-
అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్
కాణిపాకం: తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ ఆదివారం కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. భన్వర్లాల్కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని భన్వర్లాల్ దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో అధికారులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
అనర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ విజయవాడ : రాష్ట్రంలో ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పోలింగ్ బూత్లు తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి బన్వర్లాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బాబూ.ఏ హైదరాబాద్ నుంచి, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల గుర్తింపు కార్డు జారీలో డూప్లికేషన్, అర్హతలేని మరణించిన, ఇళ్లు మారిన ఓటర్లను గుర్తించి జాబితానుంచి తొలగించడానికి చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇంటి నంబరు, ఇంటిలో ఉండే వ్యక్తుల పేర్లను అనుసంధానం చేస్తూ వాటికి సంబంధించిన పోలింగ్ బూత్ను గుర్తించేలాగా రూట్ మ్యాప్ను రూపొందించాలని చెప్పారు. 2016 ఎలక్ట్రోరల్ ప్రత్యేక సమ్మరి రోల్ను సెప్టెంబర్ 10 నాటికి పూర్తి చేసి అక్టోబర్ 5వ తేదీనాటికి డ్రాఫ్ట్ రోల్ ప్రచురించాలని బన్వర్లాల్ ఆదేశించారు. బీఎల్వో స్థాయిలో ప్రతి సిబ్బందికి వారి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి ఆన్లైన్లో అనుసంధానం చేయాలని, వారికి జరిపే అన్ని రకాలైన చెల్లింపులు ఖాతాలకు జమచేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ జిల్లాలో 1,066 డూప్లికేట్ ఎపిక్ కార్డులు ఎలక్షన్ కమిషన్ గుర్తించిందని, వాటిని బీఎల్వో స్థాయిలో పరిశీలించి తొలగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 2,190 మరణాల వలన 37,730 ఇళ్లు మారడం వల్ల వారి పేర్లను ఓటర్లిస్టు నుంచి తొలగించినట్లు వివరించారు. జిల్లాలో 33,41,069 మంది ఓటర్లు నమోదు కాగా వారిలో పురుషులు 16,59,455, మహిళలు 16,81,361, ఇతరులు 253 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరిలో ఆధార్ సీడింగ్ ప్రక్రియ నిమిత్తం 29,15,374 మందిని గుర్తించి వారిలో 99.23 శాతం మంది వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్-కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ -2 ఒంగోలు శేషయ్య, ఆర్డీవోలు సీహెచ్.రంగయ్య, సాయిబాబా, ఇన్చార్జి డీఆర్వో చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా కౌంటింగ్ ఏర్పాట్లు
కడప అగ్రికల్చర్, న్యూస్లైన్: ఈ నెల 16న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లాల అధికారులు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే దానిపై ఆరా తీశారు. ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు సందర్భంలో చేపట్టే భద్రతా చర్యలను అడిగి తెలుసుకున్నారు. చెల్లింపు వార్తలు, పట్టుబడి న నగదు, మద్యం, ఎంసీఎంసీ కమిటీ ద్వారా జారీ చేసిన నోటీసుల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రతకు పోలీసు బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి 16,300 పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేశామన్నారు. అందులో 14,704 మంది ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలి పారు. జిల్లా ఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా రెండు బెటాలియన్ల సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జేసీ రామారావు, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెం కటేశ్, డీఆర్వో సులోచన, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
బాలయ్య బరిలో ఉన్నాడు.. ‘లెజెండ్’ సినిమాను నిలిపేయండి!
భన్వర్లాల్కు వైఎస్సార్ కాంగ్రెస్ విజ్ఞప్తి హైదరాబాద్: ప్రముఖ నటుడు బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ పడుతున్నందున ఆయన నటించిన చిత్రం లెజెండ్ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో సదరు చిత్రాన్ని నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది. లెజెండ్ చిత్రం టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్న ఆపార్టీ నేతలు చిత్ర ప్రదర్శనను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు శివకుమార్, చల్లా మధుసూదన్రెడ్డి శుక్రవారం ఉప ఎన్నికల అధికారి దేవసేనను కలిసి ఫిర్యాదు చేశారు. -
కేసీఆర్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి
నల్లగొండ కలెక్టర్కు రాష్ర్ట ఎన్నికల సంఘం ఆదేశం హైదరాబాద్: ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ స్పందించారు. నల్లగొండ జిల్లాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో, ఆడియోలతో నివేదికను పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ను భన్వర్లాల్ ఆదేశించారు. దీని ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు భన్వర్లాల్ ఓ నివేదిక పంపించనున్నారు. కాగా, రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలపైనా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి వివరణ కోరామని, అయితే ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని భన్వర్లాల్ బుధవారం తెలిపారు. పార్టీల నుంచి వచ్చే వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement