* తెలంగాణలో సోమవారం ఒక్కరోజే ఐదుగురు రైతుల ఆత్మహత్య
* అప్పులెలా తీర్చాలనే ఆవేదనతో గుండె ఆగి మరో ఇద్దరు మృతి
* అన్నదాతలను బలిగొంటున్న పంటనష్టం, విద్యుత్ కోతలు, అప్పులు
* ఆధారం కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో రైతుల కుటుంబాలు
సాక్షి నెట్వర్క్: ఎన్నో ఆశలతో ఎదురు చూసినా కురవని వర్షాలు.. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు.. అన్నీ కలిసి రైతులను నిలువునా బలిగొంటున్నాయి.. ఆరుగాలం చేసిన కష్టం కళ్ల ముందే నాశనమవడాన్ని తట్టుకోలేక అన్నదాతలు ప్రాణాలు వదులుతున్నారు.. కుటుం బాన్ని పోషించాల్సినవారు దూరమవుతుండడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుంటున్నాయి. వర్షాభావం, విద్యుత్ కోతలు, పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో సోమవారం తెలంగాణలో ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా.. ఆవేదన కారణంగా గుండె ఆగిపోయి మరో ఇద్దరు రైతులు మృతి చెందారు.
వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన మహిళా రైతు తుప్పతి లక్ష్మి (30) తమ నాలుగెకరాల్లో కొన్నేళ్లుగా పత్తి, వరి, మొక్కజొన్న సాగుచేసింది. పెట్టుబడుల కోసం రూ. 2.5 లక్షలు అప్పు చేసింది. కానీ నాలుగేళ్లుగా పంటల దిగుబడి సరిగా లేక.. అప్పులెలా తీర్చాలనే ఆవేదనతో ఆమె ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది.
కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బట్టు ఎల్లం(32) తమ మూడెకరాల్లో వరి వేశాడు. నీటి కోసం మూడు బోర్లు వేయించాడు. కానీ వర్షాభావం, కరెంట్ కోతలతో ఖరీఫ్ పంటంతా ఎండిపోయింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులెలా తీర్చాలనే ఆందోళనతో సోమవారం ఉదయం తన పొలం వద్దే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబానికి పెద్ద దిక్కులేకుండా పోయింది. ఇక కోహెడ మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన ఎల్ల చంద్రం(45) పత్తి పంట వేసి నష్టపోయాడు. దీంతో కలత చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. అతనికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంకా చిన్న కుమార్తె వివాహం చేయాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన రాథోడ్ నారాయణ (50) ఐదెకరాల్లో సోయా, రెండెకరాల్లో పత్తి వేశాడు. కానీ వర్షాల్లేక దిగుబడి రాకపోవడంతో... ఆవేదన చెంది పురుగుల మందు తాగాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురం తండాకు చెందిన రైతు తేజావత్ రాంబాబు (30) రెండెకరాల్లో మిర్చి, మూడెకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంటలు ఎండిపోవడంతో పాటు బోరు వేయడం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురయ్యాడు. ఆ ఆందోళనతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు.
అప్పులు మింగేశాయి..
కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట గ్రామానికి చెందిన యెల్లాల లింగారెడ్డి(65) తమ పది ఎకరాల భూమిలో పత్తి వేశాడు. వర్షాభావం కారణంగా నష్టం రావడంతో.. ఆందోళన చెంది గుండెపోటుకు గురయ్యాడు. ఇక నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామానికి చెందిన నూకపంగు సైదులు(48) తమ నాలుగున్నర ఎకరాల్లో వరి సాగుచేశాడు. వర్షాభావం, తెగుళ్లతో పంట దెబ్బతిని కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్నాడు. ఈ ఆవేదనతోనే గుండెపోటుతో మృతి చెందాడు.
అప్పు మిగిలి.. గుండె పగిలి
Published Tue, Nov 25 2014 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement