⇒ మరో ఇద్దరు
⇒ నిందితులకు కూడా...
⇒ సుప్రీంకోర్టులో 2 ఎస్ఎల్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ఏసీబీ
⇒ నేటి మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయసింహలకు ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సుప్రీంకోర్టులో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్ఎల్పీ)దాఖలు చేసింది. ఏసీబీ తరపున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రారావు ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ప్రస్తావన (మెన్షనింగ్)కు అవకాశం ఇస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మెన్షనింగ్ జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో పిటిషన్ ఉంటే ధర్మాసనం ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ అదే సమయంలో విచారణ మొదలుపెట్టవచ్చు లేదా మరో తేదీకి వాయిదా వేయవచ్చు లేదా పిటిషన్ను తిరస్కరించనూవచ్చు.
బెయిల్ వల్ల దర్యాప్తునకు ఆటంకం
బెయిల్పై విడుదలైన అనంతరం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఇది హైకోర్టు షరతులను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పేర్కొన్నట్లు రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. బెయిల్ను రద్దు చేయడం వల్ల మాత్రమే ఏసీబీకి తదుపరి దర్యాప్తునకు వీలవుతుందని విన్నవించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 50 లక్షలను లంచంగా ఇవ్వజూపుతూ రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారని, ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న రేవంత్రెడ్డికి బెయిల్ కొనసాగితే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందన్నారు.
రేవంత్ బెయిల్ రద్దు చేయండి
Published Fri, Jul 3 2015 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement