-
పాక్-భారత్ మ్యాచ్లో అనూహ్య పరిణామం
న్యూయార్క్: దాయాది దేశాల మధ్య పోరులో మరోసారి భారత్దే పైచేయి అయ్యింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ అనూహ్య పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంపై ఓ ఎయిర్క్రాఫ్ట్ ఎగిరింది. అది ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంలో కొందరు ఇమ్రాన్ ఖాన్ ఫొటోలతో జిందాబాద్ నినాదాలు చేయడమూ కనిపించింది.A plane with the message "Release Imran Khan" flies over the stadium during the India vs. Pakistan T20 World Cup match. #Imrankhan #T20WC24 #viral #BreakingPedia pic.twitter.com/OHlCuQUFRZ— Breakingpedia (@breakingpediaBP) June 10, 2024 Credits: Breakingpedia VIDEO CREDITS: TOP POSTఅయితే.. పాక్-భారత్ మ్యాచ్కు గట్టి భద్రత ఉంటుందని న్యూయార్క్ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఆ విమానాన్ని స్టేడియం మీద ఎగరడానికి ఎలా అనుమతించారు?. దానిని నడిపిందెవరు?. దీనంతటి వెనుక ఉంది ఎవరు? ఇలాంటి అంశాలపై అక్కడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
వర్కలా బాయ్స్
ఇటీవల ‘ముంజమ్మల్ బాయ్స్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. బిలంలో పడ్డ స్నేహితుణ్ణి బయటకు లాగడం కథ. ఇక్కడ మనం ‘వర్కలా బాయ్స్’ని చూడొచ్చు. కర్నాటక నుంచి కేరళ విహారానికి వచ్చిన ఒక మహిళ వర్కలా బీచ్లో ఫోన్ జారవిడిచింది. అది అక్కడి రాళ్ల కింద చాలా లోతులో పడింది. అసలే అది ఐఫోన్. ఇంకేముంది వర్కలా అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 7 గంటలు శ్రమించాక... ఏమైంది?విహారంలో అపశృతులు దొర్లితే మనసు పాడవుతుంది. కర్నాటక నుంచి కేరళలోని వర్కలాకు విహారానికి వచ్చిన ఒక మహిళ అక్కడి బ్లాక్ బీచ్లో ఉండగా పొరపాటున ఫోన్ జారింది. అది రాళ్ల కట్ట ఉన్న బీచ్. ఫోన్ రాళ్ల సందులో నుంచి లోపలికి పడిపోయింది. లక్షన్నర రూపాయల విలువ చేసే ఐఫోన్. వెంటనే ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది, వర్కలా అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రాళ్లు తొలగించి ఫోన్ తీసే వీలు లేదు. తాడుతో తీగతో బయటకు లాగడం కూడా కష్టమైంది. దానికితోడు బీచ్లో భారీ అలలు, వాన పనికి అంతరాయం కలిగించాయి. దాంతో మరుసటి రోజు ఉదయం వచ్చి సుమారు ఏడు గంటలు కష్టపడి ఆ ఫోన్ని వెలికి తీశారు. అమ్మయ్య. కథ సుఖాంతం అయ్యింది. సుఖాంతం సంతోషమే కదా ఇస్తుంది. మంజుమ్మల్ బాయ్స్లో కూడా కథ సుఖాంతం కావడం వల్లే అది అంత పెద్ద హిట్ అయ్యిందని అనుకోవచ్చా? -
ఎర్రటి ఎండలో చల్లని హృదయం
భయానకమైన ఎండలో పెద్ద ఏసీ మెషిన్తో ఫ్లైఓవర్ దాటడానికి ఆపసో΄ాలు పడుతున్న రిక్షా కార్మికుడిని చూసిన ఒక మహిళ బాధపడింది. అయితే ఆమె బాధ పడి ఊరుకోలేదు. అతడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్లింది. రిక్షాను నెట్టుతూ అతడు ఫ్లై ఓవర్ దాటేలా సహాయపడింది. ఆ తరువాత లంచ్బాక్స్, వాటర్ బాటిల్ అతడికి ఇచ్చింది. తలపై కప్పుకోవడానికి టవల్ కూడా ఇచ్చింది. దారిన ΄ోయేవాళ్లెవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ‘ఎక్స్’లో ΄ోస్ట్ చేశారు. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది.‘ఎక్కడో ఒకచోట కష్టపడుతున్న వ్యక్తుల్ని చూస్తుంటాం. బాధ అనిపిస్తుందిగానీ, నేను మాత్రం ఏం చేయగలను అని సర్దిచెప్పుకుంటాం. అయితే మన వంతుగా వారికి కొద్దో గొ΄్పో సహాయపడగలిగితే అది గొప్ప సంతృప్తిని ఇస్తుంది’ అంటూ ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. -
కృతి రికార్డ్
అస్సాంలోని అభయపురికి చెందిన కృతి శిఖా 41 నిమిషాల 34 సెకన్లలో నిరంతరాయంగా 21 పాటలు పాడి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. తొమ్మిదేళ్ల కృతి శిఖా పాడిన పాటల్లో అస్సామీతో పాటు హిందీ పాటలు కూడా ఉన్నాయి. చిన్నారి కృతి శిఖా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించడం ఇది రెండోసారి.తల్లిదండ్రులు గాయకులు కావడంతో ఇంటినిండా సంగీత వాతావరణమే కనిపిస్తుంది. చిన్నారి కృతి ‘ఇండియా బుక్ ఆఫ్ ఆప్ రికార్డ్స్’లో చోటు సాధించిన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ‘ఈ రికార్డ్ కృతి ప్రతిభకు మాత్రమే కాదు సాంస్కృతిక వైవిధ్యానికి కూడా అద్దం పడుతుంది. భాషా సామరస్యత అనే భావనను పెం΄÷ందిస్తుంది’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. -
త్రీ సాంగ్మం
ఒక భాషలో మొదలైన పాట ఆ భాషలోనే ఆగిపోతుంది. అయితే ఈ పాట విషయంలో అలా జరగలేదు. మలయాళంలో మొదలైన పాట హిందీలోకి వచ్చింది. ఆ తరువాత బెంగాలీలోకి వచ్చి ఎండ్ అయింది.ఎక్కడా కృత్రిమత్వం అనిపించదు. హాయిగా వినాలనిపిస్తుంది. మ్యాటర్లోకి వస్తే... స్మితాదేవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ‘ఎడక్కడ్ బెటాలియన్’ అనే మలయాళ సినిమాలోని ‘ఎన్ జీవనే’ పాటను మూడు భాషల్లో చక్కగా పాడింది. స్మిత గొంతుకకు, ఆమె మల్టీ లింగ్వల్ టాలెంట్కు నెటిజనులు జేజేలు పలికారు.హిందీ సంగతి సరే, మలయాళీ పాటను సహజంగా పాడడం అనేది గొప్ప విషయం. అచ్చం మలయాళీ సింగర్ పాడినట్లుగా ఉంది’ అని ఒక నెటిజన్ స్పందించాడు. ‘ఈ పాట పుణ్యమా అని మళయాళం, బెంగాలీ భాషల ధ్వనిలోని కొన్ని అద్భుతమైన సారూప్యతలను గమనించే వీలు కలిగింది’ అంటూ స్పందించాడు ఒక విశ్లేషకుడు. ‘మీ పాట మ్యూజిక్ స్ట్రీమింగ్ ΄్లాట్ఫామ్లలో ఉండేలా చూడండి’ అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అడిగాడు. -
డ్యాన్సమ్నాస్టిక్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్తో, హారర్ లుక్తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
చైనాకు శత్రువులు ఎక్కడో లేరు. ఆ దేశ యువత రూపంలో ఆ భూభాగంలోనే ఉన్నారు. ఇంతకీ ఏం చేస్తున్నారని అంత మాట అన్నారంటారా?.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా తమ దేశం పరువును ఎప్పటికప్పుడు తీసిపారేస్తున్నారు మరి.యుంటాయ్ జలపాతం.. చైనాలోనే అతిపెద్ద జలపాతంగా ఓ రికార్డు ఉంది. దీనిని ఆసియాలోనే అతిపెద్ద వాటర్ఫాల్గా చైనా ప్రమోట్ చేసుకుంటోంది కూడా. హెనాన్ ప్రావిన్స్లో యుంటాయ్ పర్వతాల నడుమ పచ్చని శ్రేణుల్లో సుమారు 314 మీటర్ల(1,030 ఫీట్ల) ఎత్తు నుంచి నీటి ధార కిందకు పడే దృశ్యాలు.. చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. లక్షల మంది సందర్శకులతో పర్యాటకంగానూ ఈ జలపాతం విశేషంగా నిలుస్తుంటుంది కూడా. అలాంటి జలపాతం విషయంలో షాకింగ్ విషయం వెలుగు చూసిందిప్పుడు. అంత ఎత్తు నుంచి పైపులతో నీటిని కిందకు గుమ్మరిస్తుందనే నిజం బయటపడింది. కొందరు యువకులు.. యుంటాయ్ పర్వత్వాల్లో ట్రెక్కింగ్కు వెళ్లారు. అక్కడ వాళ్లు ఆ పైపుల్ని గమనించి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంకేం.. చైనా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో యుంటాయ్ జియో పార్క్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.Chinese officials have been forced to apologise, after a hiker's video revealed that China's highest waterfall may be supplied by a water pipe.The video, on Douyin app, showed the flow of water from the Yuntai Mountain Waterfall coming from a pipe built into the rock face.🧵1 pic.twitter.com/O8DodMnn1L— BFM News (@NewsBFM) June 7, 2024వర్షాధార జలపాతం అయిన యుంటాయ్కి వేసవి కాలంలో వచ్చిన పర్యాటకుల్ని నిరాశకు గురి చేయడం ఇష్టం లేకనే అక్కడి నిర్వాహకులు ఈ పని చేస్తున్నారంట. అయితే అప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసిపోయింది.గతంలో కరోనా టైంలో వైరస్ కట్టడి పేరిట అక్కడి ప్రభుత్వం సాగించిన దమనకాండ గుర్తుండే ఉంటుంది. ఆ టైంలోనూ సోషల్ మీడియా ద్వారా అక్కడి సంగతులు బయటి ప్రపంచానికి తెలిశాయి. అలాగే.. గ్జియాపు కౌంటీ గ్రామం విషయంలోనూ చైనా సృష్టించిన ఫేక్ ప్రపంచం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. -
రెప్పపాటులో షాకింగ్ ఘటన.. ఆ కండక్టర్ దేవుడయ్యా సామీ
భూమి మీద నూకలు ఉన్నాయ్.. అనే మాటను మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన సందర్భాల్లో తరుచు వాడుతూ ఉంటాం. ఇక్కడ ఓ యువకుడికి భూమి మీద నూకలు ఉన్నాయ్ కాబట్టే తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డాడు.కేరళలో ఓ యువకుడు బస్సులో ప్రయాణిస్తుండగా, కండక్టర్ టికెట్లు తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో సదరు యువకుడు కూడా కండక్టర్ పక్కనే ఉన్నాడు. యువకుడు బస్సులో నిల్చొని ఉండగా, కండక్టర్ సీటుకు ఆనుకుని టికెట్లు ఇస్తున్నాడు. అయితే యువకుడు ఉన్నట్టుండి పట్టు తప్పాడు. ఆ సమయంలో బస్సు వేగంగా కదులుతూ ఉండటంతో ఆ యువకుడు కింద పడిపోయాడనే అనుకున్నారంతా. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో అంతా షాకయ్యారు.కానీ ఆ కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి అత్యంత సమయ స్ఫూర్తితో ఆ యువకుడ్ని ఒక్క చేత్తో పట్టుకుని బస్సులోకి లాగేశాడు. అంతే క్షణం పాటు ఏమైందో తెలియని ఆ యువకుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే కండక్టర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ యువకుడు పడిపోబోతున్నాడు అనే విషయాన్ని మాత్రమే గ్రహించి చేయి అడ్డుపెట్టిన కండక్టర్ను అంతా కొనియాడుతున్నారు. ఆ కండక్టర్ దేవుడయ్యా సామీ అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Kerala bus conductor with 25th Sense saves a guy from Falling Down from Buspic.twitter.com/HNdijketbQ— Ghar Ke Kalesh (@gharkekalesh) June 7, 2024 -
రైలుతో సెల్ఫీకి యత్నం.. చూస్తుండగానే ప్రాణం పోయింది
ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరపాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవుతోంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరినో చూస్తున్నాం. అలాంటి ఘటనలు చూశాక కూడా.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఆపడం లేదు చాలామంది. తాజాగా.. మెక్సికోలో ఓ యువతి అంతా చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి బయల్దేరి ఎంప్రెస్ అనే రైలు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. పైగా అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు. సోమవారం రైలు వెళ్తున్న టైంలో హిడాల్గో వద్ద ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024 -
ElectionsResults ఫీవర్.. ట్రెండింగ్లో AP హవా
ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్ చేస్తే కౌంటింగ్ అప్డేట్, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్ సైతం ఎన్నికల రిజల్ట్స్ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఆయా పార్టీలు, పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో.. ఆయా హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో నడుస్తున్నాయి. అయితే 542 లోక్సభ స్థానాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కువ హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో నడుస్తుండడం గమనార్హం.ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బిగ్ విక్టరీ, వైఎస్ జగన్ అగెయిన్, ఏపీ ఎన్నికల ఫలితాలు, పిఠాపురంలో పవన్ భవితవ్యం ఏంటి?, ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?, కూటమికి వచ్చే సీట్లు ఎన్ని? టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈసారైనా గెలుస్తారా?.. ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.ఎన్డీయే-ఇండియా కూటమి గెలుపోటములు, ఒడిషా ఫలితం, దేశవ్యాప్తంగా పాతిక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. కేవలం ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ ఆ ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది. -
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్గా అభివర్ణించారు. -
గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
లక్నో: ఉత్తరప్రదేశ్లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి.. కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపడంతో ఏం చేయాలో తోచక కంగారుపడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రెయిలింగ్పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్షహర్లోని నరోరా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది.అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు.UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9— Shivaji Mishra | शिवाजी मिश्रा (@08febShivaji) May 29, 2024 -
మౌంట్ ఎవరెస్ట్పై భారీగా ట్రాఫిక్జామ్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఈ ఉన్నత పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య ప్రతి ఏటా వేగంగా పెరుగుతోంది. బేస్ క్యాంప్లో పర్యాటకులు క్యూ కడుతున్నారు. బీబీసీ నివేదిక ప్రకారం ఇటీవల ఇద్దరు పర్వతారోహకులు మృతి చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వందలాది మంది పర్వతారోహకుల క్యూ కనిపిస్తుంది. వీరిని చూస్తుంటే నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారేమోనని అనిపిస్తుంది.ఈ ఫొటోను చూసిన ది నార్తర్నర్ అనే యూజర్ ఇలా రాశాడు. ‘ఎవరెస్ట్ అతి ఎత్తయిన శిఖరం. అయిత ఇప్పుడది మురికిగా మారింది. ఇక్కడ మనుషుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. మంచులో కూరుకుపోతున్నవారికి సహాయం అందించేందుకు ఇక్కడ ఎవరూ లేరు. కాలుష్యం మరింతగా పెరుగుతోంది. చుట్టూ దుమ్ము, ధూళి కనిపిస్తోంది. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుంది?’ అని ప్రశ్నించాడు.భారత పర్వతారోహకుడు రాజన్ ద్వివేది మే 19 ఉదయం 6 గంటలకు ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఆయన అక్కడి పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఎవరెస్ట్ పర్వతారోహణ అంత సులభం కాదు. 1953 మేలో తొలిసారిగా ఎవరెస్ట్ అధిరోహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఏడు వేల మంది ఎవరెస్ట్ను అధిరోహించారు. అయితే ఇక్కడి చలి వాతావరణం, గాయాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మృతి చెందిన వారికి సంబంధించిన డేటా ఎక్కడా లేదు. దానిని ఎవరూ లెక్కించడం లేదు. గంటకు 100 నుండి 240 మైళ్ల వేగంతో వీచే బలమైన గాలులను ఎదుర్కోవడం పర్వతారోహకులకు పెద్ద సవాలు’ అని ఆయన పేర్కొన్నారు. రాజన్ ద్వివేది ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో మంచు శిఖరాలపై లెక్కకు మించిన పర్వతారోహకులు కనిపిస్తారు. Everest; the highest, the dirtiest and the most controversial place on Earth. Humans bypassing corpses, leaving people dying, ignoring help cries, making it dirtiest place with pollution & human wastes ; all for the glory of summit. When will it stop?! #StopCommercialAlpinism pic.twitter.com/Yahobk9c5F— The Northerner (@northerner_the) May 25, 2024 -
వీడియో: కేదార్నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
డెహ్రాడూన్: కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. భక్తులను కేదార్నాథ్ ధామ్కు తీసుకెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతికలోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా హెలికాప్టర్ ఒడిదుడుకులకు లోనై భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. భక్తులను కేదార్ధామ్కు తీసుకువెళ్తున్న ఒక హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కేదార్నాథ్ ధామ్కు 100 మీటర్ల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. Today morning at Kedarnath Helipad. Really superb handling. pic.twitter.com/oKMSwqIffR— Vaibhavi Limaye (@LimayeVaibhavi) May 24, 2024 ఈ సందర్బంగా హెలికాప్టర్ ఒడిదుడుకులకు లోనైంది. ఒకానొక సమయంలో హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. అనంతరం సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమమంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భక్తులు కూడా పైలట్కు కృతజ్ఞతలు తెలిపారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సందర్భంగా అది తమ మీద పడిపోతుందేమోనన్న భయంతో ఆలయం వద్ద ఉన్న భక్తులు పరుగు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #Kedarnath #KedarnathVideo #Chardhampic.twitter.com/eMJ5EPZUVn— Pahadi Voice (@HimalayanRoars) May 24, 2024 -
Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
నాగోలు: అక్కడ రోడ్డు గుంతలమయంగా మారింది. నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవం లేదు. ఇదే రూట్లో ఓ మహిళ రెండుసార్లు యాక్సిడెంట్కు గురైంది. అంతే.. ఆమెకు మండింది. బురద గుంతలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. సమస్యకు పరిష్కారం చూపాలని ప్లకార్డులు ప్రదర్శించింది. ఇంకేం.. అటుగా పోయేవాళ్లు స్మార్ట్ఫోన్లతో అదంతా ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆమె వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హయత్నగర్ పరిధిలోని న్యూ జీవీఆర్ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేట్ ఉద్యోగి. అమె ఇద్దరు పిల్లలు బండ్లగూడ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రతి రోజూ ఆమె వారిని బైక్పై పాఠశాలకు తీసుకెళ్తుంది. నాగోలు బండ్లగూడ రేడియల్ రోడ్డు కొంతకాలంగా గుంతలమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిహారిక కూడా గతంలో ఇదే రోడ్డుపై అదుపుతప్పి కింద పడింది. దీంతో రేడియల్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు సంబంధిత అధికారులకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా విజ్ఞప్తి చేసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా గురువారం ఆమె స్యూటీపై నాగోలు వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడింది. స్వల్ప గాయాలు కావడంతో పిల్లలను ఇంటి వద్ద వదిలి ఘటనా స్థలానికి తిరిగి వచ్చి ఆమె రోడ్ల దుస్థితిపై ఏడాదిగా మేయర్, అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ బురదలో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అమె నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపింది. నాగోలు కార్పొరేటర్ భర్త చింతల సురేందర్ యాదవ్, నాగోలు పోలీసులు అక్కడికి వచ్చి రోడ్ల మరమ్మతుకు నిధులు మంజారుయ్యాయని ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ముందుస్తుగా గుంతలను మట్టితో పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పడంతో నిహారిక నిరసన విరమించింది. కోడ్ ముగియగానే పనులు చేపడతాం నాగోలు–ఆనంద్నగర్ రోడ్డు మరమ్మతుల కోసం రూ. 4 కోట్లు నిధులు మంజురయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదు. ఎన్నికల కోడ్ ముగియగానే పనులు చేపడతాం. :::డాక్టర్ తిప్పర్తి యాదయ్య, హయత్నగర్ సర్కిల్ డీసీ -
ఇద్దరు భార్యల ముద్దుల యూట్యూబర్ : మెకానిక్గా మొదలై రూ. 200 కోట్లకు
నేటి ప్రపంచంలో కంటెంట్ క్రియేటర్లుగా సోషల్ మీడియా కూడా అతిపెద్ద ఆదాయవనరుగా మారిపోయింది. అంతేకాదు నాగ్పూర్ చాయ్వాలా ఢిల్లీ వడా పావ్ గర్ల్, హైదరాబాద్ కుమారాంటీ సోషల్ మీడియా ఈ వ్యక్తులకు సెలబ్రిటీ హోదాను కూడా తెచ్చి పెడుతోంది. ఈ క్రమంలో మెకానిక్గా జీవితాన్ని మొదలు పెట్టి రూ. 200 కోట్లకు యజమానిగా మారిన యూట్యూబర్ అర్మాన్ మాలిక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.యూట్యూబర్ అర్మాన్ మాలిక్ 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల్లో ఒకడిగా పాపులర్. ఇటీవలి ఇంటర్వ్యూలో, అర్మాన్ మాలిక్ తన జీవితంలోని వివిధ అంశాలను ప్రస్తావించాడు. వివాదాస్పద జీవితం, ఇద్దరు భార్యలు, వందల కోట్ల సంపద లాంటి వివరాలను షేర్ చేశాడు.అర్మాన్ మాలిక్ 8వ తరగతిలో రెండుసార్లు ఫెయిల్ కావడంతో ఇంటి నుంచి పారిపోయాడు. నాలుగు రోజులకే ఇంటికి తిరిగి వచ్చి, తనకు చదువు ఇష్టం లేదని, కార్లంటే ఇష్టమని వర్క్షాప్లో పని చేయాలని తండ్రికి చెప్పాడు.అలా మెకానిక్గా పనిచేయడమే కాకుండా, మాన్యువల్ వర్కర్ లాంటి అనేక ఇతర ఉద్యోగాలు కూడా చేశాడు.యూట్యూబర్ తన వ్లాగ్లతో విపరీతమైన ప్రజాదరణ పొందాడు.జేబులో ఒక్క పైసా కూడా లేకుండా వ్లాగింగ్ జర్నీ ప్రారంభించాడు. ఆసక్తికరమైన కంటెంట్తో, అర్మాన్ చాలా తొందర్లోనే అటు ప్రజాదరణను ఇటు ధనాన్ని సంపాదించాడు. , యూట్యూబర్ తన వద్ద రూ. రూ. 200 కోట్ల నికర విలువ. అదీ 2.5 సంవత్సరాలలో యూట్యూబ్ ద్వారా సంపాదించాడట.అర్మాన్ ముందు చూపుతొలుత టిక్టాకర్ ఉన్న అర్మాన్ నెలకు 2 లక్షలు సంపదించాడు. కోవిడ్-19 సమయంలో అర్మాన్ వద్ద కేవలం రూ. 35వేలు మాత్రమే. ఆ తరువాత యూట్యూబ్ ఫేస్బుక్, ఇన్స్టాలో ఎంట్రీ ఇచ్చాడు. ఎవరీ అర్మాన్అర్మాన్ చిన్నపుడే తల్లి కేన్సర్తో పోరాడి మరణించింది. తండ్రి మద్యానికి బానిసకావడంతో అతను కూడా చాలా త్వరగా మరణించాడు. తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకునే సమయానికి అర్మాన్ వయసు కేవలం 19 ఏళ్లు. అర్మాన్కు ఒక అన్నయ్య, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. దీంతో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. కేవలం 2 వేల రూపాయలతో హర్యానా నుంచి ఢిల్లీకి బయలుదేరి బ్యాంకులో పని చేయడం ప్రారంభించాడు. అక్కడ పాయల్ను అనే అమ్మాయిని కలిశాడు. వీరిద్దరూ 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో ఈ దంపతులకు చిరయౌ అనే కుమారుడు జన్మించాడు.భార్య ఫ్రెండ్ కృతికతో ప్రేమ,పెళ్లిఆరు సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత, అర్మాన్ తన భార్య, పాయల్ బెస్ట్ ఫ్రెండ్ కృతికతో ప్రేమలో పడ్డాడు. కృతికను వివాహం చేసుకున్నాడు దీంతో పాయల్తో భర్తనుంచి విడిపోయింది. కానీ తరువాతి కాలంలో రాజీపడి ఇపుడు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. దీంతో ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు అర్మాన్ మాలిక్. అర్మాన్ మాలిక్ భార్యలకు అనేకసార్లు గర్భస్రావాలు జరిగాయట. పాయల్, 2011లో ఒకసారి, మరోసారి గర్భస్రావం అయ్యింది. అలాగే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, ఆమె ఫెలోపియన్ ట్యూబ్లలో ఫెలోపియన్ ట్యూబ్ను తొలగించాల్సి వచ్చింది. చివరకు 2016లో కొడుకు చిరయు పుట్టాడు. 2023లో, పాయల్ ఐవీఎఫ్ ద్వారా అయాన్,తుబా కవలలకు జన్మనిచ్చింది. 2018లో అర్మాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కృతికకు గర్భస్రావాలు అయ్యాయి. చివరికి నాల్గోసారి జైద్ (మగబిడ్డ)కు జన్మనిచ్చింది.అర్మాన్ మాలిక్ 10 ప్లాట్లు, వాటి కథకుటుంబసభ్యులకు ప్రేమగా చూసుకున్న అర్మాన్ మాలిక్ తన సిబ్బందిని కూడా తన కుటుంబంలానే చూసుకుంటాడు. అతనికి మొత్తం 10 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో నాలుగు భార్యలు, నలుగురు పిల్లల కోసం కేటాయించగా, మిగిలిన ఆరు సిబ్బందికి కేటాయించాడట. ఇందులో ఒకటి పూర్తిగా స్టూడియోగా ఉపయోగిస్తాడు. -
సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
విచక్షణ లేకుండా, చేతికొచ్చినట్టు కమెంట్లు చేయడం, సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేయడం సోషల్ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపడిందన్న సంతోషం ఒక తల్లికి ఎంతో సేపు నిలవనీయలేదు. వేధించి, వేధించి ఆమె ఉసురు తీసిన ఘటన విషాదం నింపింది.ఇటీవలి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి సన్షేడ్పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుందా?ఎనిమిది నెలల పాపను రక్షించే రెస్క్యూ ఆపరేషన్లో స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి బిడ్డను కాపాడారు. కానీ ఇపుడా పాపకు తల్లిని దూరం చేసింది మాయదారి సోషల్ మీడియా. కోయంబత్తూర్లో పాపను రక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విడియో చూసిన నెటిజన్లు "బిడ్డను చూసుకోవటం చేత కాదా?" అని ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర డిప్రెషన్కి గురైన ఆమె కోయంబత్తూర్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.కాగా చెన్నైలోని తిరుముల్లైవాయల్లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నాలుగో అంతస్తులో నివసించే రమ్య, వెంకటేష్లకు ఇద్దరు పిల్లలు, నాలుగేళ్ల అబ్బాయి, ఏడు నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న, ఐటీ ఉద్యోగి రమ్య తన ఫ్లాట్లోని బాల్కనీలో తన పసికందుతో ఆడుకుంటూ ఉండగా, పాప ఆమె చేతుల్లోంచి జారి కింద ఉన్న తాత్కాలిక సన్షేడ్లో పడింది. దీంతో పొరుగువారు కింద దుప్పట్లు పట్టుకోగా, ఒక వ్యక్తి సన్షేడ్ నుండి పాపను పట్టుకుని సురక్షితంగా క్రిందికి తీసుకు రాగలిగాడు. ఈ ఘటన తర్వాత రమ్య తల్లిగారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినా ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో శనివారం కారమడైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉసురు తీసుకుంది. -
హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!
జీవితంలో ఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం 'పెళ్లి'. అది తమ జీవితంలో మరుపురాని గుర్తులా ఉండేలా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటోంది యువత. అందుకోసం తమ తాహతకు తగ్గా రేంజ్లో డీజే మ్యూజిక్లు లేదా అందమైన టూరిస్ట్ ప్రదేశాల్లోనూ చేసుకుంటారు. విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అలానే ఇక్కడొక జంట ఏకంగా ఎముకలు కొరికే మంచు శిఖరాల్లో పెళ్లి జరగాలనుకుంది. అందుకని ఎక్కడకు వెళ్లారంటే..ఈ జంట ఏకంగా స్విట్జర్లాండ్లో జెర్మాట్లోని ఆల్ఫైన్ శిఖరాల వద్ద గ్రాండ్గా వివాహ వేడుకను జరుపుకుంది. బంధువుల, స్నేహితు ఆశ్వీరాదల నడుమ ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. గజగజ వణికించే చలిలో చక్కటి వయోలిన్ మ్యూజిక్, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్లు మిల్కీ వైట్ పెళ్లి దుస్తులతో పైనుంచి భువిపైకి వచ్చిన దేవతాల్లా ఉన్నారు. అక్కడొక పెద్ద మంచు క్యూబ్ సెట్టింగ్లో వధువరులిద్దరు చక్కగా కెమరాలకు ఫోజలిలస్తూ నిలబడ్డారు. మంచు శిఖరాలే తమ పెళ్లికి సాక్ష్యంగా.. ఏకంగా రెండు వేలకు పైగా ఎత్తులో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ ఉన్న తెల్లటి మంచుకి తగ్గట్టూ పూల డెకరేషన్ ఓ రేంజ్లో అదరహో అన్నంతగా అద్భుతంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ వెడ్డింగ్ అడ్వెంచర్ అదిరిపోయింది బాస్, నిజజీవితంలో ఇలా మంచులో పెళ్లి చేసుకునే జంటను చూస్తానని అనుకోలేదంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by LEBANESE WEDDINGS (@lebaneseweddings) (చదవండి: ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!) -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్మెంట్ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
అమ్మా... నా పేరు గుర్తుందా?
తల్లిని కౌగిలించుకొని కూతురు ఏడ్చింది. ఆ తల్లి కూతురిని ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. దశాబ్దకాలంగా డిమెన్షియాతో బాధ పడుతోంది తల్లి. తన ముందు మరో వ్యక్తి ఉన్నట్లుగానే భావిస్తుంది తప్ప తన కూతురుకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలేవీ ఆ తల్లిలో లేవు. అయినప్పటికీ సహజాతమైన తల్లి ప్రేమతో... ఏడుస్తున్న కూతురిని ఓదార్చుతుంది. ఇది ఏ దేశంలో వీడియో అయితేనేం?అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకునే వీడియోగా మారింది.‘దే నెవర్ ఫర్గెట్ లవ్’ క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్గా మారింది. కామెంట్ సెక్షన్ కన్నీళ్లతో తడిసి΄ోయింది. ఈ వైరల్ వీడియో క్లిప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూతుళ్లు, కుమారులు అనారోగ్యం బారిన పడిన తమ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు.‘నీ పేరు గుర్తుకు రావడం లేదు అని అమ్మ అన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది’ అని ఒక కుమారుడు అలై్జమర్స్ బారిన పడిన తన తల్లి గురించి బాధపడ్డాడు. ఇది చూసి ఒక యూజర్ – ‘తల్లిప్రేమ అనేది జ్ఞాపకం కాదు. అది శాశ్వతం’ అని కామెంట్ పెట్టాడు. -
Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
సోషల్ మీడియా ప్రపంచంలో మామ్ఫ్లూయెన్సర్లు పవర్ఫుల్ ఫోర్స్గా మారారు. ఇన్స్పిరేషనల్ వైరల్ కంటెంట్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు పాపులర్ మామ్ ఫ్లూయెన్సర్ల గురించి...ఫ్యాషన్, బ్యూటీటిప్స్ నుంచి పేరెంటింగ్ అండ్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్లు, పబ్లికేషన్లతో కలిసి పనిచేస్తోంది.తన పేరెంటింగ్ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్ యువర్సెల్ఫ్) ్రపాజెక్ట్స్, హోమ్ డెకార్ ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్ పేరేంటింగ్ చాలెంజెస్కు క్రియేటివ్ సొల్యూషన్స్ అందిస్తోంది. మామ్గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్లతో పాపులర్ అయిన శ్వేతా సాల్వే మామ్ఫ్లూయెన్సర్గా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్నెస్ టిప్స్ నుంచి ఫ్యాషన్ వరకు ఎంతో కంటెంట్ను తల్లుల కోసం షేర్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో హెల్తీ మీల్స్, సెల్ఫ్–కేర్ ్రపాక్టీసెస్తో పాటు తన పేరెంటింగ్ జర్నీని కూడా షేర్ చేస్తోంది. మదర్హుడ్ను కెరీర్ అండ్ పర్సనల్ గోల్స్తో ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతోంది.సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉన్న మామ్ఫ్లుయెన్సర్లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్ జర్నీ, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యాషన్ ఇన్స్పిరేషన్లను షేర్ చేస్తుంటుంది. ‘మోర్ ఫన్ అండ్ క్రియేటివ్’ అనే కోణంలో పేరెంటింగ్కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్ను తల్లుల కోసం షేర్ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్ జర్నీతోపాటు కుకింగ్ టిప్స్, డిఐవై (డూ ఇట్ యువర్సెల్ఫ్) ఐడియాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. -
Video: ఇదేం పిచ్చి.. ఇన్స్టా రీల్స్ కోసం హైవేపై పిస్తోల్తో డ్యాన్స్
ఇది సోషల్ మీడియా కాలం.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ 24 గంటలు ఆన్లైన్లోనే గడుపుతున్నారు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో పాపులర్ అయ్యేందుకు తహతహలాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ లైకులు, వ్యూవర్షిప్ కోసం అట్రాక్ట్ చేస్తున్నారు. రోజురోజుకీ ఈ పిచ్చి పీక్స్కు వెళుతోంది. వాటి కోసం ఒక్కోసారి ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు.. తాజాగా ఓ యువతి వైరల్ అవ్వడం కోసం తుపాకీతో నడిరోడ్డుపై రీల్స్ చేయడంతో ఇరకాటంలో పడింది.ఉత్తర ప్రదేశ్లోని లక్నో హైవేపై ఓ అమ్మాయి తన చేతిలో పిస్తోల్తో ఆ రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. పాపులర్ యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ .. లక్నో హైవేపై ఓ భోజ్పురి పాటైకు స్టెప్పులేసింది. యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఓ అడ్వకేట్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు. వీడియో వైరల్కావడంతో లక్నో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ అమ్మాయిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక యువతి డ్యాన్స్ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమెను మెచ్చుకుంటుంటే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. instagram star सिमरन यादव लखनऊ सरेआम नियम कानून व आचार संहिता की धज्जियाँ उड़ाते हुए highway पर पिस्टल को लहराकर video वायरल करके समाज में अपनी बिरादरी का रौब जमा रहीं हैं परंतु अधिकारी चुप्पी साधे हुए है l @dgpup @ECISVEEP @Splucknow_rural @Igrangelucknow @adgzonelucknow @myogi pic.twitter.com/GN4zWsc1P9— Advocate kalyanji Chaudhary (@DeewaneHindust1) May 9, 2024 -
తండ్రి మరణించిన 10 రోజులకే పనిలో.. సాయం చేస్తానన్న హీరో
ఇంటి పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంతో దయనీయంగా మారుతుంది. సంపాదనతో ఫ్యామిలీని పోషించే మనిషి లేకుంటే అంతా తలకిందులవుతుంది. చాలా సందర్భాల్లో పిల్లలు బడి మానేసే దుస్థితి ఏర్పడుతుంది. వయసుకు మించిన పని చేయడానికీ వెనుకాడరు. ఇటీవల ఢిల్లీలో జస్ప్రీత్ అనే పిల్లవాడు తన తండ్రిని కోల్పోవడంతో ఆయనలాగే చపాతీలు చేసే పనిలోకి దిగాడు. పదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. చేయూతనిచ్చేందుకు రెడీతల్లి పంజాబ్లోని గ్రామంలో ఉండగా జస్ప్రీత్ తన సోదరితో కలిసి వాళ్ల ఆంటీ ఇంట్లో ఉంటున్నాడు. ఓ ఫుడ్ వ్లాగర్ ఇతడి పరిస్థితి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. దీంతో ఆనంద్ మహీంద్రా, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, బీజేపీ లీడర్ రాజీవ్ బాబ్బర్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకు చేయూతనిచ్చేందుకు రెడీ అయ్యాడు.సెల్యూట్ ఈ పదేళ్ల బాలుడు చిరునవ్వుతో కష్టాలను దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి చనిపోయిన పది రోజులకే ఆయన పనిని చేసేందుకు రంగంలోకి దిగిన అతడి గుండెధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను. అతడికి లేదా అతడి సోదరికి మంచి విద్య అందించేందుకు సాయం చేయాలనుకుంటున్నాను. అతడు ఎక్కడుంటాడో తెలిస్తే చెప్పండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన జనాలు అర్జున్ది ఎంత గొప్ప మనసు అని కొనియాడుతున్నారు.చదవండి: రూ.15 లక్షల విలువైన జ్యువెలరీ.. తల్లికి రైతుబిడ్డ గిఫ్ట్! -
ఇల్లు తుడిచే మాప్ కాదు, బీబీక్యూ మాప్ సాస్: వీడియో వైరల్
ఇంటర్నెట్లో ఫుడ్కు సంబంధించిన అనేక వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని ఆకర్షణీయంగా ఉంటే, మరికొన్ని మాత్రం యాక్.. అనిపిస్తుంటాయి కదా. అలాంటి ఇంట్రస్టింగ్ వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Chef Matt Cooper (@stadiumchef) దోసల పెనం మీద చీపురు కట్టతో తుడవడం చూశాం. మొన్నఒక వ్యక్తి అనేక చికెన్ కాల్చడం కోసం పొడవైన తుడుపుకర్రను వాడేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. తాజాగా ఒక మహిళ మాంసాన్ని గ్రిల్ చేస్తూ, మాప్ స్టిక్ వాడడం నెటిజన్లకు షాకిచ్చింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో 45 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకంది. 47వేలకు పైగా కామెంట్లు వెల్లువెత్తాయి.stadiumchef ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక మహిళా చెఫ్ సాస్ కంటైనర్లో తుడుపుకర్రను ముంచి, తరువాత బీబీక్యూలోని మీట్పై పూసింది. బీబీక్యూ మాప్ సాస్ అనే క్యాప్షన్తో షేర్ ఈ చేసిన వీడియోపై వివరణ కూడా ఇచ్చింది. ఇలాంటి మాప్స్ గ్రిల్డ్ మాంసాన్ని చేసేందుకు స్పెషల్గా తయారు చేస్తారని వివరణ ఇచ్చింది. పెద్దమొత్తంలో స్మోక్డ్ మీట్ చేసేటపుడు ఇవి ఉపయోగపడతాయి. మీరు దక్షిణాదికి చెందినవారు కాకపోతే, అర్థం కాదు అని కూడా ఆమె తెలిపింది. ఇంత వివరణ ఇచ్చినా ఇది చూసి వెంటనే కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘‘అస్సలు హైజీనిక్గా లేదు..బాబోయ్ బాక్టీరియా మయం రా బాబూ.. నేను తిన’’ అని ఒక యూజర్ కమెంట్ చేయగా, చాలామంది బీబీక్యూ మాప్ను సమర్ధించారు. -
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
అమెరికన్ యూట్యూబర్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన ఫాలోయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మిస్టర్ బీస్ట్గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ తన 26వ పుట్టినరోజు (మే 7) సందర్భంగా 26 టెస్లా కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ప్రకటించడం విశేషం. కండిషన్స్ అప్లయ్ అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ కంటెంట్ విచిత్రమైన సవాళ్లతో తనకు తానే సాటి అని నిరూపించుకనే మిస్టర్ బీస్ట్ తాజాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. తన పోస్ట్ కింద కామెంట్ చేసి, ఇద్దరు ఫ్రెండ్స్ను ట్యాగ్ చేసిన 26 మందిని ఎంపిక చేసి, 26 కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. డ్రా తీసిన అనంతరం విజేతలకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తానని, వారం రోజుల్లో (మే 11న) ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తానని తెలిపాడు. అంతేకాదు రకరకాల పేర్లు, లేదా రీపోస్ట్లు లాంటి జిమ్మిక్కులు పనిచేయవని కూడా వెల్లడించాడు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్లో అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా కొనసాగుతున్న మిస్టర్ బీస్ట్ నికర విలువ రూ.4,175 కోట్లు (500 మిలియన్ల డాలర్లు)గా తెలుస్తోంది. 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో 6000 పేరిట తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, అలాగే ఒక దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రరోపీని నడుపుతున్నాడు. దీని ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను విరాళాలిస్తుంటాడు.
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్
నైపుణ్యాన్ని వెలికితీస్తున్న చెస్ పోటీలు
ముగిసిన చెస్ పోటీలు
అన్నప్రాశన రోజే తిరిగిరాని లోకాలకు
పేరుపాలెం బీచ్లో సందడి
పచ్చిరొట్టగా జీలుగ సాగు
భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
క్రికెట్ జట్టు ఎంపిక
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
Advertisement