కృష్ణా నదిపై 1.9 కి.మీ. పొడవుతో నిర్మాణం
* మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్- కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలాలతో అనుసంధానం
* మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొడవైన వంతెన రూపుదిద్దుకోనుంది. కృష్ణా నదిపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్లను అనుసంధానిస్తూ మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం- కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధేశ్వరం గ్రామాల మధ్య ఈ నిర్మాణం జరగనుంది. దాదాపు 1.9 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం నమూనాలను సిద్ధం చేసే పనుల్లో ఉన్న అధికారులు మరో మూడు నెలల్లో పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లకుపైగా వ్యయం చేయనున్నారు. ఇది పూర్తయితే తెలంగాణలో ఇదే అతి పొడవైన వంతెనగా నిలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ-ఛత్తీస్గడ్లను అనుసంధానిస్తూ వరంగల్ జిల్లా ఏటూరునాగారం ముల్లకట్ట గ్రామం వద్ద జాతీయ రహదారుల విభాగం భారీ వంతెన నిర్మించింది. గోదావరి నదిపై రూపుదిద్దుకున్న దీని పొడవు 1.8 కిలోమీటర్లు. మరో నెలరోజుల్లో అధికారికంగా అందుబాటులోకి వచ్చే ఈ వంతెననే తెలంగాణలో ఇప్పటి వరకు పొడవైంది.
కర్నూలుతో సంబంధం లేకుండా ముందుకు...
ఆంధ్రప్రదేశ్లోని, వైఎస్సార్ కడప, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోకి అడుగుపెట్టాలంటే కర్నూలు మీదుగా వస్తున్నారు. ప్రస్తుతం బీచ్పల్లి వంతెనే ప్రధాన మార్గంగా ఉంది. కర్నూలుతో సంబంధం లేకుండా నేరుగా వచ్చేలా కొత్త వంతెన సిద్ధమవుతోంది. దీనివల్ల వైఎస్సార్ కడప, నంద్యాల- హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించేవారికి దాదాపు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
సగం ఖర్చు భరించాలంటూ ఏపీకి లేఖ..
ఈ కొత్త వంతెన వల్ల తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉండనున్నందున దీన్ని సంయుక్త ప్రాజెక్టుగా నిర్మిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కానున్నందున అందులో సగం భరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి సంబంధించి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఏపీకి లేఖ రాసింది.
అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం ఆ శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ వంతెనను దృష్టిలో ఉంచుకుని ఆ శాఖ రోడ్లను కూడా విస్తరిస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ రోడ్డును అభివృద్ధి చేశారు. నాగర్కర్నూలు రోడ్డును కూడా నిర్మించారు. కల్వకుర్తి రోడ్డును రెండు లేన్లకు విస్తరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు నంద్యాల-కపిలేశ్వరం రోడ్డుతో దీన్ని అనుసంధానిస్తారు. ఆ రోడ్డును కూడా అటువైపు విస్తరించాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో పనులు మొదలు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణలో అతి పొడవైన వంతెన
Published Tue, Sep 1 2015 7:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement