-
రామాలయం అక్షతల పంపిణీ ప్రారంభం
అయోధ్య: అయోధ్యలోని భవ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే విగ్రహ ప్రతిష్టకు గాను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి అక్షతల పంపిణీని ప్రారంభించినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. బియ్యంతో పసుపు, నెయ్యి కలగలిపిన పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమం మకర సంక్రాంతి వరకు, ఈ నెల 15 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలకు పంపిణీ చేసే అక్షతల ప్యాకెట్పై రామాలయం చిత్రంతోపాటు ఆలయ నిర్మాణం గురించిన వివరాలతో కూడిన కరపత్రం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఆలయాల పరిధిలోని 5 కోట్ల కుటుంబాల ప్రజలకు అక్షతలు అందుతాయని చెప్పారు. -
భూ వివాదంలో ఇద్దరి దారుణ హత్య.. 13 మంది నిందితుల అరెస్టు
రెబ్బెన(ఆసిఫాబాద్): భూవివాదంలో ఇద్దరిని హత్య చేసిన 13 మందిని పట్టుకున్నట్లు సీఐ అల్లం నరేందర్, ఎస్సై భూమేష్ వెల్లడించాడు. వారి వివరాల ప్రకారం... గత సోమవారం జక్కులపెల్లి శివారులోని వ్యవసాయ భూమి విషయంలో మండల బక్కయ్య కుటుంబీలకు, మండల మెంగయ్య కుటుంబీలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత ఆదివారం బక్కయ్య కుటుంబ సభ్యులు అదే భూమిలో పత్తి విత్తనాలు వేశారు. విషయం తెలుసుకున్న మెంగయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం కత్తులు, గొడ్డళ్లు, రాళ్లు, కారంపొడితో భూమి వద్దకు వెళ్లారు. వారి రాకకు గమనించి బక్కయ్య అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వారు వెంట తెచ్చుకున్న కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయగా బక్కయ్య కుమారుడు మండల నర్సయ్యతో పాటు అతడి సోదరి గిరుగుల బక్కక్క అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. మండల ఇందిరా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టి పరారీలోని 13మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన మూడు గొడ్డళ్లు, రెండు కత్తులు, నాలుగు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. మండల మల్లేష్, మండల గణేష్, మండల వెంకటేష్, గిరుగుల భీంరావు, గిరుగుల రాకేష్, మండల రంగక్క, గిరుగుల రజిత, మండల రజిత, మండల రుక్మ, రాటే భూమక్క, రాటే భూడయ్య, గిరుగుల దుర్గక్క, గిరుగుల సౌమ్యలను రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
58 కోట్ల ఫేస్బుక్ ఖాతాలు ఔట్, ఎందుకు?
శాన్ఫ్రాన్సిస్కో: డేటా లీక్ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ ఎత్తున ఫేక్ అకౌంట్లను తొలగించింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ఖాతాలకు చెక్ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 58.3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు తెలిపింది. అంతేకాదు ఫేస్బుక్లో లక్షలాది నకిలీ ఖాతాలను రూపొందించే పయత్నాలను నిరోధిస్తున్నామని వెల్లడించింది. భారీ ఎత్తున డేటా బ్రీచ్ ఆరోపణలతో యూజర్ల గోప్యత ప్రశ్నార్థకంగా మారడంతో తన ఫ్లాట్పాంలో సెక్యూరిటీ అంశాలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా నకిలీ అకౌంట్లను ఏరివేసేందుకు సన్నద్ధమైంది. యూజర్ డేటా దుర్వినియోగం విచారణలో భాగంగా తమ ప్లాట్ఫాంపై దాదాపు 200 యాప్స్ను తొలగించినట్టు ప్రకటించిన ఫేస్బుక్ తాజాగా ఈ చర్య తీసుకోవడం విశేషం 2018 మొదటి మూడునెలల్లో 583 మిలియన్ల నకిలీ ఖాతాలను రద్దు చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. లైంగిక వేధింపులు, హింసాత్మక చిత్రాలు, తీవ్రవాద ప్రచారాలు లేదా ద్వేషపూరిత ప్రసంగం లాంటి కమ్యూనిటీ ప్రమాణాలను దృష్టిలోవుంచుకుని ఆయా ఖాతాలను డిలిట్ చేసినట్టు వెల్లడించింది. దీంతోపాటు 837 మిలియన్ల పోస్టులను తొలగించామని వివరించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా బ్రీచ్ కుంభకోణం తరువాత ఫేస్బుక్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ నకిలీ ఖాతాలను నిరోధిస్తున్నట్టు చెప్పింది. అయినప్పటికీ నకిలీ ప్రొఫైల్స్ బెడద భారీగా ఉందని చెప్పింది. ఇది యాక్టివ్ అకౌంట్లను 3-4 శాతం ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొంది. -
స్నేహితుడిపై గొడ్డలితో దాడి
సూర్యాపేట: పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని స్నేహితుడిపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గా యపరిచిన సంఘటన సోమవారం రాత్రి సూర్యాపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని అన్నాదురైనగర్కు చెందిన బండ్ల శేఖర్(24) సెంట్రింగ్ ప ని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన గువ్వల గిరి శుభకార్యాల్లో టిఫిన్స్ చేసేందుకు వెళ్తుంటాడు. వీరిద్దరూ స్నేహితులు. ఉదయం శేఖర్ పనికి వెళ్తుండగా గువ్వల గిరి కలిశాడు. ఇరువురు పాత గొడవలకు సంబంధించిన కేసు విషయమై మాట్లాడుకున్నారు. గతంలో గిరి తన స్నేహితులతో కలిసి శేఖర్పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ కేసు ఎలాగైనా కొట్టివేయించుకోవాలనే ఉద్దే శంతో శేఖర్ను మందలించాడు. శేఖర్ వినకపోవడంతో సోమవారం రాత్రి గిరి గొడ్డలి తో అతన్ని వెంబడించి దాడి చేశాడు. ఈ ఘటనలో శేఖర్ తల నుంచి మెదడు బయటకు వచ్చింది. బాధితున్ని ఆటోలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. సీఐ మొగలయ్య ఘటన స్థలా న్ని సందర్శించి వివరాలు సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పో లీసులు తెలిపారు. గువ్వల గిరి పరారీలో ఉన్నాడు. -
మాజీ సర్పంచ్పై గొడ్డళ్లతో దాడి
ఈపూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపవారిపల్లి మాజీ సర్పంచ్ కట్ల కోటేశ్వరరావుపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్లతో దాడిచేశారు. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయుకుడు అయిన కోటేశ్వరరావు లక్ష్యంగా సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా గొడ్డళ్లతో దాడి చేశారని, తీవ్రంగా గాయపడ్డ ఆయన్ని చికిత్స నిమిత్తం నర్సరావుపేట ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement