-
2051 లక్ష్యంగా వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక
సాక్షి, విశాఖపట్నం: 2051 లక్ష్యంగా దృక్పథ ప్రణాళిక సిద్ధం చేయడానికి విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) కసరత్తు ప్రారంభించింది. గురువారం నిర్వహించిన వీఎంఆర్డీఏ స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ,అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రమణమూర్తి రాజు,నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన, విశాఖ నార్త్ కన్వీనర్ కె రాజు పాల్గొన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో సూక్ష్మస్థాయి నుంచి పరిశీలన చేసి అభివృద్ధి చేయడంతో పాటు పాలసీ ఫ్రేమ్ వర్క్పై దృష్టి పెట్టానున్నారు. దృక్ఫథ ప్రణాళిక రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. మూడు రీజియన్ల ఫీడ్బ్యాక్తో ఆర్థిక వృద్ధికి పెద్దపీట,రాష్ట్ర విధానాలకు అనుగుణమైన నిర్మాణాత్మక ప్రణాళిక, సీఆర్జెడ్ రెగ్యులేషన్స్ పరిధిలో రెజీలియంట్ టెక్నాలజీలపై సమావేశంలో చర్చించారు. భావనపాడు,నక్కపల్లి, భీమిలిపట్నంలో వచ్చే గ్రీన్ఫీల్డ్ పోర్టులపై సమావేశంలో ప్రస్తావన కొచ్చాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి నిర్మాణాత్మకమైన సలహాలను, సూచనలను వీఎంఆర్డీఏ స్వీకరించింది. -
గుంటూరులో మంత్రుల పర్యటన
సాక్షి, గుంటూరు : మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా, శనివారం గుంటూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ నగరంలోని డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అస్తవ్యస్తంగా పనులు నిర్వహిస్తున్న అధికారులపై ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరం గుంటూరు అని, అలాంటి నగర అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. వర్షం పడితే నగరం దుర్వాసన వస్తోందని, త్వరితగతిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని ఇసుక సమస్యపై కూలీలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. -
సాహితీ సౌరభం... సాంస్కృతిక వికాసం...
ఒకవైపు అపురూప పుష్ప సోయగాలు... మరోవైపు మనసును మైమరపించే శ్రావ్యమైన సంగీత సరాగాలు... ఇంకోవైపు లయబద్ధంగా వినిపించే శాస్త్రీయ నృత్య మంజీరాలు... మరోవైపు చూడగానే ఆకట్టుకునే రకరకాల పెంపుడు శునకాలు... నగరవాసుల్ని అమితంగా ఆకర్షించే క్రీడాసంబరాలు. ఇలా ప్రతీ వేదికా ఆకర్షణీయమే. ప్రతి అంశమూ అభినందనీయమే. విజ్ఞాన... వినోదాన్ని పంచే ప్రదర్శనలో ప్రభుత్వ పథకాలపై వినూత్నమైన ప్రచారం ఆలోచనాంశమే. ఇదీ గడచిన రెండు రోజులుగా జరుగుతున్న విజయనగర ఉత్సవ విశేషాలు. దీనికి తోడైన అమ్మవారి సంబరాలు... నగర రూపురేఖల్నే మార్చేశాయి. నగరం శోభాయమానంగా కనిపిస్తోంది. సాక్షి, విజయనగరం : విజయనగరం ఉత్సవాలు రెండో రోజు మరింత శోభను సంతరించుకున్నాయి. అన్ని కార్యక్రమాలకు సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఎటు చూసినా కోలాహలంగా మారింది. నగరమంతా పండగ వాతావరణం కనిపించింది. ఆదివారం నాటి ఉత్సవాల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. వివిధ వేదికల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ఆయన స్వయంగా వెళ్లి తిలకించారు. మరోవైపు గురజాడ కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ గాత్ర కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గురజాడలోనూ, సంస్కృతిక కశాశాలలోనూ పలువురు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. రెండవ రోజు డాగ్షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యా, వైజ్ఞానిక, ఫల పుష్ప ప్రదర్శనలు కొనసాగాయి. కవి సమ్మేళనం, ఆనంద వేదిక’ ప్రదర్శనలు మరింతగా ప్రజలను ఆకట్టుకున్నాయి. పుష్ప... ఫల ప్రదర్శనకు అదే తాకిడి... స్థానిక ఎమ్మా సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన పుష్ప, ఫల ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం సాయింత్రం సందర్శించారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఎడ్లబండితో పాటు, ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫ్లవర్స్ను, పండ్లను, మొక్కలను అన్నింటిని పరిశీలించి వాటిగురించి తెలుసుకున్నారు. అదేవిధంగా పైడితల్లి అమ్మవారి రూపంలో వేసిన సైకత శిల్పాన్ని, ఐస్తో రూపొందించిన శివలింగాన్ని కూడ తిలకించారు. ఆ తర్వాత బ్రహ్మకుమారీస్ ఏర్పాటు చేసిన స్టాల్ను కూడ చూసి వారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించారు. సందర్శకుల కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రధమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కోటలోని మాన్సాస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు చేపట్టిన విద్యవైజ్ఞానిక ప్రదర్శన ఆదివారం కొనసాగింది. అందరికీ విద్య అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథక ప్రదర్శన హైలైట్గా నిలింది. పట్టణ, జిల్లా వ్యాప్తంగా 145 ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు చెందిన 165 పరిశోధనా, సామాజిక చైతన్య నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. వినూత్నంగా గతంలోలేని అంశాలను ఈ ఏడాది ప్రదర్శనలో ఉంచడం విశేషం. ఈ–నాలెడ్జ్ హబ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్, ఇంక్యూసివ్ ఎడ్యుకేషన్, స్టాంప్స్, కాయిన్స్ సందర్శనలు, రోబోటిక్స్ ప్రదర్శనలో ఉంచారు. సంస్కృత కళాశాల విద్యార్థులకోసం హాస్టల్ మహారాజా సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధులకు రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీనిచ్చారు. విజయనగర ఉత్సవాల్లో భాగంగా సంస్కృత కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రాచీన ప్రాచ్యగ్రంథాలను, అష్టావధానం ప్రక్రియను ఆయన ఆదివారం పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి విజ్ఞప్తి మేరకు విద్యార్థులకోసం హాస్టల్ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. విజయనగర సాంస్కృతిక సాహిత్య, కళా విశిష్టతను తమ కవితల ద్వారా ఆవిష్కరించి నగర ఖ్యాతిని చాటిచెప్పేలా కమిసమ్మేళనంలో కవితలు వినిపించిన వారిని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు సత్కరించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో నాటికలు, హరికథలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. గురజాడ కళాభారతిలో ప్రదర్శించిన నాటికలు, ఏకపాత్రాభినయాలు వీక్షకులను కట్టిపడేశాయి. వీనుల విందు చేసిన గానకచేరీలు సినీగీతాలాపనలో జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్ విజయనగరం ఉత్సవాల సందర్భంగా ఆనందగజపతి కళా క్షేత్రంలో రెండో రోజైన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గాన కచేరీలు వీనుల విందు చేసి ప్రేక్షకులను ఆలరించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ కూడా తనదైనశైలిలో సంగీత కళాకారుల చెంత చేరి వారితో గళం కలిపారు. భక్తి గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని రక్తికట్టించారు. కళాభిమానులు, ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో స్త్రీ నిధి రుణాలకు సంబంధించిన 142 మంది సభ్యులకు సంబంధించిన రూ.71 లక్షల విలువగల చెక్కును జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు, సంగీత దర్శకుడు యం. భీష్మ సారధ్యంలో అన్నమాచార్య కీర్తనలు విజయనగరం సంస్కృతీ, సంప్రదాయం ఉట్టి పడేలా సాగింది. విశ్వకర్మ డ్యాన్స్ అకాడమీ, జమ్ము నారాయణపురం బృందంచే అష్టలక్ష్మీ స్తోత్రం నత్య రూపకం ప్రదర్శించారు. కార్యక్రమాలకు హాజరైన మంత్రి బొత్ససత్యనారాయణ కళాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కార్యక్రమానికి విచ్చేసి కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆ«ధ్వర్యంలో నిర్వహించిన ఆర్కెస్ట్రాలో కలక్టర్ హరిజవహర్లాల్, సినీ నటి కల్యాణి, సోషల్వెల్ఫేర్ డీడీ కె సునీల్ రాజ్కుమార్ సినీ గేయాలు ఆలపించి శ్రోతలను అలరించారు. -
తోటపల్లికి మహర్దశ..!
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరనున్నాయి. మొత్తం ఆయకట్టుకు సాగునీరందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్టు పరిస్థితిపై పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల మంత్రులు, ఎంపీలతో చర్చించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ సాగునీరందేలా పిల్ల కాలువలు, లైనింగ్, భూసేకరణ, ఆర్ఆర్ ప్యాకేజీలకు రూ.400 కోట్లు అవసరంగా గుర్తించారు. ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు. నిధుల సమీకరణ ఏఏ విభాగాల నుంచి సేకరించాలన్న అంశంపై మరోమారు సమావేశం కానున్నట్టు మంత్రి బొత్స ప్రకటించడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు పూర్తయితే బీడు భూముల్లో బంగారు పంటలు పండుతాయని ఆశపడుతున్నారు. ఇదీ పరిస్థితి.. తోటపల్లి ప్రాజెక్టు జిల్లాలోనే ఏకైక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దాదాపు 1.29 లక్షల ఎకరాలకు సాగునీరందాలి. ప్రస్తుతం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 85 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుకు చివరి విడతలో పనులు చేసి తాము ప్రారంభించినట్టు చెప్పుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మితడి పనులతో మమ అనిపించింది. పార్వతీపురం నుంచి బొబ్బి లి, తెర్లాం, బాడంగి మీదుగా చీపురుపల్లి నియోజకవర్గానికి కాలువ వెళ్తున్నా రైతాం గానికి సాగునీరందడం లేదు. పిల్ల కాలువలు లేకపోవడమే దీనికి కారణం. కళ్లముందే సాగునీరు వెళ్తున్నా మోటార్లు పెట్టే అవకా శం కూడా లేదు. ఎందుకంటే ఆ హక్కు లేద నీ, ఎవరయినా మోటార్లు పెడితే స్వాధీనం చేసుకుంటామని గతేడాది రైతులను అధికారులు హెచ్చరించడంతో ఇప్పుడు రైతులు కాలువ వంకే చూడడం మానేశారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం తోటపల్లి ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభించేందుకు చేసిన గత ప్రభుత్వ తీరు వల్ల భూ సేకరణ కూడా పూర్తిగా చేయలేదు. దీం తో బొబ్బిలి, బాడంగి, తెర్లాం ప్రాంతాల్లో చాలాచోట్ల పిల్ల కాలువలు లేవు. దాదాపు 24 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. మరోవైపు చీపురుపల్లి ప్రాంతంలో కాలువలున్నా చివరి ఆయకట్టు భూములైనందున సాగునీరు అందడం లేదు. కాలువ పరిధిలో లైనింగ్ లేకపోవడం, కాలువల్లో తుప్పలు పెరగడంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. 483 ఎకరాల భూ సేకరణకు చర్యలు తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా 483 ఎకరాల భూమిని సేకరించాలి. ఇది కేవలం పిల్ల కాలువలకు మాత్రమే. పిల్ల కాలువ ల కోసం 13వ భూసేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని రెవెన్యూ అధికారుల తరఫున ఆదేశాలుండగా ఇరిగేషన్ అధికారుల నుంచి దీనికి సంబంధించిన నివేదిక మాత్రం నేటికీ ఇవ్వడం లేదని అంటున్నారు. దీనిపై ఇప్పుడు సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, ఇరిగేషన్ అధికారుల మ ధ్య ఇటీవల జరిగిన సమావేశాల్లో చర్చించా రు. భూ సేకరణతో పాటు కాలువల లైనింగ్, పిల్ల కాలువల నిర్మాణం, ఆర్ఆర్ ప్యాకేజీలకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి బొత్స ఇటీవల బహిరంగ సభలో తెలిపారు. ఇందులో భాగంగా పర్యావరణ, కాలుష్య నియంత్రణమండలి అధికారుల నుంచి అను మతులు తీసుకునే పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సన్నాహాలు ఆరంభించారు. -
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి : దేశంలో ఆంధ్రప్రదేశ్ను రోల్మోడల్గా నిలపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రితో పాటు 13 జిల్లాల స్టేక్ హోల్డర్స్, క్రెడాయ్ బిల్డర్స్ అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో అయితే సిమెంట్, స్టీలు వినియోగం ఎక్కువగా జరుగుతుందో.. ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని అర్థం అన్నారు. అందరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని, మధ్య తరగతి, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. అందరి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళతామని పేర్కొన్నారు. లేఅవుట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. అలాగే నిర్మాణ అనుమతులు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతోందని, బిల్డింగ్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న బిల్డర్స్ భావన సహజమే.. అయితే ప్రభుత్వ ఆదాయం కోసం ఫీజులు పెంచడం లేదని మంత్రి వివరించారు. బీపీయస్ను అలవాటుగా చేయబోమని, వాటిపై ఇక ఎలాంటి ప్లాన్స్ ఉండవని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అనుమతులు లేని లే అవుట్స్ ఉన్నాయని, ఆన్లైన్ సిస్టంను మరింత మెరుగుపరిచి లోటు పాట్లు సరిచేస్తామన్నారు. ఖాళీ స్థలాలకు సెల్ఫ్ డిక్లరేషన్ కల్పిస్తామని, రేరాలో సభ్యత్వం పరిశీలన చేస్తామని వచ్చే ఏప్రిల్ కల్లా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. ఇందుకోసం స్టేక్ హోల్డర్స్ తమ సలహాలను, సూచనలను ఇచ్చి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరారు. అలాగే పొరుగు రాష్ట్రాల్లో నిబంధనలను పరిగణనలోకి తీసుకుని.. ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసి ఆ నిబంధనలు అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేక్ హోల్డర్స్ 25 విషయాలను తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ప్రభుత్వం కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. కాగా ఇసుక సమస్య కొంత ఇబ్బందిని కలిగిస్తోందని, వర్షాల వలన కూడా కొంత ఇబ్బంది కలుగుతోందని.. ఇసుక విధాన ఫలాలు భవిష్యత్తుకు దోహదపడతాయని మంత్రి వివరించారు. చంద్రబాబు ఆలోచన ధోరణి మారాలి సచివాలయ ఉద్యోగాలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నీచమని విమర్శించారు. లక్ష మందికి ఉద్యోగ అవకాశలు కల్పిస్తే ఓర్వలేక విమర్శలు చేయడం సరికాదని, చంద్రబాబు వ్యాఖ్యలు వింటుంటే అసహ్యం వేస్తోందని మండిపడ్డారు. 4 నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తుంటే చంద్రబాబు విమర్శలు చేయటం దారుణమన్నారు. అలాగే చంద్రబాబుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్స్ని ఖండిస్తున్నామని.. వాటిపై పోలీసులు వారి పని వారు చేస్తున్నారని తెలిపారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని తెలిపారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన పనులు అందరు చూశారు.. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్లను తాము ప్రోత్సహించడం లేదని, నీవు నేర్పిన విద్య వలనే నీకే తిప్పలు వచ్చాయని.. ఇకనైనా చంద్రబాబు ఆలోచన ధోరణి మార్చుకోవాలని బొత్స హితవు పలికారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement