-
అధికారులతో కలిసి రిజర్వాయర్ లో సీఎం వైఎస్ జగన్ బోటింగ్
-
ప్రపంచంలోనే మొట్టమొదటిది.. ‘రేస్ బర్డ్’కు ఎన్నెన్నో విశేషాలు
ఇప్పుడు అన్ని వాహనాలు ఎలక్ట్రిక్మయం అయిపోతున్నాయ్. బైక్లు, కార్లు మొదలుకొని బస్సుల దాకా అన్ని వాహనాలు కరెంటుతో నడుస్తున్నాయ్. ఇదే కోవలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రేసింగ్బోట్ సిద్ధం కాబోతోంది. దాని విశేషాలేంటో చూద్దాం... –సాక్షి, సెంట్రల్ డెస్క్ ఎలక్రిక్ రేసింగ్ బోట్ ‘రేస్బర్డ్’ ప్రొటోటైప్ మొదటి టెస్ట్రన్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇది ఇటీవల ఉత్తర ఇటలీలోని సాన్ నజారో సమీపంలోని ‘పో’ అనే నదిపై దూసుకుపోయింది. మాజీ పవర్బోట్ చాంపియన్ లూకా ఫెరారీ ఈ బోట్ను నడిపారు. వచ్చే ఏడాది మొదటిసారి జరగనున్న ఎలక్ట్రిక్ రేస్బోట్ చాంపియన్షిప్లో ‘ఈ1’ అనే ఈ రేస్బర్డ్ పాల్గొననుంది. జలాలపై విద్యుత్ విప్లవం ‘రేస్బర్డ్ ఎగిరింది. మాకు చాలా సంతోషంగా ఉంది’ అని టెస్ట్రన్ తర్వాత ఈ1 సిరీస్ ట్విట్టర్లో ప్రకటించింది. విద్యుత్ విప్లవం అధికారికంగా జలాలను తాకిందని గర్వంగా తెలిపింది. పో నదిపై టెస్ట్రన్ నిర్వహించినప్పుడు ఇంజనీర్లు పలు సాంకేతిక పరీక్షలు చేసి రేస్బర్డ్ సామర్థ్యాన్ని పరీక్షించారు. త్వరలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షిస్తామని కంపెనీ బృందం తెలిపింది. మరికొన్ని వారాలపాటు దీన్ని అన్నిరకాలుగా పరీక్షించనున్నట్లు పేర్కొంది. అలల నుంచి 16 అంగుళాలు పైకి... ఈ రేస్బర్డ్ ఆలోచన నార్వేకు చెందిన సోఫి హోర్న్ అనే డిజైనర్ మది నుంచి పుట్టింది. హైడ్రోఫాయిల్ సాంకేతికతో రూపొందించిన ఈ పడవ నీటి అలల నుంచి 16 అంగుళాల ఎత్తువరకు ఎగరగలదు. ఆ సమయంలో నీటిపై కంటే కూడా ఎక్కువ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగిఉంటుంది. రేస్బర్డ్ కోసం అభిమానులు ఇక ఎంతో కాలం వేచిచూడాల్సిన అవసరంలేదని కంపెనీ తెలిపింది. త్వరలోనే దీన్ని ప్రదర్శనకు పెడతామని, ఆ తేదీలను కూడా ప్రకటిస్తామని చెప్పింది. రేస్ బర్డ్ విశేషాలు పొడవు 23 అడుగులు వెడల్పు 6.5 అడుగులు బరువు 800 కిలోలు బ్యాటరీ 150 కిలోవాట్ సామర్థ్యం గరిష్ట వేగం 50 నాటికల్ మైళ్లు (గంటకు 93 కిలోమీటర్లు) -
వైరల్ వీడియో: తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువకులు
-
Viral: చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చివరికి ట్విస్ట్ ఏంటంటే?
నైరోబి: ఆ ముగ్గురు స్నేహితులకు అక్కడికి వెళితే ప్రాణం పోతుందని తెలుసు. అయినా వెళ్లారు. చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తృటిలో తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే.. కెన్యాలో విక్టోరియా సరస్సు ఉంది. ఆ సరస్సులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి. పొరపాటున సరస్సులో ప్రయాణిస్తుండగా వాటి కంటపడితే కనికరం లేకుండా వేటాడి ప్రాణాలు తీస్తాయి. అయితే డికెన్ ముచెనా అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి విక్టోరియా సరస్సులో నీటి ఏనుగుల్ని వీక్షించేందుకు వెళ్లారు. వెళ్లేముందు సరస్సులోని హిప్పోపొటామస్(నీటి ఏనుగులు) గురించి తెలుసుకున్నారు. సరస్సులోకి దిగిన ఆ ముగ్గరికి నీటి ఏనుగులు కనిపించలేదు. దీంతో వాటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అంతలోనే ఓ నీటి ఏనుగు స్పీడ్ బోట్లో ప్రయాణిస్తున్న యువకులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నీటిలో మునిగి మెరుపు వేగంతో దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఆ యువకులు స్పీడ్ బోట్ వేగాన్ని పెంచడంతో తృటిలో ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. ఈ ఘటన అనంతరం డికెన్ మాట్లాడుతూ.. నీటి ఏనుగుల గురించి, అవి తలపెట్టే ప్రమాదం తెలుసుకున్నాం. వాటిని చూసేందుకు స్పీడ్ బోట్ లో ప్రయాణించాం. కానీ అవి మాకు ఎక్కడా కనిపించలేదు. సరస్సులో మరికొంత దూరం వెళ్లాం. అదే సమయంలో ఓ నీటి ఏనుగు మాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దేవుడి దయవల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాం. చెప్పాలంటే చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లైందని తెలిపాడు. ఇక, ఈ ఘటన జరిగే సమయంలో డికెన్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి : చిప్ దొబ్బినట్లుంది, పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకాడు -
ఎఫ్1హెచ్2వో బోట్ రేస్ విజేత షాన్ టొరెంటే
సాక్షి, అమరావతి: ఎఫ్1హెచ్2వో బోట్ రేస్లో అబుదాబి టీంకు చెందిన షాన్ టొరెంటే విజేతగా నిలిచాడు. ఆదివారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కృష్ణా నదిలో ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో టొరెంటే మొదటి స్థానం సాధించగా.. ఎమిరేట్స్ టీంకు చెందిన మహిళా డ్రైవర్ స్ట్రోమా మారియట్ రెండో స్థానంలోనూ, అబుదాబి డ్రైవర్ ఎరిక్ స్టార్క్ మూడో స్థానంలోనూ నిలిచారు. అమరావతి తరఫున బరిలోకి దిగిన డ్రైవర్ జోనస్ అండర్సన్ మొదట్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. బోట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మధ్యలోనే వైదొలిగాడు. అలాగే 44 ల్యాప్లు పూర్తి చేయాల్సిన తుది పోరులో అమరావతి టీంకే చెందిన రెండో డ్రైవర్ ఎరిక్ ఎడిన్ 43 ల్యాప్లే పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఏడు దశల్లో జరిగే ఈ ఎఫ్1హెచ్2వో తదుపరి బోట్ రేస్ దుబాయ్లో జరగనుంది. కాగా, ఫార్ములా–4 రేస్లో శ్యామ్ విఠేల్ మొదట స్థానంలోనూ, జెఫ్ బెంజిమెన్ రెండో స్థానంలోనూ, అహ్మద్ అల్ ఫాహిమ్ మూడో స్థానంలోనూ నిలిచారు. ఏటా నిర్వహిస్తాం.. పోటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇకపై ఏటా ఎఫ్1హెచ్2వో రేస్లు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నవంబర్ 15, 16, 17 తేదీల్లో ఈ పోటీలు రాష్ట్రంలో జరుగుతాయన్నారు. ఈ రేస్ల వల్ల రాష్ట్రం పర్యాటక స్థలంగా గుర్తింపు సాధిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెలలో ఎయిర్ఫోర్స్ ఈవెంట్ జరుగుతుందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు వాటర్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు సీఎం చంద్రబాబు ట్రోఫీలు అందజేశారు. అలాగే అబుదాబి టీం మేనేజర్ కాప్ లీ డింగ్, ఎఫ్1హెచ్2వో ఉపాధ్యక్షుడు లుకిమినా కపిలిసినోని, కలెక్టర్ బి.లక్ష్మికాంతం, పర్యాటక శాఖ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, హిమాన్షు శుక్లాను సీఎం సత్కరించారు. హెచ్2వో రేసింగ్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత రాష్ట్రంలోని యువతకు బోట్ రేసింగ్లో శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, అఖిల ప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement