-
సర్కారు బకాయి రూ.152 కోట్లు
ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీపై మరో పిడుగు పడింది. రైస్మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.152 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిధులు లేమి సాకుతో ఏడాది కాలం జాప్యం చేసిన ప్రభుత్వం ఇకనైనా బకాయిలు విడుదల చేయాలని మిల్లర్లు కోరుతున్నారు. ఆకివీడు : రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లులకు ప్రధాన పరిశ్రమగా ఉంది. పశ్చిమలో గత ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 26.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంను మరాడించగా సుమారు 12.10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చింది. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించిన మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఏడాది కాలంగా ప్రభుత్వం వద్దే ఉంచుకోవడంతో పరిశ్రమ ఒడుదుడుకులు ఎదుర్కోవడంతోపాటు, దాని ప్రభావం అనుబంధ రంగాలు, రైతులపై పడుతోంది. రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీపై ఆర్థిక భారం పడింది. ఏడాది కాలంగా మిల్లర్లు ధాన్యాన్ని మరాడించినందుకు అయ్యే విద్యుత్ చార్జీలు, పెరిగిన కార్మికుల జీతాలు, పరిశ్రమలోని ఇతర ఉద్యోగుల జీతాలు, పీఎఫ్, ఇతరత్రా ఖర్చులు భరాయిస్తూ ప్రభుత్వానికి సీఎమ్మార్ బియ్యం చెల్లిస్తున్నారు. జిల్లాలో రైస్ మిల్లులు : 375 మిల్లర్లకు ప్రభుత్వ బకాయి : రూ. 152 కోట్లు గత ఖరీఫ్, రబీలో దిగుబడి : 26.70 లక్షల మె.ట సీఎమ్మార్ బియ్యం : 12.10 లక్షల మె.ట. క్వింటాలుకు ఇస్తున్నది రూ.12.50 మాత్రమే క్వింటాలు ధాన్యం మరాడించేందుకు ప్రభుత్వం రూ.15 మజూరు చార్జి ప్రకటించగా, బిల్లు చెల్లించే సరికి రూ. 12.50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారని, మిగిలిన రూ.2.50 పైసలు ధాన్యం కిరాయిల కింద మినహాయించడం సరైన పద్ధతి కాదంటున్నారు. క్వింటాలు ధాన్యం మరాడించేందుకు విద్యుత్ చార్జి రూ.30 వ్యయమవుతోందని మిల్లర్లు వాపోతున్నారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ము విద్యుత్ చార్జీలకు సరిపోవడంలేదని, ఇతరత్రా ఖర్చులతో కలిపి మొత్తం రూ.50 అవుతున్నప్పటికీ, అసలు చెల్లించాల్సిన చార్జీలు చెల్లించకపోవడంతో మిల్లులు ఎలా నడపాలని మిల్లర్లు వాపోతున్నారు. తేమ శాతంలో కూడా దగా జరుగుతోందని ప్రభుత్వం ధాన్యంలో తేమ 17 ఉండాల్సి ఉండగా అంతకు మించిన తేమతో కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వస్తుందని మిల్లర్లు చెబుతున్నారు. 3 శాతం తేమ ఉండగా ఒక శాతం తరుగు మాత్రమే చెల్లించడం దారుణమంటున్నారు. నెలల తరబడి మిల్లుల వద్దే నిల్వలు ధాన్యాన్ని ఆరబెట్టి, నెట్లు కట్టి, నిల్వ ఉంచి మరాడించగా వచ్చే బియ్యాన్ని 15 రోజుల్లో ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. అయితే నెలల తరబడి బియ్యం మిల్లర్ల వద్దే నిల్వ ఉంటున్నాయి. గోదాములు ఖాళీ లేకపోవడంతో మిల్లుల వద్దే నిల్వ ఉంచడం వల్ల కూలీలకు అదనంగా రెండు, మూడు పర్యాయాలు కూలి చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ధాన్యం, బియ్యం ఎగుమతులు, దిగుమతులు, రవాణా చార్జీలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా నేటికీ చెల్లించలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ వచ్చే ఖరీఫ్ సీజన్లో మిల్లింగ్ వ్యవస్థ ఏవిధంగా పని చేస్తుందోనని, ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, బిల్లులు ఏవిధంగా వస్తాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైస్మిల్లర్ల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నిధులు లేవని కరాఖండీగా చెప్పడంతో మిల్లర్లు అయోమయంలో పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ విధానం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్ల వద్ద మరాడించి, బియ్యాన్ని తిరిగి తీసుకోవడాన్ని కస్టమ్ రైస్ మిల్లింగ్ (సీఎమ్మార్) విధానంగా ప్రభుత్వం నామకరణం చేసింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కస్టమ్ మిల్లింగ్ విధానం కొనసాగుతోంది. భారత ఆహార సంస్థ ద్వారా గతంలో బియ్యం సేకరించి రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయ్ ద్వారా రేషన్ షాపులకు సరఫరా చేస్తుండేది. రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి 70 శాతం ఎఫ్సీఐకి, 30 శాతం ప్రైవేటు మార్కెట్లో అమ్ముకునే విధంగా కేంద్రం అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి మిల్లర్లకు మరాడించే పద్ధతిని అమలులోకి తీసుకువచ్చింది. కస్టమ్ చార్జీలు కస్టమ్ రైస్మిల్లింగ్ విధానంలో ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం మరాడించేందుకు, ఆరుదలలో తరుగు ధాన్యానికి, తేమ శాతంకు, ధాన్యం, బియ్యం నిల్వ ఉంచినందుకు, వాటì ని ఎగుమతి, దిగుమతి చేసినందుకు చార్జీలు చెల్లిస్తుంది. ఆయా చార్జీల నిమిత్తం గత ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలోని మిల్లర్లకు రూ.152 కోట్ల మేర బకాయి పడింది. పౌర సరఫరాకు వినియోగం కస్టమ్ రైస్ మిల్లింగ్ ద్వారా వచ్చే బియ్యాన్ని జిల్లాలోని 12,26,123 మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 18,484.610 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఆయా ఎఫ్సీఐ, స్టేట్ వేర్ హౌసింగ్స్, ప్రైవేటు గోదాములలో బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నారు. జిల్లాలో అధికంగా పండిన బియ్యాన్ని ఇతర జిల్లాలకు సరఫరా చేయకపోవడంతో ఆయా గోదాముల్లో ఖాళీలు ఏర్పడటంలేదు. దీంతో మిల్లర్లకు గోదాముల సమస్య ఏర్పడింది. ఆర్థిక ఇబ్బంది నష్టమే జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయి సకాలంలో చెల్లించకపోవడం మిల్లర్లకు తీవ్ర నష్టమే. కస్టమ్ విధానం మంచిదే అయినప్పటికీ బిల్లుల బకాయిలతో మిల్లర్లు, రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోదాముల సౌకర్యం కల్పించి, ఖరీఫ్ సీజన్కు ముందే గత బకాయిలు చెల్లించాలి. – గొంట్లా సత్యనారాయణ, కార్యదర్శి, రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆకివీడు బకాయిల చెల్లింపునకు తీవ్ర ప్రయత్నాలు రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రికార్డులు ప్రభుత్వానికి నివేదించాము. మిల్లర్లు గత ఖరీఫ్కు 2వేల మెట్రిక్ టన్నులు, రబీలో 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిలున్నాయి. – పొదిలి వెంకట కొండయ్య, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయీస్ -
కూలీలకు అందని రెక్కలకష్టం
♦ 2 నెలలుగా ‘ఉపాధి’ బిల్లుల పెండింగ్ ♦ అమలు కాని మూడు రోజుల పేమెంట్ ప్రణాళిక ♦ పస్తులుంటున్న కూలీలు ఫలితమివ్వని సర్కారు లక్ష్యం దినాం కూలికి పోవాలె.. మీరు సెప్పినట్టు పనిచేయాలె.. కాని కూలికి మాత్రం నెలల తరబడి ఆగాలె.. గిదేం పనో అర్థమైతలేదు.. రెండు నెలలైంది బిల్లులిచ్చి.. రెక్కల కష్టానికి అప్పుడే పైసలిస్తే బాగుంటది.. చేతిలో చిల్లిగవ్వలేక పస్తులుంటున్నం.. జర మా గురించి పట్టించుకోండయ్యా.. అంటూ ఏ గ్రామానికి వెళ్లినా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను అధికారులను ఇలావేడుకుంటున్నారు. జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : వలసల నివారణకు ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం నీరుగాతోంది. అధికారులు అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నా చేసిన కష్టానికి మాత్రం నిరీక్షించేలా చేస్తున్నారు. ప్రభుత్వం జూలైలో రూ.10 నిధులు విడుదల చేసినా వాటిని పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు నెలలనుంచి చెల్లింపులు పెండింగ్లో ఉండటంతో కూలీలు పస్తులుండాల్సి వస్తోంది. రెండు నెలలుగా పెండింగులో.. జిల్లాలో సుమారు రెండు నెలల నుంచి కూలీ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,767 మంది కూలీలకు రూ.10 కోట్ల డబ్బులు రావాల్సి ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరం జిల్లాలో 68 లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాక 31.45 లక్షల పని దినాలను మాత్రమే కల్పించారు. జూలైలో రూ.14 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇంకా జిల్లాకు రూ.10 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. కూలి డబ్బుల చెల్లింపు క్రమాన్ని పరిశీలిస్తే 42.14 శాతం కల్పించినట్లు లెక్కలు చెబుతున్నాయి. వారం రోజులుగా కూలీలు చేసిన కష్టానికి ఆ వారం చివరి రోజు నుంచి మూడు రోజుల్లో చెల్లిం పు ఆర్డర్ను జనరేట్ చేయాలి. ఈ మేరకు చెల్లింపులు అస్సలు అమలు కావడం లేదు. పనితీరు ఇలా.. జిల్లాలో 21 మండలాలు, 485 గ్రామాలు, 1049 ఆమ్లెట్ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2,49,192 జాబ్కార్డులు ఉన్నాయి. 447 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటిదాక 91,653 కుటుంబాలకు పని కల్పించగా ఇందులో 1,47,725 కూలీలకు పని పొందారు. వీటికి ఇçప్పటిదాక 49.16 శాతం వేతనాలను చెల్లించారు. ఇప్పటి దాక 2,06,159 లక్షల పనులు చేపట్టగా ఇందులో 54187 పనులు నిర్మాణంలో ఉన్నాయి. 1,51, 972 పనులు పూర్తి చేశారు. బడ్జెట్ బాగానే ఉన్నా.. జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి అధికారులు 68 లక్షల పని దినాలతో లేబర్ బడ్జెట్ తయారు చేశారు. జిల్లాలో 2,49,192 బాజ్కార్డులుండగా 10,767 మంది కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. సుమారు రెండునెలల నుంచి 42.14 శాతం మాత్రమే నమోదు కావడంతో క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు లోటుపాట్లున్నట్లు స్పష్టమవుతోంది. ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారుల శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పని చేయని ఈఎంఎంఎస్ కూలీల హాజరు, పనుల నాణ్యతలో పారదర్శకత, సిబ్బందికి పని భారం తగ్గించడం కోసం ప్రభుత్వం ప్రమోగాత్మకంగా జీపీఎస్తో అనుసంధానించి అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ మాస్టర్ మెజర్మెంట్ సిష్టం (ఈఎమ్మెమ్మెఎస్) ఎగతాళికి గురయింది. దీనికోసం ప్రభుత్వం అన్ని స్థాయి ఉద్యోగులకు స్మార్ట్ఫోన్లు ఇచ్చింది. క్షేత్రసహాయకుల, సాంకేతిక సహాయకుల కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏ రోజుకారోజు కూలీల హాజరును ఫీల్డ్ అసిస్టెంట్ వారం మొత్తం చేసిన పనికి సంబంధించి కొలతలను టెక్నికల్ అసిస్టెంబట్ ఫొటోలతో సహాయ ఇంటర్నెట్లో అప్లోడ్ చేయాలి. ఉపగ్రహ ఫొటోలు పని ప్రదేశాల వద్ద నుంచి అప్లోడ్ చేశారా.? లేదా? అనేది ఎక్కడి నుంచి పంపారో తెలిసిపోతుంది. సిబ్బంది అక్రమాలను అరికట్టడమేగాక పనితీరులో మార్పు వస్తుంది. ఈ మాస్టర్ ఎంసీపీలో వెంటనే జరరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కూలీలకు చెల్లింపు సకాలంలో చేతికందుతాయి. నిర్లక్ష్యం వీడని సిబ్బంది కలెక్టర్ రొనాల్డ్రోస్ ఉపాధి పనులను వేగవంతం చేయడానికి తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట సమీక్షలు, క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కనీసం 50 మంది కూలీలకు పని కల్పించాలని ఆదేశించారు. కానీ కనీసం పది మందికి కూడా ఉపాధి లభించడంలేదు. అత్యధిక కూలీలున్న ఈ జిల్లాలోనే పథకం విజయవంతం చేయడానికి అధికార యాంత్రాంగం విఫలమవుతోంది. ఆరు నెలలుగా పనులు అతి తక్కువగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం వంద మందికి పనులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా 20 నుంచి 30 మందికి మించడంలేదు. వారికి నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 17 శాతం మాత్రమే పనులు కల్పించారు. అత్యల్పంగా పని కల్పించిన 116 మంది సిబ్బంది జాబితాను తయారుచేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement