డల్లాస్ :
భారత 68వ గణతంత్ర దినోత్సవాలు అమెరికాలోని డల్లాస్లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్లోని ఇర్వింగ్లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా నగరం నడబొడ్డున గాంధీ మెమోరియల్ స్వప్నం సాకారానికి కృషి చేసిన వారందరిని ఎమ్జీఎమ్ఎన్టీ సెక్రటరీ రావు కల్వల కొనియాడారు. గణతంత్ర వేడుకకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికి, ఎమ్జీఎమ్ఎన్టీ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకొని జనవరి 30న అందరం మళ్లీ కలుసుకుని మహాత్ముడికి నివాళులు అర్పిద్దామని పేర్కొన్నారు.
గాంధీ విగ్రహానికి ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జాన్ హామ్మోండ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్జీఎమ్ఎన్టీ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద గుమికూడిన ప్రతి ఒక్కరూ గౌరవ వందనం సమర్పించారు.
'భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాము. భారత జాతి పిత మహాత్మాగాంధీ ఎనలేని కృషి వల్ల 1947 ఆగష్టు15న భారత్కు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత మన రాజ్యాంగం అమలులోకి రావడానికి దాదాపు రెండున్నర ఏళ్లు పట్టింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ అంబేడ్కర్ కృషి వల్ల 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. పేద, ధనికలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించి పాటించాలి. పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య విలువలను మనం పాటించడం భారత అమెరికన్లుగా గర్వించదగ్గ విషయం' అని డాక్టర్ ప్రసాద్ తోట కూర పేర్కొన్నారు.
ఎమ్జీఎమ్ఎన్టీ నాయకులు తయ్యబ్ కుందావాలా, షబ్నమ్ మోడ్గిల్, జాక్ గోద్వానీ, కుంతేష్ చోస్కీ, కమల్ కౌశల్, సూరి తయ్యగరాజన్, బెనజీర్ అర్ఫీలు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
డల్లాస్లో ‘ఘన’తంత్ర వేడుకలు
Published Sat, Jan 28 2017 5:25 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement