-
‘దేశం ఇప్పటికే క్యాష్ లెస్ అయింది’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ క్యా‘ష్ లెస్’ డ్రీమ్ పై కాంగ్రెస్ వాగ్బాణాలు ఎక్కుపెట్టింది. నగదు రహిత లావాదేవీల దిశగా ముందుకెళ్లాలన్న మోదీ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేసింది. మోదీ సర్కారు అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశం ఇప్పటికే ’నగదు రహితం’గా మారిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ వ్యంగ్యంగా అన్నారు. ముందస్తు సన్నాహాలు, సంస్థాగత కసరత్తు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. సామాన్యులను కష్టాలకు గురిచేసి దేశాన్ని నగదు రహితంగా మారుస్తారా అని ప్రశ్నించారు. ‘నోట్ల కష్టాలు లేకుండా ముందు సన్నాహాలు చేయండి. దేశంలో 70 శాతం మంది ప్రజలు నెలకు 10 వేల రూపాయల సంపాదనతో బతుకుతున్నారు. వీరు తమ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసుకోలేరు. వీళ్లంతా ఏం చేయాలి? ప్రజలు నగదు కోసం 20 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి వస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దుతో ప్రజల దగ్గర డబ్బు లేకపోవడంతో దేశం ఇప్పటికే నగదు రహితంగా మారింద’ని సిబల్ వ్యాఖ్యానించారు. -
త్వరలో క్యాష్లెస్ ఇండియా....
న్యూఢిల్లీ : త్వరలో క్యాష్లెస్ ఇండియాను తయారు చేద్దామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక నుంచి నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే జరిపేలా చూద్దామని ఆయన తెలిపారు. నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారా జరిగేలా ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. నగదు లావాదేవీలు లేని దేశం వైపు అడుగులు వేద్దామని జైట్లీ అన్నారు. నల్లధనం అరికట్టేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల ఉపయోగించేలా చూద్దామన్నారు. అలాగే జన్ధన యోజన ఖాతాదారులకు డెబిట్ కార్డులు సదుపాయం కల్పిస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement