-
పార్థసారథికి పచ్చ పోటు!
శ్రీ సత్యసాయి: టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొంత పార్టీ నేతలే ఆయనకు మద్దతు పలకడం లేదు. ఇప్పటికే పెనుకొండలో తిరుగుబాటు చేసిన సవితమ్మ పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ సారి టికెట్ తనదేనంటూ హడావుడి చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీకే పార్థసారథి ఒంటరిగా మిగిలిపోయారు. కానీ పట్టునిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ‘జయహో బీసీ’ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించాలని, తద్వారా పెనుకొండలో తనపట్టు చూపాలని భావించారు. అయితే బుధవారం గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యక్రమానికి టీడీపీ బీసీ నేతలు చాలా మంది దూరంగా ఉన్నారు. ముఖ్యనేతలైన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మతో పాటు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాలకు చెందిన బీసీ నాయకులు చాలా మంది గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు తెరపైకి వచ్చినట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా, పెనుకొండ ఎమ్మెల్యేగా పార్థసారథి, హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉండేవారు. అప్పుడే వారి మధ్య వర్గ విభేదాలు పొడచూపాయి. అప్పట్లో పార్టీ కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లోనూ ఇరువురు నేతలు ఎడముఖం, పెడముఖంగా ఉండేవారు. దీంతో పార్టీ కేడర్ కూడా రెండుగా చీలిపోయింది. ఆధిపత్య ధోరణిలో ఒక వర్గం, మరోవర్గంపై దాడులకు సైతం తెగబడింది. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతుండగా, ఇక పెనుకొండలో టీడీపీ గెలవడం కలేనని బుధవారం జరిగిన జయహో బీసీ సభలో కార్యకర్తలు చర్చించుకున్నారు. -
అలక వీడని ఈరన్న.. రంగంలో దిగిన బీకే, పరిటాల సునీత
మడకశిర: నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తార స్థాయికి చేరుకుంది. టీడీపీలో దళితులకు గౌరవం లేదంటూ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ ఇన్చార్జ్ ఈరన్న అలకబూనారు. ఈ క్రమంలో బుధవారం మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు దూరంగా ఉండాలని ఈరన్న వర్గం మొత్తం నిర్ణయించుకుంది. రంగంలో దిగిన బీకే, పరిటాల సునీత అలకబూనిన ఈరన్నను బుజ్జగించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, రంగంలో దిగారు. రొద్దం మండలంలోని తన స్వగ్రామం మరువపల్లికి ఈరన్నను పిలిపించుకుని చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల విజయవంతానికి సహకరించాలని కోరినట్లు తెలిసింది. టీడీపీలో దళితులకు సరైన గౌరవం దక్కడం లేదని ఈరన్న ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానికంగా ఉన్న తనకే ఆహ్వానం లేనప్పుడు తానెందుకు హాజరు కావాలని ప్రశ్నించడంతో బీకే స్వీయరక్షణలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత సైతం ఈరన్నకు ఫోన్ చేసి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆమెతో తన మనసులోని మాటను ఆయన నిర్మోహమాటంగా చెప్పినట్లు సమాచారం. బీకే తీరుపై ఈరన్న వర్గం గుర్రు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీకే పార్థసారిథి వ్యవహరిస్తున్న తీరుపై ఈరన్న వర్గం గుర్రుగా ఉంది. ఆయన ఒంటెత్తు పోకడలతోనే మడకశిరలో టీడీపీకి ఈ గతి పట్టిందని బహిరంగంగానే ఈరన్న వర్గం మండి పడుతోంది. ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ మరో వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నాడని ఈరన్న వర్గీయులు ఆరోపిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడినవారిని కాదని, వలస వచ్చిన నాయకుడికి అందలం ఎక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అగ్రకులాలు, డబ్బున్న వారికే విలువ నిస్తున్నారని వాపోతున్నారు. ఈ క్రమంలో బీకే వైఖరిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నాడని నియోజకవర్గాల వారీగా ఇప్పటికే అధిష్టానానికి నివేదికలు అందడమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. ఈరన్నతో కలసి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడంతో ఈరన్నను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. -
ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోంది. అర్హతే ప్రామాణికంగా ఫలాలు ఇంటి ముందు వచ్చివాలుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో గ్రామాల స్వరూపమే మారిపోతోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ సర్కారుతో కనెక్ట్ అయిపోయారు. ప్రతిపక్షాల ఊసే మర్చిపోతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే జిల్లాలో టీడీపీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైన టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఈ విషయం బోధపడినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు నాయకులతో సమావేశమై బుజ్జగింపు పర్వాలు మొదలుపెట్టినా.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సాక్షి, పుట్టపర్తి: ఏ ముహూర్తాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ లేదు.. బొక్కా లేదు అని అన్నాడో తెలియదు కానీ నిజంగానే ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. కుదేలైన సైకిల్కు ఎన్ని మరమ్మతులు చేసినా ప్రయోజనం కానరావడం లేదు. జిల్లా టీడీపీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కేవలం ఉనికి కాపాడుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ రాని పక్షంలో అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకుంటామని కొందరు నేతలు ఇప్పటికే సిద్ధమయ్యారు. పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు, హిందూపురం, కదిరి నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. ‘పోటీ చేసేది నేనే’ అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం నుంచి బాలకృష్ణ, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్, రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నట్లు ఎవరికి వారు చెప్పుకొంటున్నారు. కానీ ఇందులో ఏ ఒక్కరికి కూడా టికెట్ గ్యారెంటీ లేదు. ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. పెనుకొండలో సవితమ్మ, నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి టికెట్ రేసులో ఉన్నారు. పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి, కదిరి నుంచి అత్తార్ చాంద్బాషా, కందికుంట వెంకట ప్రసాద్, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్తో పాటు బీజేపీ నేత వరదాపురం సూరి, పొత్తు కుదిరితే జనసేన నుంచి చిలకం మధుసూదన్రెడ్డి కూడా పోటీలో ఉండనున్నట్లు తెలిసింది. రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తారా? లేక తనయుడిని బరిలో దింపుతారా? అనేది తెలీదు. ధర్మవరం టికెట్ రాకుంటే రాజీనామా చేస్తానని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సీనియర్ వర్సెస్ జూనియర్స్ చందంగా టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ఒకరితో ఒకరి పోరుతో జిల్లాలో చాలా మంది కీలక టీడీపీ నేతల రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొందరు కనుమరుగు కాగా.. మరికొందరు అదేబాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా.. నేతల వేరుకుంపట్లతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా తలోబాట పట్టినట్లు తెలుస్తోంది. -
సైకిల్లో అనంత ఘోష.. కిష్టప్పతో ఆయనకు కష్టమేనా? తారాస్థాయికి టికెట్ పంచాయితీ!
పార్టీ పాతాళంలో ఉన్నా.. నాయకుల మధ్య ఫైటింగ్ మాత్రం తప్పడంలేదట పచ్చ పార్టీలో. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు శత్రువుకు శత్రువు.. తనకు మిత్రుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ తనకు ఇవ్వకపోతే తన మనిషికైనా ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీలోని శత్రువుకు మాత్రం ఇవ్వవద్దని గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ ఆ శత్రువులు, మిత్రులు ఎవరో చూద్దాం. సారథికి సొంత పార్టీనుంచే వెన్నుపోటు ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా, హిందూపురం ఎంపీగా, పెనుకొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బీకే పార్థసారథికి సొంతపార్టీ నేతలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురు, కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవిత ఇప్పుడు బీకే పార్థసారథికి చుక్కలు చూపిస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తనకే టిక్కెట్ ఇస్తున్నట్లు ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. తమ్ముళ్ల కళ్లలో టిక్కెట్ల ఆనందం మరోవైపు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా చాలాకాలంగా పెనుకొండ నియోజకవర్గంపై కన్నేశారు. ఆయన సొంత ఊరు గోరంట్ల పెనుకొండ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో తనకు ఎంపీ టిక్కెట్ వద్దు. పెనుకొండ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని నిమ్మల కిష్టప్ప పార్టీ అధినేతను కోరారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో సవితకు మద్దతు ఇవ్వాలని తాజాగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో బీకే పార్థసారథి తనను ఏ మాత్రం పట్టించుకోలేదని. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకుండా అవమానించినందున పార్థసారథికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ శ్రేణులతో స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో టీడీపీ మహిళా నేత సవిత దూకుడుగా ముందుకెళ్తున్నారు. పార్థసారథికి పోటీగా పెనుకొండలో ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా మద్దతు ఇస్తున్నందున ఖచ్చితంగా తనకే టిక్కెట్ వస్తుందని ఆమె చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలపై బీకే పార్థసారథి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేనే గొప్ప.. నాకే కావాలి గత పాతికేళ్లుగా టీడీపీలో ఉంటూ అనేక పదవులు అనుభవించానని ఇప్పుడు కూడా శ్రీసత్యసాయి జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ పెనుకొండ ఇంఛార్జి బాధ్యతలు చూస్తున్న తనకే అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని బీకే పార్థసారథి భావిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నందున తన అనుమతితోనే ఎవరైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ తనకు వ్యతిరేకంగా సవిత, నిమ్మలకిష్టప్ప గ్రూపులు పనిచేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు పెనుకొండ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి
సాక్షి, అనంతపురం జిల్లా: రూ. కోట్లు ఉంటేనే టీడీపీ టికెట్ వస్తుందంటూ శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి తమ పార్టీ బాగోతాన్ని బయటపెట్టారు. బాగా డబ్బు సంపాదించి రాజకీయాల్లోకి రావాలని, ఉత్తి చేతులతో వస్తే ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. శింగనమల నియోజకవర్గం నార్పలలో జరిగిన కురుబ కులస్తుల సమావేశంలో టీడీపీ డబ్బు సిద్ధాంతాన్ని బీకే పార్థసారథి బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బూతుల మోతాదు పెంచిన చంద్రబాబు.. పీక్స్లో ఫ్రస్టేషన్!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement