-
సుశాంత్ కేసుపై నెలల తరబడి చర్చిస్తారా!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వంటి పెను సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుపై మీడియా సంయమనం పాటించాలని ప్రముఖ రచయిత చేతన్ భగత్ అన్నారు. సుశాంత్ పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, తన కెరీర్కు సుశాంత్ సాయం చేశాడని ఆయన చెప్పారు. సుశాంత్పై తనకు ప్రేమ లేదని ఎవరూ అనుకోవద్దని అదే సమయంలో దేశం పట్ల మనం జాగరూకతతో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. సుశాంత్ మృతి కేసును చర్చిస్తూ నెలల తరబడి మనం దాన్ని ప్రైమ్ టైమ్ అంశంగా చేయలేమని అన్నారు. ‘సుశాంత్ కేసును మనం కోరుకున్నట్టే ఇప్పుడు అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారిస్తోంది..దీనిపై ప్రజలు తలో రకంగా మాట్లాడుతున్నారు..ఇలాంటి వాటితో సాధించేదేమీ లేద’ని చేతన్ ఓ వార్తా ఛానెల్తో మాట్లాడుతూ అన్నారు. ప్రతి దేశం ఆర్థిక వ్యవస్ధలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు పనిచేస్తున్నాయని, మనం కూడా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. సుశాంత్ ఆత్మహత్య అందరికీ వినోదం పంచేలా ఉందని అన్నారు. సుశాంత్ విషాదాంతం చుట్టూ హత్యారోపణలు..ఆత్మహత్య కథనాలు, కుట్ర కోణాలు ఇలాంటివెన్నో ఆసక్తి రేపుతున్నా ఇది కథ కాదని, వాస్తవ ఘటన అని దీనిపై ఆధారాలతోనే వాస్తవాలు నిగ్గుతేలతాయని అన్నారు. ఛానెళ్లలో చర్చించే వారిని ఉద్దేశిచి ‘మీరు సీబీఐ విచారణ సవ్యంగా జరిగేలా చూడాలని లేదా సీబీఐ అవసరం లేదని కోరాలని అంతేకానీ రాత్రికి రాత్రి టీవీ చర్చల్లో కేసును మీరు పరిష్కరించలేరని ఆయన సెటైర్లు విసిరారు. ఇలాంటి విషయాలపై నుంచి మనం ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాక్సిన్ వంటి కీలకాంశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఇక కోవిడ్-19 తరుణంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపైనా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్టతరమైన పరీక్షలు విద్యార్ధులను ఆదుర్ధాకు గురిచేస్తాయని కోవిడ్ ఆందోళనలతో ఇది మరింత అధికమవుతుందని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్లతో పలు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవని పరీక్షకు కొద్దినిమిషాల జాప్యం జరిగినా విద్యార్ధుల స్కోర్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. చదవండి : సీబీఐ విచారణ సంతోషంగా ఉంది: రియా -
‘మీ భర్త నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాడు’
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన నాటి నుంచి బాలీవుడ్లో బంధుప్రీతి వంటి అంశాలతో పాటు సినీ విమర్శకుల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సుశాంత్ ఆఖరిసారిగా నటించిన ‘దిల్ బేచారా’ చిత్రం విడుదల కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసిద్ధ రచయిత చేతన్ భగత్ సిని విమర్శకులను ఉద్దేశిస్తూ.. ‘సంస్కారం లేని, ఉన్నతమైన విమర్శకులకు ఓ విన్నపం. సుశాంత్ సింగ్ ‘దిల్ బేచారా’ ఈ శుక్రవారం విడుదల అవుతుంది. కాస్తా సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి. పనికిమాలిన చెత్త అంతా రాయకండి. సున్నితంగా, స్పష్టంగా ఉండండి. మీ అతి తెలివితేటలను ఉపయోగించకండి. ఇప్పటికే చాలా మంది జీవితాలను నాశనం చేశారు. ఇప్పటికైనా ఆపండి. మేము ప్రతిది గమనిస్తూనే ఉంటాము’ అంటూ చేతన్ భగత్ ట్వీట్ చేశారు. గతంలో విమర్శకులు రాజీవ్ మసంద్, అనుపమ చోప్రా సుశాంత్ చిత్రాల పట్ల క్రూరంగా వ్యవహరించారని చేతన్ భగత్ ఆరోపించారు. (‘సుశాంత్ను అందుకే తొలగించారా!’) Ma'am, when your husband publicly bullied me, shamelessly collected all the best story awards, tried denying me credit for my story and drove me close to suicide, and you just watched, where was your discourse? https://t.co/CeVDT2oq47 — Chetan Bhagat (@chetan_bhagat) July 21, 2020 ఈ క్రమంలో అనుపమ చోప్రా, చేతన్ భగత్ ట్వీట్పై స్పందించారు. ‘విశ్లేషణ తక్కువగా ఉందని మీరు భావించిన ప్రతిసారి ఇదే జరుగుతుంది’ అని స్పందించారు. దీనికి చేతన్ భగత్ ‘మేడమ్.. మీ భర్త నన్ను బహిరంగంగా తిట్టారు. బెస్ట్ స్టోరి అవార్డులను సిగ్గులేకుండా తీసుకున్నారు. నా కథకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. పైగా ఆయన ప్రవర్తనతో నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించారు. మీరు వీటన్నింటిని చూస్తూ ఉన్నారు. మరి మీ విశ్లేషణ ఏది’ అంటూ ప్రశ్నించారు. చేతన్ భగత్ రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్వన్’ నవల ఆధారంగా ‘3 ఇడియట్స్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే విడుదల సమయంలోనే దీనిపై వివాదం మొదలయ్యింది. ఈ చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ నవల హక్కులను కొనుగోలు చేశారు. అయితే చిత్రం ప్రారంభంలో ‘చేతన్ భగత్ ‘ఫైవ్పాయింట్ సమ్వన్’ ఆధారంగా’ అని వేశారు. కానీ టైటిల్స్లో కథ, స్క్రీన్ప్లే అభిజాత్ జోషి అని వేశారు. అంతేకాక ఐఫా, ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లలో ఉత్తమ కథ బహుమతిని హిరానీ, జోషి అందుకున్నారు. దీనిపై గతంలోనే చేతన్ భగత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. Each time you think the discourse can’t get lower, it does! https://t.co/yhkBUd8VSQ — Anupama Chopra (@anupamachopra) July 21, 2020 -
‘సుశాంత్ను అందుకే తొలగించారా!’
ముంబై: సినీ రచయిత చేతన్ భగత్ ఐదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మోహిత్ సూరి దర్శకత్వంలో వస్తున్న ‘హాఫ్ గర్ల్ఫ్రెండ్’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ లీడ్రోల్లో నటించబోతున్నాడు. ఇది చాలా సంతోషంగా ఉంది’ అంటూ 2015లో చేతన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చివరికి ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కావాలనే ఈ సినిమా నుంచి సుశాంత్ను తొలగించారంటూ దర్శకుడిపై, అర్జున్ కపూర్, బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో బంధుప్రీతి(నెపొటిజం) కారణంగా సుశాంత్ ‘హాఫ్ గర్ల్ఫ్రెండ్’ సినిమా నుంచి తొలగించి స్టార్కిడ్ అయిన అర్జున్ను తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. (జస్టిస్ ఫర్ సుశాంత్) So happy to share @itsSSR will play lead in @mohit11481 directed Half Girlfriend. Shooting begins 1Q16. https://t.co/dUHSVZ2FQ5 — Chetan Bhagat (@chetan_bhagat) November 7, 2015 అంతేగాక ఈ సినిమాలో అర్జున్ నటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘బాలీవుడ్లో బంధుప్రీతి(నెపోటిజమ్) ఎంతగా పేరుకుపోయిందో చూశారా. సుశాంత్ను తొలగించి అదిత్య రాయ్... రణ్వీర్లు.. లెజెండరి నటుడు అర్జున్ కపూర్లు సినిమా అవకాశాలు పొందారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిందా లేదా అన్యాయంగా సుశాంత్ను తొలగించడం వల్ల జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ ఇప్పటికైనా సుశాంత్కు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే భవిష్యత్తులో మరికొందరు సుశాంత్లను పొగొట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాలీవుడ్ స్టార్కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలని ఇకపై వారి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిస్తున్నారు. (సుశాంత్ ఫైనల్ పోస్ట్మార్టమ్ రిపోర్ట్) -
తొలిప్రేమను దక్కించుకోవటానికి..
పుస్తకం : హాఫ్ గర్ల్ఫ్రెండ్ రచయిత : చేతన్ భగత్ భాష : ఇంగ్లీష్ హాఫ్ గర్ల్ఫ్రెండ్ నవల ముఖచిత్రం కథ : మాధవ్ జా బీహార్కు చెందిన యువకుడు. డిగ్రీ చదవుల నిమిత్తం ఢిల్లీలోని సేయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చేరతాడు. అక్కడ రియా సోమని అనే డబ్బున్న అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కావటంతో సన్నిహితంగా మెలుగుతుంటారు. రియాను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిన మాధవ్ చాలా రోజుల తర్వాత ఆ విషయాన్ని ఆమెకు చెబుతాడు. ఆమె ప్రేమా, గీమా వద్దు ఫ్రెండ్స్గా ఉందాం అంటుంది. అతను మాత్రం తన ప్రయత్నాల్లో తను ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు వస్తాయి. అప్పటినుంచి రియా, మాధవ్ను దూరంగా ఉంచుతుంది. కొద్దిరోజులకే వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడుతుంది. రియాతో మాట్లాడటానికి పరితపిస్తున్న మాధవ్కు ఓ రోజు ఆమెతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఆ మాటల సందర్భంలోనే తనకు పెళ్లి నిశ్చయమైనట్లు, కాలేజీ మానేస్తున్నట్లు అతడికి చెబుతుంది. మాధవ్కు పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి రమ్మంటుంది. దీంతో అతడు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసుకుని బీహార్ వెళ్లిపోతాడు. తమ కుటుంబం నడుపుతున్న స్కూల్లో పనిచేస్తూ తల్లికి తోడుగా ఉంటాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాట్నాలోని ఓ హోటల్లో రియా అతడికి కన్పిస్తుంది. పెళ్లి అవటం, తర్వాత విడాకులు తీసుకోవటం గురించి అతడికి చెబుతుంది. ఇద్దరు మళ్లీ స్నేహంగా ఉండటం మొదలుపెడతారు. మాధవ్ తల్లికి ఇదంతా నచ్చదు. విడాకులు తీసుకున్న అమ్మాయితో కొడుకు సన్నిహితంగా ఉండటం, రాజవంశానికి చెందిన తన కుమారుడు వేరే కులం అమ్మాయితో తిరగటం సహించలేకపోతుంది. రోజులు గడుస్తున్న కొద్ది మాధవ్, రియాపై మరింత ఆశలు పెంచుకుంటాడు. అయితే ఈ సారైనా రియా, మాధవ్ ప్రేమను అంగీకరిస్తుందా? సున్నితంగా కుదరదని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుందా? ఒక వేళ అంగీకరిస్తే మాధవ్ తల్లి వీరి పెళ్లికి అడ్డుచెబుతుందా? లేక కొడుకు సంతోషం ముఖ్యమని అంగీకరిస్తుందా? అన్నదే మిగితా కథ. విళ్లేషణ : ప్రముఖ ఇంగ్లీష్ నవలల రచయిత చేతన్ భగత్ ఊహాల్లోంచి జాలువారిన ఓ అద్భుత ప్రేమ కావ్యం. తొలిప్రేమను దక్కించుకోవటానికి కష్టపడే మాధవ్ పాత్ర పాఠకుల(ప్రేమికుల) మనసులో ముద్రపడిపోతుంది. తెలిసీ తెలియని వయసులో తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఎలా జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తాయో రియా, మాధవ్ల పాత్రలు మనకు ఉదహరిస్తాయి. ఇంగ్లీష్ భాషపై పట్టులేని వాళ్లకు కూడా అర్థమయ్యేలా రచయిత ఈ పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ నవల ఆధారంగా బాలీవుడ్ ఇదే పేరుతో ఓ సినిమా కూడా తెరకెక్కింది. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్లు ఈ సినిమాలో జంటగా నటించారు. ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన నవల ఇది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రేమ పోయిన తర్వాత...
‘ఇది ప్రేమ కథ కాదు. ప్రేమ పోయిన కథ.’ ఇలా ముగిసే చేతన్ భగత్ నవల, ‘ద గర్ల్ ఇన్ రూమ్ 105’లో– కథానాయకుడైన 27 ఏళ్ళ కేశవ్, ‘చందన్ క్లాసెస్’లో బోధిస్తుంటాడు. సహోద్యోగీ, ఢిల్లీ మాలవీయ నగర్ ఫ్లాట్మేటూ అయిన సౌరభ్ (గోలూ) తో కలిసి, ఒక ఫిబ్రవరి రాత్రి తాగుతూ ఉంటాడు. నాలుగేళ్ళ పాత గర్ల్ ఫ్రెండ్, జారా పుట్టినరోజు అదేనని గుర్తుకొస్తుంది. అప్పుడే, తెల్లారి మూడు గంటలకు, జారా నుండి ‘నా పుట్టిన రోజని మరచిపోయావా! నువ్వు గుర్తుకొస్తున్నావు. రఘు మంచివాడే కానీ నాకు సరిపడినవాడు కాదు. ఇంకా, హిమాద్రి హాస్టల్లో 105వ నంబర్ గదిలోనే ఉన్నాను. ముందులాగే, కిటికీ బయటున్న మామిడి చెట్టెక్కి, గదిలోకొచ్చెయ్యి’ అన్న వాట్సాప్ మెసేజులు వస్తాయి. గతంలో కేశవ్ ఢిల్లీ ఐఐటీ వదులుతుండగా, అక్కడ పీహెచ్డీ చేయడానికి వచ్చిన జారాతో ప్రేమలో పడతాడు. ఆమె కశ్మీరీ ముస్లిం. కేశవ్ తండ్రి రాజస్తాన్, అల్వర్లో– ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినందున, అతనింటివారు వారి సంబంధాన్ని ఆమోదించరు. నవల మొదలయ్యేటప్పటికే జారా, కేశవ్కు దూరమై, అతని బ్యాచులోనే చదివిన తెలుగబ్బాయి రఘును పెళ్ళి చేసుకోడానికి రెండు నెలలే మిగిలుంటాయి. రఘు మల్టీనేషనల్ కంపెనీలో పైకి ఎదుగుతుంటాడు. కేశవ్, సౌరభ్–105కి వెళ్ళేటప్పటికే జారా చనిపోయి ఉంటుంది. ఆమె మెడ నులిమిన గుర్తులు కనబడతాయి. కేశవ్– దగ్గర్లోనే ఉండే జారా తండ్రి సఫ్దర్కూ, పోలీస్ ఇన్స్పెక్టర్ రానాకూ, రఘుకీ ఫోన్ చేసి చెప్తాడు. రఘు చెయ్యి విరిగి, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఉంటాడు. హాస్టల్ వాచ్మన్ లక్ష్మణ్ రెడ్డి, హత్యా సమయమప్పుడు తన నియమితమైన చోటున లేనందువల్లా, గతంలో జారా అతనితో గొడవపడ్డమూ తెలిసి, రానా అతన్ని కస్టడీలోకి తీసుకుంటాడు. అయితే, కేశవ్ – గోలూ సహాయంతో, తనే డిటెక్టివ్ పని మొదలెడతాడు. అతని మొదటి అనుమానం– జారామీద కన్నేసిన ఆమె పీహెచ్డీ గైడయిన సక్సేనా మీదకి వెళ్తుంది. కాకపోతే, సక్సేనా కుంటుతాడు కనుక అతను చెట్టెక్కలేడని గ్రహించిన కేశవ్ సందేహం, తీవ్రవాదుల్లో చేరిన జారా సవతి తమ్ముడైన సికందర్ పైకి మళ్ళుతుంది. సికందర్ ఉండే కశ్మీర్ వెళ్లినప్పుడు, సికందర్ ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడున్న ఆర్మీ ఆఫీసరైన ఫెయిజ్ పెళ్ళయి, కవల పిల్లలున్నవాడు. ఫెయిజ్తో జారా సంబంధం పెట్టుకుందన్న సాక్ష్యం దొరికినప్పుడు, అతనే హంతకుడని అనుమానిస్తాడు. సఫ్దర్కు, జారా పోయిన వందో రోజు అందరినీ పిలవమనీ, తను హంతకుడెవరో బయటపెడతాననీ చెప్పి, రానాకూ ఫోన్ చేస్తాడు. అందరికీ ఆ తెలివైన హంతకుడెవరో తెలుస్తుంది. నవల చివర్న, తను ప్రేమించిన జారా తనకు అర్థమే కాలేదని గుర్తిస్తాడు కేశవ్. గోలూతో కలిసి ‘జెడ్ డిటెక్టివ్స్’ అన్న ఏజెన్సీ తెరుస్తాడు. ‘నీ పిల్లలకు రఘు పోలికలు రావాలనుకుంటున్నావా – నల్లగా, అసహ్యంగా! కనీసం, కశ్మీరీల రంగు నిలబెట్టు.’ ఫెయిజ్, జారాకు పంపిన ఇలాంటి మెసేజులు, ఉత్తరాదిలో తెల్లచర్మంపట్ల ఉండే పక్షపాతాన్ని కనపరుస్తాయి. ముస్లిమ్/హిందూ మతవాదాలు, కశ్మీర్ సమస్యలు, హత్య గురించిన టీవీ చర్చలుండే పుస్తకమంతటా, కేవలం ఢిల్లీవాసులు మాత్రమే ఉపయోగించగలిగే, యథాలాపమైన హిందీ తిట్లూ, ‘ఠర్కీ, ఆషిక్, తమీజ్, గద్దార్, పంగా’ లాంటి మాటలూ కనబడతాయి. చేతన్ భగత్ మిగతా పుస్తకాలు– భిన్నమైన కులాల, ప్రాంతాల, సంస్కృతుల జంటలు ఆఖరికి కలిసిపోవడంతో ముగిస్తే, ఇది మాత్రం కొంచెం భిన్నంగా– ఎన్నో మలుపులతో, హత్యామర్మాన్ని ఛేదించినది. అయితే, రచయిత పుస్తకాలన్నిట్లోలాగే ఇదీ ఐఐటీ నేపథ్యంతో ఉన్నదే. సంభాషణలతోనే కొనసాగుతుంది. ఉత్తమ పురుషంలో ఉండే కథనం సరళమైన వాడుక భాషలో ఉంటుంది. ఈ నవలను 2018లో ప్రచురించినది వెస్ట్లాండ్. - యు. కృష్ణవేణి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement