-
ఏపీ, ఒడిశాలలో అపారమైన బాక్సైట్ నిక్షేపాలు
సాక్షి, విశాఖపట్నం: ‘దేశంలో మరెక్కడా లేనన్ని బాక్సైట్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా లలోనే ఉన్నాయి. ఒక్క ఏపీలోనే ఏడాదికి ఐదు మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు వెలికితీసే అవకాశాలున్నాయి. అల్యూమినియం పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ రెండు రాష్ట్రాలు ఎంతో అనువుగా ఉన్నాయని’ ఇంటర్నేషనల్ బాక్సైట్ అల్యూమిన అండ్ అల్యూమినియం సొసైటీ (ఐబాస్) ప్రతినిధులు పలువురు అంతర్జాతీయ అల్యూమినియం ఇండస్ట్రీ నిపుణులు పేర్కొన్నారు. ఐబాస్-2014 మూడవ అంతర్జాతీయ సదస్సును గురువారం విశాఖలో జేఎన్ఎఆర్డీడీసీ (జవహర్లాల్ అల్యూమినా రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్) డెరైక్టర్ అనుపమ అగ్నిహోత్రి ప్రారంభించారు. సదస్సులో వేదాంత రీసోర్సెస్ పిఎల్సీ సీఈఒ టామ్ అల్బెనెసే మాట్లాడుతూ ఇండియాలోని అల్యూమినియం ఇండస్ట్రీస్లో సమీప భవిష్యత్లో లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా ప్రత్యక్షంగా 30వేల మందికి,పరోక్షంగా మరో మూడులక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రానున్న 10-15ఏళ్లలో 20 బిలియన్ నుంచి 25 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం జరుగు తుందన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే పెనుముప్పు వాటిల్లుతుందంటూ తప్పుడు ప్రచారం సాగుతోందని, ఐరన్ఓర్, లాటరైట్ గనుల తవ్వకాలకు ఎదురుకాని వ్యతిరేకత బాక్సైట్ తవ్వకాల విషయంలో ఎందుకు వస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ఐబాస్ అధ్యక్షుడు వినోద్ సూద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన బాక్సైట్నిక్షేలాలు ఇక్కడే ఉన్నాయన్నారు. వీటిని వెలికి తీసి సద్వినియోగం చేయగిలిగితే 2020లో అల్యూమినియం పరిశ్రమలో మనదేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఐబాస్ ఉపాధ్యక్షుడు, అనరాక్ అల్యూమినియం అధ్యక్షులు హరిహరన్ మహాదేవన్ మాట్లాడుతూ రెడ్మడ్,ఈకోలాజికల్ సమస్యలను బూచిగా పరిశ్రమ అభివృద్ధిని అడ్డుకోవడం సమంజసంకాదన్నారు. సరైన రక్షణ చర్యలుతీసుకుంటే ఎలాంటి ముప్పు లేదన్నారు. మైనింగ్ తర్వాత కూడా ఆ ప్రాంతంలో పంటలు పండించుకునేఅవకాశం ఉందన్నారు. గ్రౌండ్ వాటర్ కుముప్పూ వాటిల్లదన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందిన అల్యూమినియం ఇండస్ట్రీ తమ దేశాల్లో జరుగుతున్న తవ్వకాలు, ఉత్పత్తులు, విక్రయాలకు సంబంధించి ప్రత్యేకస్టాల్స్ ఏర్పాటుచేసారు. తొలి సదస్సు చైనాలో జరగ్గా రెండవ సదస్సు కోల్కత్తాలో జరిగింది. విశాఖలో సదస్సులో దేశ విదేశాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం కుట్ర’
అరకులోయ : గిరిజన ప్రాంతంలోని బాక్సైట్ నిక్షేపాల తవ్వకానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. సోమవారం అరకులోయకు వచ్చిన ఆయన స్థానిక గ్రీన్వ్యాలీ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. గతంలో బాక్సైట్ తవ్వకాలకు బీజం వేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. బాక్సైట్ను వెలికితీయడం వల్ల గిరిజనుల మనుగడకు విఘాతం కలుగుతుందన్నారు. మన్యంలో పర్యాటక శాఖ అడుగు పెట్టినప్పుడు ఆయా పంచాయతీలకు వచ్చిన ఆదాయంలో 10 శాతం ఇస్తామని చెప్పి మోసం చేసిం దన్నారు. అదే విధంగా బాక్సైట్ విషయంలో కూడా గిరిజనులను నమ్మించి మోసం చేస్తారని అన్నారు. అందుకే అన్ని మండలాల నుంచి అన్ని పార్టీల మద్దతు కూడగట్టి బాక్సైట్ వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధమవుతామన్నారు. ఇలా ఉం డగా అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు పునరుద్ధరించాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. హుకుంపేటలో మినహా మరే ఇతర మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో మిగిలిన మండలాల వారు అవస్థలు పడుతున్నారన్నారు. సమావేశంలో అరకులోయ ఎంపీపీ కె.అరుణకుమారి, వైఎస్సార్సీపీ నాయకులు శెట్టి అప్పాలు,సమర్డి రఘునాథ్, మాజీ జెడ్పీటీసీ శ్రీరాములు, బాబూరావు, దొన్ను, స్వామి,సత్యనందం,రమేష్, పాండురంగస్వామి, భీమరాజు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం ఏజెన్సీలోనే జరపాలి పాడేరు : ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విశాఖ ఏజెన్సీలో ప్రభుత్వం అధికారికంగా జరపాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆదివాసీ దినోత్సవాన్ని ప్రస్తుత టీ డీపీ ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడం బాధాకరమన్నారు. భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు ఉన్నా వాటిని పాలకులు చిత్తశుద్ధితో ఆమలు చేయకపోవడంతో అన్ని రంగాల్లోను అభివృద్ధికి దూరంగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు సురక్షిత తాగునీరు కరువైందని, విద్య, వైద్య రంగాల్లోను నిర్లక్ష్యం నెలకొందన్నారు. రోడ్లు, రవాణా సౌకర్యాలకు దూరంగానే ఉన్నారని అన్నారు. ఆదివాసీల స్వయంపాలన లక్ష్యంతో ఏర్పడిన పీసా చట్టాన్ని కూడా ఆమలు చేయడం లేదన్నారు. అందువల్ల ఆదివాసీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, విద్యార్థులు, మేథావులను భాగస్వామ్యం చేసే విధంగా ఈ సదస్సును పాడేరు లేదా అరకులోయ ప్రాంతాల్లో నిర్వహించి గిరిజన సంక్షేమంపై చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement