హైదరాబాద్: బుధవారం రాత్రి దుండగుల కాల్పుల్లో గాయపడ్డ సీఐ, హోంగార్డులను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను నాయిని పరామర్శించారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బస్సుల్లో ప్రయాణించి దోపిడీలు చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాల ఆటకట్టిస్తామని అన్నారు. సూర్యాపేట ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరును నాయిని ప్రశంసించారు. ఘటనకు పాల్పడిన నిందితులను తప్పకుండా పట్టుకుంటామని చెప్పారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని నాయిని చెప్పారు. గతంలోనే రూ.5 లక్షలను హోంగార్డులకు పరిహారంగా ప్రకటించామని హోంమంత్రి నాయిని గుర్తు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడన్న విషయం తెలిసిందే. పరామర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ సంఘటనా స్థలాన్న పరిశీలించారు.
'సూర్యాపేట కాల్పులు యూపీ గ్యాంగ్ పనే'
Published Thu, Apr 2 2015 9:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement