సిద్దిపేట కోర్టుకు హాజరైన హరీష్‌రావు | Sakshi
Sakshi News home page

సిద్దిపేట కోర్టుకు హాజరైన హరీష్‌రావు

Published Sat, Jan 24 2015 5:56 AM

Harish Raoattended the to Siddipeta court

 సిద్దిపేట జోన్ : ఎనిమిదేళ్ల క్రితం తాను ఫిర్యాదు చేసిన ఒక కేసుకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సిద్దిపేట అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయ స్థానం ఎదుట హాజరై సాక్ష్యమిచ్చారు. 2007లో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పాలమాకుల, రాజగోపాల్‌పేట గ్రామాల మధ్య డీసీఎంలో పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. వాటి కొమ్ములను నరకడంతో రోడ్డుపై కిలోమీటర్ల కొద్ది రక్తపు చారలు పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన అప్పటి ఎమ్మెల్యే హరీశ్‌రావు.. ఎస్‌ఐ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోర్టుకు హాజరై కేసుకు సంబంధించిన సాక్ష్యం ఇచ్చారు.

Advertisement
Advertisement