-
జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమంటే..!
తిరువనంతపురం: పరీక్షల్లో ఎవరికైనా ప్రశ్నపత్రం ఇచ్చి జవాబులు రాయమంటారు. కానీ కేరళ యూనివర్సిటీ పరీక్షలో మాత్రం విద్యార్థికి ఏకంగా జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు. ఇంకేముంది.. ఆ విద్యార్థి ఎంచక్కా పరీక్ష రాసేసి వెళ్లిపోయాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించిన వర్సిటీ పరీక్ష రద్దు చేసింది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ నాలుగో సెమిస్టర్ చదువుతున్న ఓ విద్యార్థి కరోనా వల్ల ‘సిగ్నల్ అండ్ సిస్టమ్స్’పరీక్షకు హాజరుకాలేకపోయాడు. అతని కోసం ఈ ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆఫీస్ పొరపాటున ప్రశ్నపత్రానికి బదులు జవాబు పత్రం ముద్రించి పంపింది. ఇన్విజిలేటర్ కూడా దాన్నే విద్యార్థికి ఇచ్చాడు. పేపర్ దిద్దిన ప్రొఫెసర్ జరిగిన పొరపాటును గుర్తించి పైఅధికారులకు తెలిపాడు. దాంతో ఆ ఎగ్జామ్ను రద్దు చేసిన మే మూడో తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. పొరపాటుపై వర్సిటీ విచారణకు ఆదేశించింది. -
డిగ్రీ తెలుగు పాఠ్యాంశంగా ‘సాక్షి’ కథనం
సాక్షి, హైదరాబాద్: నేటితరానికి ‘సాక్షి’కథనం ఓ పాఠ్యాంశమైంది. యువతరాన్ని మేల్కొలిపే ఆయు ధమైంది. గతేడాది (డిసెంబర్ 21, 2020) ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికతో ప్రచురితమైన వార్తాకథనాన్ని డిగ్రీ మూడో ఏడాది తెలుగు పుస్తకంలో పాఠంగా చేర్చారు. తెలుగు అకాడమీ రూపొందించిన తెలు గు సాహితీ దుందుభి పుస్తకాన్ని ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం ఇక్కడ ఆవిష్క రించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఏ కోర్సుల ద్వితీయ భాషగా ఈ పుస్తకాన్ని అందించారు. విద్యార్థుల్లో రచనానైపుణ్యాలను పెంచాలన్న సంకల్పంతో ‘సాక్షి’కథనాన్ని జర్నలిజం మౌలికాం శాల శీర్షికలో చేర్చారు. రికార్డులు తారుమారు చేస్తూ ఊరినే అమ్మేసిన ఓ ఘనుడి నిర్వాకం వల్ల కామా రెడ్డి జిల్లా బూరుగిద్ద పల్లెవాసులు పడే గోసను ‘సాక్షి’ ప్రజల దృష్టికి తెచ్చి ప్రభుత్వ యంత్రాం గాన్ని కదిలించింది. పుస్తకావిష్కరణలో ‘సాహితీ దుందుభి’ ప్రధానసంపాదకుడు సూర్యాధనంజ య్, ఆచార్య కాశీం, లావణ్య, ఎస్.రఘు, వి.శ్రీధర్, శంకర్, కృష్ణయ్య, డా.భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
విద్యా సమాచారం
13, 14 తేదీల్లో ఉమ్మడి కౌన్సెలింగ్ హైదరాబాద్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అడ్మిషన్ల కోసం 2015-16 విద్యా సంవత్సరానికి బీవీఎస్సీ, బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బీఎఫ్ఎస్సీ, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సుల ఆఖరి ఉమ్మడి కౌన్సెలింగ్ ఈ నెల 13,14 తేదీల్లో జరగనుంది. ఈ కౌన్సెలింగ్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ఆడిటోరియం, లాంఫారం, గుంటూరులో జరగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. సిద్దిపేట డిగ్రీ కాలేజీకి స్వయం ప్రతిపత్తి సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి స్వయం ప్రతిపత్తి (అటానమస్ హోదా) లభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఆ కాలేజీని నిర్వహించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. క ళాశాల విద్య కమిషనర్ చైర్పర్సన్గా ఉండే ఈ కమిటీలో ప్రొఫెషనల్ కేటగిరీలో సామాజిక కార్యకర్త ఇరేని శ్రీనివాస్ సురేంద్ర, పారిశ్రామికవేత్తల కేటగిరీలో హెటిరో రీసెర్చ ఫౌండేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్ డెరైక్టర్ కె.రత్నాకర్రెడ్డి, ప్రభుత్వ నామినీ కేటగిరీలో కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఉంటారు. సీట్ల భర్తీని ఆమోదించలేం మల్లారెడ్డి వైద్య కళాశాల పంపిన జాబితాపై ఎన్టీఆర్ వర్సిటీ హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో ఉన్న మల్లారెడ్డి వైద్య కళాశాల పంపిన ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితాను అనుమతించకూడదని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయించింది. భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల మేరకు అడ్మిషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో వర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకే ఎంబీబీఎస్ అడ్మిషన్లకు గడువు ఉంది. అయితే మల్లారెడ్డి వైద్య కళాశాల ఢిల్లీ హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుంటేనే అడ్మిషన్లకు అనుమతిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా మల్లారెడ్డి వైద్య కళాశాల.. యాజమాన్య కోటా సీట్లు(బీ కేటగిరీ), ప్రవాస భారతీయ కోటా(సీ కేటగిరీ) సీట్లను భర్తీ చేసుకుని, ఈ జాబితాను అనుమతించాలని, కోర్టు అనుమతి వచ్చాకే కన్వీనర్ కోటా భర్తీ చేసుకుంటామని బీ,సీ జాబితాను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పంపించింది. దీనిపై హెల్త్ వర్సిటీ.. కన్వీనర్ కోటా భర్తీ చేయకుండా యాజమాన్య కోటా సీట్లు, యాజమాన్య కోటా భర్తీ చేయకుండా ప్రవాస భారతీయ కోటా(ఎన్ఆర్ఐ) సీట్లకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పాత స్థానాల్లోనే ఉన్న టీచర్ల రిలీవ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా 2013లో బదిలీ అయినా, పాత స్థానాల్లోనే కొనసాగుతున్న వారిని రిలీవ్ చేయాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డెరైక్టర్ చిరంజీవులు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులకు సూచించాలని పేర్కొన్నారు. విద్యా వలంటీర్లను నియమించినందున, ప్రతి పాఠశాలలో రెగ్యులర్ టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, పాఠశాల విద్య డెరైక్టర్ ఆదేశాల నేపథ ్యంలో బదిలీ అయినా పాత స్థానాల్లో కొనసాగుతున్న టీచర్లు ఈ నెల 9న కొత్త స్కూళ్లలో చేరాలని పీఆర్టీయూ-టీఎస్, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్రెడ్డి, సరోత్తంరెడ్డి, రాజిరెడ్డి, భుజంగరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement