-
ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే దాడులు
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ఏబీవీపీ నేతలు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దాడులకు పాల్పడుతున్నారని సామాజిక న్యాయపోరాట ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 16న అమోల్ సింగ్ అనే పరిశోధక విద్యార్థిపై ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ దాడి చేయడం దారుణమన్నారు. రోహిత్ వేముల ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై పదే పదే దాడులు చేస్తూ క్యాంపస్లో ప్రజాస్వామ్య వాతావరణాన్ని హరిస్తున్నారన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితులైన వీసీ అప్పారావు, ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న రాత్రి షాప్కామ్ వద్ద కశ్మీర్ పరిణామాలపై చర్చిస్తుండగా బైక్లపై ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు ప్జాబ్కు చెందిన అమోల్ సింగ్ అనే విద్యార్థిపై దాడిచేసి కొట్టారని వారు ఆరోపించారు. బాధితుడిని సహ విద్యార్థులు చందానగర్లోని ప్రణమ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ సుశీల్ కుమార్ సోదరుడు విష్ణు మరోసారి చేయిచేసుకోవడమేగాక చంపుతామని బెదిరించినట్లు తెలిపారు. విద్యార్థులపై దాడులు జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయకుండా, రోహిత్ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీసీ తోడ్పాటుతోనే ఏబీవీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
సెంట్రల్ వర్సిటీ కోసం స్థల పరిశీలన
అనంతపురం : సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు కోసం అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలం దాదులూరు సమీపంలో స్థలాలను అధికారులు పరిశీలించారు. ముగ్గురు అధికారులతో కూడిన కేంద్ర బృందం మంగళవారం ఉదయం పర్యటించారు. ఇక్కడ జాతీయ రహదారి పక్కన మొత్తం 720 ఎకరాలకు పైగా (589 ఎకరాలు ప్రభుత్వ, 130 ఎకరాలు పట్టాభూములు) అందుబాటులో ఉన్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్, రెవెన్యూ అధికారులు కేంద్ర బృందానికి నివేదించారు. అనంతరం కేంద్ర బృందం పెనుగొండకు బయల్దేరి వెళ్లింది. ఈ బృందం వెంట రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా ఉన్నారు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే జిల్లాలోని బుక్కరాయసముద్రం వద్ద స్థలాలను కేంద్ర బృందం పరిశీలించింది. అలాగే, పెనుగొండ, పుట్టపర్తి వద్ద భూములను కూడా పరిశీలించిన అనంతరం అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి కేంద్రానికి నివేదిక అందించనున్నట్టు తెలుస్తోంది. (కనగానపల్లి)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement