-
సాక్షి డైరెక్టర్ పీవీకే ప్రసాద్ కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ భారతి
-
టీఏఎల్ క్రికెట్ లీగ్ విజేతగా కూల్ క్రూయిర్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ చైర్మన్ కందుకూరి భారతి సాక్షి, అమరావతి: ‘ప్రైమ్ నార్త్’ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) క్రికెట్ ప్రీమియర్ లీగ్లో కూల్ క్రూయిర్స్ జట్టు విజేతగా నిలిచినట్టు టీఏఎల్ చైర్మన్ కందుకూరి భారతి తెలిపారు. ఆదివారం ఇంగ్లాండ్లోని లాంగ్లీ స్లౌ క్రికెట్ క్లబ్ మైదానంలో ఫైనల్స్ నిర్వహించామన్నారు. ద్వితీయ స్థానంలో డీజే వారియర్స్, తృతీయ స్థానంలో వైజాగ్ బ్లూస్ జట్లు గెలుపొందాయని తెలిపారు. ఈ ఏడాది 10 జట్లతో 14 వారాల పాటు 51 మ్యాచ్లతో లీగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఉత్తమ బౌలర్గా వైజాగ్ బ్లూస్కు చెందిన శ్రీధర్(21 వికెట్లు), ఉత్తమ బ్యాట్స్మెన్గా డీజే వారియర్స్కు చెందిన పవన్కుమార్ (274 పరుగులు)నిలిచారన్నారు. తొలిసారిగా మహిళా క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఐటీ ట్రీ వారియర్స్, గెలాక్సీ గర్ల్స్ మధ్య పోటీలో గెలాక్సీ గర్ల్స్ గెలుపొందినట్టు పేర్కొన్నారు. 2008లో లండన్లో టీఏఎల్ క్రికెట్ లీగ్ని ప్రారంభించిందని, 2012లో ప్రీమియర్ లీగ్ ఫార్మాట్గా రూపాంతరం చెందిందన్నారు. యూకేలోని అన్ని తెలుగు కుటుంబాలను కలుపుతూ పెద్ద కమ్యూనిటీ క్రికెట్ లీగ్ అవతరించినట్టు తెలిపారు. టోర్నీ విజయవంతానికి కృషి చేసిన అనితా నోముల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్, అనిల్, కిషోర్లను అభినందించారు. -
‘అక్షర’ భారతికి ఏపీ ప్రభుత్వ సాయం
సాక్షి, అనంతపురం: కూలిపనులు చేసుకుంటూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ సంబంధిత పత్రాలకు సోమవారం ఆమెకు అందజేశారు. అలాగే.. ఆమెకు జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఆఫర్ చేశారు జిల్లా కలెక్టర్ గౌతమి. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో పేదరికాన్ని జయించి మరీ ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసిందామె. డాక్టర్ భారతి సక్సెస్ స్టోరీ ఎంతో మందిని కదిలించింది కూడా. ఈమె డాక్టర్ భారతి.. కష్టాల్ని ఈది గెలుపు తీరాన్ని చేరింది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనినికి చెందిన భారతి.. ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో చదివింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసింది. సాయం ఎప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందని సాకేభారతికి కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో రెండు ఎకరాల పొలం పట్టా అందజేసి.. భారతి విజయంపై సంతోషం వ్యక్తం చేశారామె. భారతి ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన ఆమె ఎందరికో స్పూర్తిగా నిలిచారన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తరఫున భారతికి శింగనమల మండలం సోదనపల్లి గ్రామ పొలం సర్వేనెంబరు 9–12లో వ్యవసాయ యోగ్యమైన రెండు ఎకరాల భూమి భారతికి అందింఆం. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తాం. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అన్నివిధాలుగా అవసరమై ప్రొత్సాహం అందిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, శింగనమల తహసీల్దారు ఈశ్వరమ్మ, సాకేభారతి భర్త శివప్రసాద్, కుమార్తె ప్రసూన, తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెంత ఆలస్యం..?
సాక్షి, న్యూఢిల్లీ: బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేసే ధోరణిలోనే సమాధానాలు చెప్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 లో ఇచ్చిన హామీల్లో భాగంగా పదేళ్లలో బీబీ నగర్ ఎయిమ్స్ను పూర్తి చేసే ప్రక్రియలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణంపై శుక్రవారం లోక్సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి డా.భారతి ప్రవీణ్ పవార్ ముక్తాయింపు సమాధానం ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు వాయిదాలే.. బీబీనగర్ నిర్మాణం పూర్తిపై లోక్సభలో 2020 సెప్టెంబర్ 18న అడిగిన ప్రశ్నకు 2022 సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తామని కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 4న మరొక ప్రశ్నకు సమాధానంగా, 2023 నవంబర్ కల్లా పూర్తి చేస్తామని కేంద్రం గడువు పొడిగించిందని విమర్శించారు. కొన్ని నెలల తర్వాత 2022 జూలై 22న తాను అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో 2025 జనవరిలోగా బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారని ఎంపీ ఉత్తమ్ తెలిపారు. తాజాగా శుక్రవారం లోక్సభలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా టెండర్ ఇచ్చామని, నిర్మాణం మొదలైందని మాత్రమే చెప్పారు కానీ ఎప్పటికల్లా నిర్మాణాన్ని పూర్తి చేస్తామో చెప్పకుండా కేంద్రం తప్పించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బీబీనగర్ ఎయిమ్స్కు మంజూరైన రూ.1,028 కోట్లలో కేవలం రూ.29.28 కోట్లు మాత్రమే కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత జూలైలో ఎయిమ్స్ నిర్మాణానికి టెండర్ గత ఏడాది జూలైలో బీబీనగర్లో ఎయిమ్స్ నిర్మాణానికి టెండర్ పిలిచామని కేంద్ర వైద్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. అనంతరం ఎయిమ్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement