ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో దళితులను ఊచకోత కోసిన ఘటనలో హైకోర్టు నిందితులను నిర్దోషులుగా తేల్చి తీర్పు చెప్పడాన్ని నిరసిస్తూ బుధవారం ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలు ప్రజా, దళిత సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. చుండూరు నేరస్తులను నిర్దోషులుగా ఎలా నిర్ధ్దారిస్తారని ప్రశ్నించారు. విరసం నాయకులు వరవరరావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షులు వేదకుమార్, కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహేశ్వర్రాజ్, అరుణోదయ రామారావు, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా నాయకులు నారాయణరావు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ 23 ఏళ్ల క్రితం చుండూరు దళిత వాడలో అగ్రకుల దురహంకారులు 8 మంది దళితులను ఊచకోత కోసిన ఘటన హైకోర్టుకు చాలా చిన్న విషయంగా కన్పించడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సాక్ష్యాధారాలు లేవని దళితులను హత్య చేసిన వారిని నిర్దోషులుగా తేల్చడం దారుణమన్నారు. నిందితులు నిర్దోషులైతే దళితులను హత్య చేసింది ఎవరని ప్రశ్నించారు. ఈ తీర్పు దళితులకు కోర్టులపై నమ్మకం కలిగించేలా లేదన్నారు.
తీర్పుపై ‘సుప్రీం’లో అప్పీల్ వేయండి
చుండూరులో దళితుల ఊచకోత కేసులో నిందితులకు దిగువ కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు తగు న్యాయం జరిగేలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.మధు ఒక ప్రకటనలో కోరారు. న్యాయం కోసం బాధితులు, దళిత, ప్రజా సంఘాలు చేసే కృషికి పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. కాగా, చుండూరు కేసులో తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న మరో ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిందితులు జైలు నుంచి విడుదల
చుండూరు హత్యాకాండలో నిందితులుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిని కోర్టు ఉత్తర్వుల మేరకు బుధవారం విడుదల చేశారు. వీరిలో నలుగురు ఖైదీలు వ్యవసాయ క్షేత్రం (ఓపెన్ ఎయిర్ జైలు) నుంచి విడుదలయ్యారు. మరో ఖైదీ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. వీరందరూ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 2007లో ‘చర్లపల్లి’కి వచ్చారు.
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి: వీకే సింగ్
చుండూరు ఉదంతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థలోనూ సంస్కరణలు అమలుకావాల్సిన విషయాన్ని పునరుద్ఘాటించిందని సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీసు శాఖ సమన్వయ విభాగం అదనపు డీజీ వినయ్కుమార్ సింగ్ (వీకే సింగ్) తెలిపారు. తాను రాసిన ‘ఈజ్ ఇట్ పోలీస్? కన్ఫెషన్స్ ఆఫ్ ఎ టాప్ కాప్’ పుస్తకంలోనూ ఈ అంశాన్ని వివరించానని బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చెప్పారు. ‘‘అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర డబ్బుంటేమంచి న్యాయవాదుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా సాక్ష్యాధారాలపై పైచేయి సాధించడంతోపాటు విచారణ ప్రక్రియ ఏళ్లు కొనసాగేలానూ చేయవచ్చు. హత్య వంటి తీవ్రమైన నేరాల నుంచీ బయటపడొచ్చు. 21 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు ఉదంతంలో పోలీసులతోపాటు జిల్లా, సెషన్స్ కోర్టులు నిందితులను దోషులుగా నిర్ధారించాయి. హైకోర్టు మాత్రం నిందితులంతా నిర్దోషులని తేల్చింది. ఈ ఉదంతంలో సుదీర్ఘకాలం ఎదురు చూసిన నిరుపేద దళితులకు న్యాయం జరగలేదు. డబ్బు లేని వాళ్లు మాత్రమే జైళ్లకు వెళతారని, మీడియా ప్రభావం వల్ల ధనికుల్లో కొద్దిమందే జైలుకు వెళ్తున్నారనే విషయాన్ని నా పుస్తకంలో ప్రస్తావించా. ఇప్పటికైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు రాకుంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయి. అధికార యంత్రాంగాల చేతిలో పోలీసులు పావులుగా మారడంతో సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షే అవుతోంది. రాజకీయపక్షాలు ఈ సంస్కరణల్నే తమ ప్రధాన డిమాండ్గా మార్చుకోవాలి. మేధావి వర్గం, మీడియా సైతం ఆ కోణంలో కృషి చేయాలి. చుండూరు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ‘ఈజ్ ఇట్ పోలీస్?’ పుస్తకంలో ఉన్న అంశాలను ప్రస్పుటం చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.
చుండూరు తీర్పుపై ప్రజా సంఘాల ఆగ్రహం
Published Thu, Apr 24 2014 1:44 AM
Advertisement
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement