చెరుకు తోటలోకి లాక్కెళ్లి చెరబట్టాడు | Sakshi
Sakshi News home page

చెరుకు తోటలోకి లాక్కెళ్లి చెరబట్టాడు

Published Tue, Aug 26 2014 3:36 PM

చెరుకు తోటలోకి లాక్కెళ్లి చెరబట్టాడు - Sakshi

మీరట్: దళిత బాలికపై యువడొకరు అత్యారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని పార్థాపూర్ ప్రాంతంలో జరిగింది. గడ్డి కోసుకురావగానికి పొలానికి వెళ్లిన 15 ఏళ్ల బాలికపై దుండగుడు ఈ అకృత్యానికి ఒడిగట్టాడు. నిందితుడు సోనుపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బాలికను బలవంతంగా చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఇంటికి తిరిగొచ్చిన  బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయంతో తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణయిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement