♦ పీసీబీ అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్
♦ పోలీస్ శాఖ నుంచి పీసీబీకి 100 మంది అధికారులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశ్రామిక వ్యర్థాలను నాలాల్లోకి విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో శనివారం పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో సమీక్షించారు. అక్రమంగా వ్యర్థాల డంపింగ్ నిఘా కోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జీడిమెట్ల, బాలానగర్ పారిశ్రామికవాడల్లో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, త్వరలోనే ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామ న్నారు.
పరిశ్రమల వ్యర్థాల అక్రమ డంపింగ్ను అరికట్టేం దుకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే పోలీస్ శాఖ నుంచి 100 మంది అధికారు లను డిప్యూటేషన్పై నియమించుకో వాలని పీసీబీకి సూచించారు. ఈ మేరకు డిప్యుటేషన్ కోరుతూ ప్రతిపాదనలు పంపిస్తే హోం మంత్రి, డీజీపీలకు లేఖ రాస్తానని చెప్పారు. నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలు, విడుదలయ్యే వ్యర్థాల పరిమాణం, వ్యర్థాల రవాణాకు వినియోగిస్తున్న వాహనాలు తదితర వివరాలతో ఓ నివేదికను తయారు చేయాలని పీసీబీని కోరారు. కాలుష్యవ్యర్థాల నిర్వహణలో విఫలమవుతున్న శాఖలకు పీసీబీ నుంచి నోటీసులు జారీ చేయాలని కోరారు.
సంగారెడ్డి, పటాన్చెరు, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో కాలుష్య వ్యర్థాలను బోరు గుంతల్లో విడుదల చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేక బృందాలతో తనిఖీలు జరిపి కేసులు నమోదు చేయాలన్నారు. ఈ తరహాలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పోలేపల్లి సెజ్లోని రెండు కంపెనీలను మూసివేస్తున్నామని పీసీబీ అధికారులు మంత్రికి తెలిపారు. ఈ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి దర్యాప్తు జరపాలని మంత్రి ఆదేశించారు.
చెరువుల్లో నురగపై నివేదిక ఇవ్వండి
చెరువుల నుంచి వస్తున్న నురగపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కేటీఆర్ కోరారు. పారిశ్రా మిక వ్యర్థాలపై కట్టడి లేకపోవడంతో ఈ సమస్య కొనసాగుతుందన్నారు. నగరంలోని చెరువులు, హుస్సే న్సాగర్ సుందరీకరణపై సమీక్షించారు. హుస్సేన్ సాగర్లోకి మురికి నీరు చేరకుండా 90% విజయం సాధించామన్నారు. వినాయక నిమజ్జనానికి 25 మినీ కొలనులను అభివృద్ధి చేశామన్నారు.
వ్యర్థాల విడుదలపై సీసీ కెమెరాలతో నిఘా
Published Sun, Jul 23 2017 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement