-
మూడో ర్యాంక్లో భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు ర్యాంక్ కూడా మెరుగైంది. ఆదివారం విడుదల చేసిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తాజా ర్యాంకింగ్స్లో భారత జట్టు ఒక స్థానం పురోగతి సాధించి నాలుగు నుంచి మూడో ర్యాంక్కు ఎగబాకింది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఖాతాలో 2771.35 పాయింట్లు ఉన్నాయి. 2021 తర్వాత భారత జట్టు మరోసారి మూడో ర్యాంక్లో నిలిచింది. 2021లో టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తర్వాత భారత జట్టు మూడో ర్యాంక్కు చేరింది. నెదర్లాండ్స్ జట్టు 3095.90 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా, 2917.87 పాయింట్లతో బెల్జియం రెండో ర్యాంక్ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ మూడు నుంచి నాలుగో స్థానానికి చేరగా... జర్మనీ, ఆ్రస్టేలియా వరుసగా ఐదు, ఆరో ర్యాంక్ల్లో ఉన్నాయి. తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా నిలిచిన మలేసియా జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. హాకీ ఇండియా నజరానా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ బృందంలోని ప్రతి సభ్యుడికి రూ. లక్షా 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తారు. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
చెన్నై: ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్ప్రీత్ బృందం జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాకౌట్ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్ ఫేవరెట్ కావడం ఖాయం. గతంలో జపాన్ చేతిలో భారత్కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో టీమిండియా 6–0తో జపాన్ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది. ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి. -
Ind Vs Pak: పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన భారత్
చెన్నై: గత ఏడేళ్లుగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు చేతిలో ఓటమి ఎరుగని భారత హాకీ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్తాన్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ (15వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ (36వ ని.లో), ఆకాశ్దీప్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు రాగా ఇందులో మూడింటిని గోల్స్గా మలి చింది. ఇతర లీగ్ మ్యాచ్ల్లో జపాన్ 2–1తో చైనాపై, మలేసియా 1–0తో కొరియాపై నెగ్గాయి. పాక్పై విజయంతో ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక భారత్ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. 12 పాయింట్లతో మలేసియా రెండో స్థానంలో, 5 పాయింట్లతో దక్షిణ కొరియా, జపాన్, పాకిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో, ఒక పాయింట్తో చైనా చివరి స్థానంలో నిలిచాయి. కొరియా, జపాన్, పాక్ ఐదు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరంతో కొరియా, జపాన్ జట్లకు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. దాంతో మాజీ చాంపియన్ పాకిస్తాన్ సెమీఫైనల్ చేరలేకపోయింది. శుక్రవారం 5–6 స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్లో చైనాతో పాకిస్తాన్...సెమీఫైనల్స్ లో కొరియాతో మలేసియా; జపాన్తో భారత్ ఆడతాయి. -
భారత్ ఘనవిజయం
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు ఖాతాలో రెండో విజయం చేరింది. మలేసియాతో ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సెల్వం కార్తీ (15వ ని.లో), హార్దిక్ సింగ్ (32వ ని.లో), హర్మన్ప్రీత్ సింగ్ (42వ ని.లో), గుర్జంత్ సింగ్ (53వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్కు మొత్తం తొమ్మిది పెనాల్టీ కార్నర్లు రాగా అందులో మూడింటిని సది్వనియోగం చేసుకుంది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. ఆదివారం జరిగిన మిగతా రెండు మ్యాచ్లు ‘డ్రా’ అయ్యాయి. చైనా–కొరియా 1–1తో, పాకిస్తాన్–జపాన్ 3–3తో ‘డ్రా’ చేసుకున్నాయి. -
భారత్, జపాన్ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్ తమ రెండో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం జపాన్తో జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభం నుంచే పట్టుదల కనబరచడంతో మ్యాచ్ ఆఖరిదాకా పోటాపోటీగా సాగింది. రెండో క్వార్టర్ ముగిసే దశలో జపాన్కు లభించిన పెనాల్టీ కార్నర్ను కెన్ నగయొషి (28వ ని.లో) గోల్గా మలచడంతో జపాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడో క్వార్టర్లో భారత్కు లభించిన పెనాల్టీ కార్నర్ను కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా గోల్పోస్ట్లోకి నెట్టాడు. స్కోరు సమం కాగా... ఆఖరి క్వార్టర్లో మరో గోల్ నమోదు కాలేదు. ఇతర మ్యాచ్ల్లో మలేసియా 5–1తో చైనాపై ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, పాకిస్తాన్ల మధ్య జరిగిన పోరు కూడా 1–1తో ‘డ్రా’ అయ్యింది. ఆదివారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్లో భారత్... మలేసియాతో తలపడుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement