కం ప్యూటర్, టైలరింగ్, తాపీ, హౌస్ వైరింగ్, డెయిరీ ఫాం తదితర వాటిపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారుు. అందులో భాగంగా చెముడుగుంట లోని జిల్లా కేంద్రకారాగారంలో రిమాండ్, శిక్ష ఖైదీ లను బ్యాచ్లుగా విభజించి 60 రోజుల పాటు ఉ చితంగా కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణనందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు గాను 45 కంప్యూటర్లను స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కారాగారంలో ఏర్పాటు చేశారు. సోమవారం కేంద్రకారాగార సూపరిం టెండెంట్ ఎంఆర్ రవికిరణ్, ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్ ఎస్. రాజేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం ఖైదీలకు కం ప్యూటర్ శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఖైదీలకు కంప్యూటర్ పరి జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను, స్టడీ మెటీరియల్ను అందించారు. ఈ సందర్భంగా కారా గార సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్ మాట్లాడు తూ జైలు జీవనం అనంతరం ఖైదీలు తమ సొంతకాళ్లపై నిలబడి జీవించాలన్న లక్ష్యం గా జైళ్లశాఖ పలు చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధి కారుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్ర కారాగారాల్లోని రిమాండ్, శిక్ష ఖైదీలకు 60 రోజు లు, 45 రోజుల సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తోందన్నారు. శిక్షణనిచ్చి కోర్సు పూర్తయిన తర్వా త సరి ్టఫికెట్లు ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని ఖైదీ లం దరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. రెండు, మూడు రోజుల్లో టైలరింగ్, హౌస్ వైరింగ్, డెయిరీ తదితరాలకు సంబంధించి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు రవికిరణ్ చెప్పారు. రూ.4.25 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్ర కారాగారాల్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు జైళ్ల శాఖ చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్ర కారాగారానికి జైళ్లశాఖ రూ.4. 25 లక్షల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే విశాఖ కారాగారంలో డిజిటల్ లైబ్రరీ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా గత నెల 30వ తేదీన జిల్లా కేంద్ర కారాగారంలో డిజిటల్ లైబ్రరీ ని ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ బీవీ రమేష్కుమార్, జైలర్లు ఎ.కాంతరాజు, ఎస్. శివప్రసాద్. టీచర్ సీహెచ్ విజయకుమార్, సైన్క్రో సర్వ్గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధి విద్యాసాగర్, కారాగార సిబ్బంది, పాల్గొన్నారు. -
16 నుంచి శిక్షణ
ఎస్కేయూ : నిపుణ శిక్షణ ద్వారా అర్హులైన అంధులకు, వికలాంగులకు, పేదలకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిపుణ ఏపీ ఇన్చార్జ్ పీవీకే శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బీపీఓ శిక్షణ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9490702460 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. -
యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
వికారాబాద్ రూరల్ : జిల్లాలోని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలలోపు వారందరికీ ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తామని నెట్వల్డ్ సోల్యూషన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కంప్యూటర్కు సంబంధించి వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పట్టణంలోని రామయ్యగూడ రోడ్డులో ఉండే ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి వచ్చి చేరాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 91773 83102, 90636 58771లలో సంప్రదించాలన్నారు. -
లెక్చరర్లకు కంప్యూటర్ శిక్షణ
కాజీపేట రూరల్ : జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఈనెల 12 నుంచి 17 వరకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేటలోని నిట్లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్స్ ఐసీటీ అకడమిక్ ద్వారా తక్కువ ఫీజుతో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.ఆంజనేయులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, టూల్స్, ఇంటర్నెట్, ఈ–మెయిల్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ౖyð రెక్టర్, నిట్, వరంగల్ పేరిట తీసిన రూ.200 డీడీతో ప్రిన్సిపాల్ అనుమతి పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఉచిత కంప్యూటర్ కోర్సు శిక్షణ
హైదరాబాద్: నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ న్యూఢీల్లి, తెలంగాణా స్టేట్ స్కిల్ అండ్ స్కిల్ నాలేడ్జ్(టాస్క్) సంయుక్త ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్హత కనీసం 8వ తరగతి ఉండాలి. డిప్లొమా ఇన్ డిగ్రీలో ఆసక్తి గలవారు తమ సరిఫికెట్స్తో కార్ఖనా బస్స్టాప్ సమీపనా ఉన్న కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9618066663 సంప్రదించవచ్చు. అంతే కాకుండా , టోలిచౌకి సమీపాన ఉన్నవారు మైహోం రెయిన్బో అపార్ట్మెంట్స్లోని కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకొనే సౌకర్యం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement