సాయిబాబాగౌడ్ కుటుంబానికి షర్మిల పరామర్శ | Sakshi
Sakshi News home page

సాయిబాబాగౌడ్ కుటుంబానికి షర్మిల పరామర్శ

Published Tue, Jun 30 2015 11:22 AM

YS Sharmila second day paramarsa yatra in rangareddy district

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మంగళవారం మేడ్చల్లో సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి తాము అండగా ఉంటామని సాయిబాబాగౌడ్ కుటుంబ సభ్యులకు షర్మిల భరోసా ఇచ్చారు. పరామర్శ యాత్రలో భాగంగా రెండో రోజు మంగళవారం కండ్లకోయ, కేసారం, మాడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లోని వైఎస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించనున్నారు.

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె షర్మిల తెలంగాణలో పరామర్శయాత్ర చేపట్టిన విషయం విదితమే. అందులోభాగంగా సోమవారం షర్మిల రంగారెడ్డి జిల్లాలో పరామర్శయాత్ర ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో షర్మిల నాలుగు రోజుల పాటు పరామర్శ చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement