జీహెచ్ఎంసీ సిబ్బందిపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీ సిబ్బందిపై పోలీసుల దాడి

Published Mon, May 25 2015 2:33 PM

police attack on ghmc workers

హైదరాబాద్:నగరంలో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిపై పోలీసులు దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణ కోసం సికింద్రాబాద్ లో గార్డెన్ హోటల్ ను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిపై ట్రాఫిక్ పోలీసులు దాడికి దిగారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందనే కారణంతో జీహెచ్ఎంసీ కార్మికులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు.

Advertisement
Advertisement