ఆడపిల్ల పుడితే పీక నులిమేస్తున్నారు! | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుడితే పీక నులిమేస్తున్నారు!

Published Mon, Sep 22 2014 11:06 AM

ఆడపిల్ల పుడితే పీక నులిమేస్తున్నారు! - Sakshi

వరంగల్: ఆధునిక వ్యవస్థలో కూడా మహిళల పట్ల వివక్ష చూపడం పెరిగిపోతోంది. ప్రపంచం ఓ పక్క సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతోందో, మరో పక్క మనుషులు అంత దిగజారిపోతున్నారు. ఆడపిల్లల పట్ల అతిదారుణం ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల పుడితే చాలు అమ్మేస్తున్నారు. లేకపోతే పీక నులిమేస్తున్నారు.

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలోని నాజీ తండాలో ఇటువంటి దారుణమే జరిగింది. నాలుగు నెలల చిన్నారి పీక నులిమి చంపేశారు. అమ్మాయి పుట్టిందని నెలల ఆడపిల్లను నాయనమ్మ హత్య చేసింది.
**

Advertisement
Advertisement