-
2025 కల్లా గిగా ఫ్యాక్టరీ: అమర రాజా బ్యాటరీస్
ముంబై: ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ 2025 ఆఖరు కల్లా తమ తొలి గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇలాంటి వాటికి అధునాతన టెక్నాలజీ, భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని సంస్థ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల తెలిపారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) నిర్వహించిన ఇండియా బ్యాటరీ తయారీ, సరఫరా వ్యవస్థ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. తొలి విడత 24 నెలల్లోగానే పూర్తి కాగలదని, దాన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం (2025) ముగిసేలోగా ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని విజయానంద్ పేర్కొన్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో గిగా ఫ్యాక్టరీకి కంపెనీ గతేడాది మేలో శంకుస్థాపన చేసింది. ఈ ప్యాక్టరీలో లిథియం సెల్, బ్యాటరీ ప్యాక్లను తయారు చేయనుంది. -
అమరరాజాకిచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు పాటించలేదంటూ అమరరాజా బ్యాటరీస్కు ఇచ్చిన షోకాజు నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను ఈ మేరకు సవరించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. అమరరాజా తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పదేపదే తనిఖీల పేరిట ఇప్పటివరకు 34 సార్లు నోటీసులు జారీచేశారని చెప్పారు. పిటిషనర్ ప్రతిపక్ష పార్టీ ఎంపీ అని, అందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాల జోలికి వెళ్లొద్దని సూచించింది. తనిఖీలు తప్పేంకాదని, షోకాజు నోటీసులకు స్పందించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఐఐటీ–మద్రాస్ ఇచ్చిన నివేదిక కూడా పట్టించుకోలేదని రోహత్గి తెలిపారు. షోకాజు నోటీసులకు స్పందించామని పేర్కొన్నారు. ఏపీపీసీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నాదకర్ణి వాదనలు వినిపిస్తూ.. షోకాజు నోటీసులకు స్పందించారని, అయితే పదేపదే వాయిదాలు కోరారని, అంతకు మించి ఏమీలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించారనిపిస్తే తొలిసారే చర్యలు తీసుకోవాల్సిందని ధర్మాసనం పేర్కొంది. షోకాజు నోటీసుకు స్పందించడానికి పలుసార్లు సమయం ఇచ్చామని నాదకర్ణి తెలిపారు. ఇలా సమయం అడుగుతూనే సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు స్టే ఇచ్చి తమ చేతులు కట్టేసిందని చెప్పారు. అనంతరం ధర్మాసనం షోకాజు నోటీసులపై తామెలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి చర్యలు తీసుకునే అధికారం అథారిటీకి ఉందని తెలిపింది. ‘షోకాజు నోటీసులపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తదుపరి చర్యలు తీసుకోవచ్చు. అమరరాజా సంస్థ వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలి. ఆ వాదనలపై మండలి నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఆ నిర్ణయాన్ని నాలుగు వారాలపాటు నిలుపుదల చేయాలి. తదుపరి ఏమైనా ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించుకోవడానికి వాదప్రతివాదులకు స్వేచ్ఛనిస్తున్నాం..’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంటూ పిటిషన్పై విచారణను ముగించింది. -
మాకొద్దీ అమరరాజా.. వ్యతిరేకంగా నిరసనలు
-
బ్యాటరీ పరిశ్రమ వద్దేవద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఐటీ, సాఫ్ట్వేర్, అనుబంధ కంపెనీల స్థాపనను స్వాగతిస్తాం గానీ.. బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదు’ అని మహబూబ్నగర్ ప్రజలు తేల్చి చెప్పారు. పట్టణ సమీపంలోని దివిటిపల్లి ఐటీ కారిడార్ మైదానంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ తేజస్ నందూలాల్ పవార్, పీసీబీ ఈఈ సంగీత హాజరుకాగా.. బాధిత గ్రామాలైన దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్ధాయిపల్లి గ్రామస్తులతోపాటు పర్యావరణ, సామాజికవేత్తలు తమ అభిప్రాయాలు చెప్పారు. సందిగ్ధత.. అయినా అంగీకరించం దివిటిపల్లి పారిశ్రామికవాడలో బ్యాటరీ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఈ నెల 2న అమర్రాజా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.9,500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 10వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. అయితే, బ్యాటరీల పరిశ్రమతో జల, వాయు కాలుష్యం వెలువడి.. సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే ఐటీ కారిడార్ పరిధిలోని గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణలో ఆ కంపెనీ పేరు ప్రస్తావించ లేదు. మెకానికల్ బ్యాటరీలు అని గానీ. ఎలక్ట్రానిక్ బ్యాటరీలు అని గానీ స్పష్టత ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ అంశాన్ని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు లేవనెత్తారు. బ్యాటరీ తయారీ కంపెనీతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అక్కడి హైకోర్టు కూడా ఆ పరిశ్రమ వద్దని చెప్పిందని, బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని గ్రామస్తులు నినదించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ వద్దు శ్రీసాయి మానస నేచర్టెక్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన కన్సల్టెంట్ ప్రతిపాదిత ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ప్రాజెక్ట్ను కూడా గ్రామస్తులు వ్యతిరేకించారు. సర్వే నంబర్ 556, 607లో సేకరించిన 377.65 ఎకరాల్లో రూ.568.49 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలు, బ్యాటరీలు, డ్రోన్లు, ఐటీ పార్క్, మొబైల్ఫోన్ల ఉపకరణాలు, చార్జర్లు, డిస్ప్లే, కెమెరాలు తదితరాలను ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించగా వందకు వంద శాతం మంది ఈ క్లస్టర్ ఏర్పాటుపై వ్యతిరేకగళం వినిపించారు. సంతకాల సేకరణ కో సం రిజిస్టర్లో ముందు పేజీలో స్థలం వదిలి సంతకాలు సేకరిస్తుండటంపై పలువురు ప్రశ్నించారు. కాగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన ప్రతీ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఊరు విడిచి వెళ్లాల్సిందే... గతంలో డైయింగ్ ప్లాంట్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ ప్లాంట్ను తొలగించాలని ధర్నాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్పందించి ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వ్యయం కావడంతో కంపెనీ వాళ్లే మూసేసుకున్నారు. ఆ నీరు తాగి పశువులు, చేపలు మృత్యువాత పడ్డాయి. గర్భిణులు, పిల్లలు దీర్ఘకాలిక రోగాలతో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాటరీ పరిశ్రమ పెడితే మళ్లీ అలాంటి దుస్థితే వస్తుంది. అప్పుడు మేమంతా ఊరు విడిచి వెళ్లాల్సిందే. –హన్మంతు, రైతు, ఎదిర, మహబూబ్నగర్ -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 16 గిగావాట్అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్కు లాజిస్టిక్స్పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement