ఆప్ బడో, బడ్‌కే దేశ్‌కో బడావో | Sakshi
Sakshi News home page

ఆప్ బడో, బడ్‌కే దేశ్‌కో బడావో

Published Thu, Oct 23 2014 2:36 AM

Lead India -2020 On the training to students

లీడ్ ఇండియా-2020పై విద్యార్థులకు శిక్షణ
ఎల్లారెడ్డి : మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఆశయాలను నెరవేర్చడానికి 2020 కల్లా దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంచడానికి విద్యార్థులు కృషి చేయాలని అమెరికాలోని లీడ్ ఇండియా టెక్నాలజీ అధికారి అనంతసుధాకర్  అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో  ‘లీడ్ ఇండియా -2020 విజన్’ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2004 లో అబ్దుల్ కలాం స్థాపించిన లీడ్ ఇండియా ద్వారా విద్యార్థులు ‘ఆప్ బడో, బడ్‌కే దేశ్‌కో బడావో’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు.

దేశాన్ని అగ్రస్థానంలో నిలుపడానికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగింది. తల్లి దండ్రుల విలువలతో పాటు  వారికి చేయాల్సిన సేవలను తెలిపారు. అనంతరం విద్యార్థుల స్పందన తెలుసుకుని ఉత్తమంగా ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఆర్‌ఐ అనంతసుధాకర్ స్పాన్సర్ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటేశం, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement