-
గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల బాలిక
జి.మాడుగుల (పాడేరు): ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న మైనార్టీ తెగకు చెందిన బాలిక గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బీసీ (మైనార్టీ) విద్యార్థిని గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. నుర్మతిలో పాఠశాల లేక పోవడంతో ఆ బాలికకు గ్రామస్తుల వినతి మేరకు ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రవేశం కల్పించారు. ఆశ్రమ పాఠశాలకు దగ్గరలో ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగిస్తూ చదువుతోంది. బాలికకు మలేరియా, టైఫాయిడ్ జ్వరం రావటంతో మందులు వాడేందుకు రోజూ ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించడానికి ఆగస్టు 18న తల్లి అనుమతిపత్రం అందించటంతో ఒప్పుకున్నట్టు హెచ్ఎం సింహాచలం తెలిపారు. పాఠశాలకు చదువు నిమిత్తం వస్తున్న బాలిక శరీర ఆకృతిలో తేడా గమనించి పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయంచడంతో గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయ్యిందని పాఠశాల ఏఎన్ఎం చెప్పారు. బాలిక తల్లిదండ్రులను పాఠశాలకు రప్పించి విషయాన్ని తెలియజేయడంతో బాలికను నిలదీయగా అదే గ్రామానికి చెందిన గిరిజన యువకుడితో ప్రేమలో పడినట్టు, అది శారీరక సంబంధానికి దారితీసినట్టు తేలిందని హెచ్ఎం తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలి విచారణ పాఠశాలను మాజీ మంత్రి, మహిళా కమిషన్ సభ్యురాలు మత్స్యరాస మణికుమారి సందర్శించారు. హెచ్ఎం సింహాచలం, డిప్యూటీ వార్డెన్ రాజేశ్వరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు. బాలిక గర్భం దాల్చిన ఘటనపై సోమవారం పాడేరు గిరిజన సంక్షేమ డీడీ విజయ్కుమార్ విచారణ చేపట్టారు. నుర్మతి ఆశ్రమోన్నత పాఠశాలలో విచారణ చేస్తున్న పాడేరు డీడీ విజయ్కుమార్ -
బాధ్యతల బరువు
చింతపల్లి: మన్యం మహిళల జీవనశైలి భిన్నంగా ఉంటుంది. తెల్ల వారు లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఆమె ప్రతి పనిలో భాగస్వామిగా ఉంటూ జీవన పోరాటంలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. గిరిజన మహిళలు ఏ రంగంలో ఉన్నా తమ బాధ్యతలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా, రాజకీయ పదవుల్లో ఉన్నా ఇంటి కుటుంబ బాధ్యతలు మరిచి పోక పోవడమే వారి ప్రత్యేకత. అందుకే మన్యం మహిళలు శ్రమ జీవులుగా మన్ననలు అందుకుంటున్నారు. -
మన్యంపై ఖాకీ పడగ
సాక్షి, విశాఖపట్నం/పెదబయలు : మన్యంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమైనా మన్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అడవి మొత్తం పోలీసుల కవాతులో ప్రతిధ్వనిస్తోంది. ఎన్నడూలేని విధంగా ఈసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఇటు పోలీసులు, అటు గిరిజనులు కంటిమీద కునుకు లేకుండా గుడుపుతున్నారు. మరోవైపు వారోత్సవాల కారణంగా పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. తొలిరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. మన్యమంతా పోలీసు బలగాలే పీఎల్జీఏకి ఒకరోజు ముందు సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ వచ్చి తమ సిబ్బందిని హెచ్చరించడం, మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడవచ్చనే సంకేతాలున్నాయని చెప్పడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఏజెన్సీ ముఖద్వారాల్లో కాపుకాసి వచ్చి, పోయే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు దగ్గర్నుంచి బస్సుల వరకూ దేనినీ వదిలిపెట్టడం లేదు. ప్రయాణికుల సామాగ్రిని క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. అనుమానం వస్తే గుర్తింపు కార్డులు అడిగి వివరాలు సేకరిస్తున్నారు. స్థానికుల అవస్థలు పీఎల్జీఏ జరుగుతున్నప్పుడల్లా ఏజెన్సీలో గిరిజనులు అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఈసారి కూడా అదే కనిపిస్తోంది. ప్రత్యేక బలగాలు అనుమానితుల ఇళ్లను సైతం సోదా చేస్తున్నాయి. గిరిజనులకు సహరిస్తున్నారనే అనుమానం ఉన్న ప్రాంతాలను చుట్టుముట్టాయి. దీంతో గిరిజనులు భయంతో వణికిపోతున్నారు. బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మొదటి రోజే కాబట్టి తిండి తిప్పలకు ఇబ్బంది లేకపోయినా ఇదే విధంగా రాబోయే రోజులు కూడా ఉంటే గిరిజనులు అల్లాడిపోవాల్సిందే. మరోవైపు పాడేరు డిపో నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులను మారుమూల గ్రామాలకు రద్దు చేశారు. జీపులు, ఆటోలను సైతం వెళ్లనివ్వడం లేదు. దీంతో గిరిజనులు కిలోమీటర్ల దూరం కాలినడకనే వెళ్లాల్సి వస్తోంది. కలిసి వస్తున్న వర్షాలు పోలీసులను, స్థానికులను మన్యంలో కురుస్తున్న భారీ వర్షాలు ఇబ్బందులకు గురిచేస్తుంటే మావోయిస్టులకు మాత్రం ఉపయోగపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అక్కడి వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గిరిజన గ్రామాలకు వీటిని దాటి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. దీంతో కూంబింగ్ పార్టీ బలగాలు ఆయా గ్రామాలకు వెళ్లలేకపోగా కనీసం సమాచారం కూడా తెలిసే అవకాశం ఉండటం లేదు. ఇదే అదునుగా మావోయిస్టులు ఆయా గ్రామాల్లో పీఎల్జీఏ వారోత్సవాలను జరిపిస్తున్నారు. ఫోటోరైటప్28ఏఆర్కె83,84.. ఏవోబిలో ముస్తాబైన స్థూపాలు ఏవోబీలో స్థూపాలు ముస్తాబు ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాల్లో మావోల పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా స్థూపాలు అరుణవర్ణంతో ముస్తాబయ్యాయి. ఏవోబీ గ్రామాల్లో కొన్ని చోట్ల కొత్తగా భారీ స్థూపాలు ఏర్పాటు చేశారు. పాత స్థూపాలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే రంగులు వేసి రవి, ఆనంద్, శరత్, ఆజాద్, కమల, గణపతి, అలాగే సఖీల, విజయ్, శ్వేత, జీవన్ పేర్లను స్థూపాల్లో రాసి ఆవిష్కరణకు సిద్ధం చేశారు. వారం రోజుల పాటు జరిగే వారోత్సవాల్లో అమర వీరుల జోహార్లు అర్పించనున్నారు. వారోత్సవాలు ఎలాగైన నిలువరించాలని పోలీసు బలగాలు మోహరించాయి. అలాగే గతంలో కంటే భారీగా జనసమీకరణ చేసి వారోత్సవాలు నిర్వíß ంచాలని మావోలు పట్టుదలతో ఉన్నారు. దీంతో ఏవోబిలో యుద్ధవాతావరణం అలముకుంది. మావోలకు ఎలాంటి సహాకారం అందించరాదని ఇప్పటికే వారం రోజుల నుంచి పోలీసులు మారుమూల ప్రాంతాలకు వెళ్లే వ్యాపారులు, వాహనదారులకు ఆదేశాలు జారీ చేశారు. మావోలకు ఎలాంటి సహాయం అందించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరికల నడుమ సంతలకు వెళ్లడానికి వ్యాపారులు జంకుతున్నారు. చెరువూరులో స్థూపం పీఎల్జీఎ వారోత్సవాల్లో తొలిరోజు మావోయిస్టులు విశాఖ–ఒడిశా సరిహద్దుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఒడిశా సరిహద్దులోని అన్నవరం వద్ద చెరువూరులో అమరవీరుల స్ధూపాన్ని ఆవిష్కరించారు. ఏజెన్సీలోని కొన్ని గ్రామాల్లో రాళ్లు పేర్చి స్థూపాలు నిర్మించడంతో పాటు, పాత వాటికి రంగులు వేశారు. అయితే వాటిని ప్రారంభించలేదు. మారుమూల ప్రాంతాల్లో కరపత్రాలు వెదజల్లారు. మావోయిస్టులు చేస్తున్న అన్ని చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ప్రతి సమాచారం తమ వద్ద ఉందని,పరిస్థితి తమ ఆధీనంలోనే ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఏజెన్సీ గ్రామాలకు వెంటనే విద్యుత్
అల్లిపురం (విశాఖపట్నం): జీకే వీధి మండలం దారకొండ, ఎ.దారకొండ,గాలికొండ, జీకే వీధి, పెదవలస, దేవరాపల్లి, పంచుల, జర్రెల పంచాయితీలలో గల గ్రామాలకు ప్రభుత్వం నిరంతర విద్యుత్ కల్పించాలని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి కె.లోకనాథం, కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, జి.సత్యనారాయణ, ఎ.బుజ్జిబాబు, ఎ.దారకొండ సర్పంచ్ ముర్ల సంధ్యాకుమారి మంగళవారం ఈపీడీసీఎల్ డైరెక్టర్ శేషుకుమార్కు వినతి పత్రం అందజేశారు. ఆయా మండలాల్లో ప్రభుత్వం గత ఏడాది లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ పరికరాల వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని వారు వివరించారు. సోలార్ విద్యుత్ పలకలు ఏర్పాటు చేసి ఏడాది గడవకముందే మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. నాసిరకమైన మెటిరియల్ వాడటంతో సోటార్ విద్యుత్ పరికరాలు మరమ్మతులకు గురయ్యాయన్నారు. కాంట్రాక్టర్ స్పందించడం లేదని తెలిపారు. సోలార్ విద్యుత్కు కావాల్సిన మెటీరియల్ను 20 కిలోమీటర్ల దూరం వరకు కాలినడకతో గ్రామాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రవాణా ఖర్చులు కూడా ఇవ్వకుండా గ్రామస్తుల శ్రమను కాంట్రాక్టరు దోచుకున్నాడని తెలిపారు. శ్రమను దోచుకున్న కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని 50 గ్రామాలకు చెందిన ప్రజలు డైరెక్టర్కు విన్నవించుకున్నారు. ఏజెన్సీలో మంచు, వర్షాకాలం, శీతాకాలం దట్టమైన పొగమంచు కారణంగా చార్జింగ్ లేక పోవటంతో సోలార్ దీపాలు వెలగడం లేదని తక్షణమే ఆయా గ్రామాలకు సీలేరు నుండి శాశ్వత విద్యుత్తును అందించాలని వారు ఈపీడీసీఎల్ డైరెక్టర్ శేషుకుమార్కు వినతిపత్రం అందజేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement