రాంనగర్ :రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించి వాటి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్లను కోరారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. వాటిని సర్వేచేసి వివరాలను సర్వే నెంబర్లతో సహ తెలియజేయాలన్నారు. భూమి ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రాంతాలలో ఉన్నదానిని గుర్తించాలని సూచించారు.
పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములు ఉన్నాయన్నారు. వాటిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరగా ఉన్న జిల్లాలో పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 10134 ఎకరాల భూమిని గుర్తించి నట్లు చెప్పా రు. అందులో 4500ల ఎకరాలు సర్వేచేయగా 400 ఎకరాలు మాత్రమే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇంకా 6500ల ఎకరాల భూమిని సర్వే చేయించాల్సి ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ హరిజవహర్లాల్, అదనపు జేసీ వెంకట్రావు, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ ప్రసాదరావు, డ్వామా పీడీ సునంద, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
భూపంపిణీ వివరాలు సేకరించాలి : రేమండ్ పీటర్
భూ పంపిణీకి అర్హులైన దళితులకు సంబంధించిన వివరాలను పకడ్బందీగా సేకరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత నిరుపేద షెడ్యూల్డ్ కులాల వారికి ఆగస్టు15న ప్రతి నియోజకవర్గంలో ఒక హాబిటేషన్లో భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో గుర్తించబడిన హాబిటేషన్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలు, కొనుగోలు చేయాల్సిన వివరాలను జిల్లాల వారీగా సమీక్షించారు.
వ్యవసాయరంగంపై ఆధారపడిన భూమి లేని ఎస్సీలను గుర్తించాలన్నారు. లబ్ధిదారులు, స్వయం సహా యక సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి భూములు అమ్మేవారీతో రేటు మాట్లాడాలని సూచించారు. జిల్లాస్థాయి కమిటీ ఆ భూమి విలువను నిర్థారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 హాబిటేషన్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ గ్రామాలలో ఈ నెల 30 వరకు సర్వే పూర్తి అవుతుందని తెలిపారు. భూములు కొనుగోలు చేయడంలో కమ్యూనిటీ, స్వయం సహాయక సంఘూలను భాగస్వాములను చేసి వారి ద్వారా భూములను అమ్మే వారితో మాట్లాడినట్లు చెప్పారు. వెల్త్ ర్యాంకింగ్ ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి భూములను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి సీఎం అడ్వయిజర్ రాంలక్ష్మణ్, షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ కమిషనర్ రాహుల్బొజ్జా, సెర్పు సీఈఓ మురళి తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల కోసం భూములు గుర్తించాలి
Published Tue, Jul 29 2014 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement