'కేసీఆర్ పాలనలో 140 మంది రైతుల ఆత్మహత్య' | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ పాలనలో 140 మంది రైతుల ఆత్మహత్య'

Published Thu, Aug 21 2014 6:22 PM

'కేసీఆర్ పాలనలో 140 మంది రైతుల ఆత్మహత్య' - Sakshi

మెదక్: సీఎం కేసీఆర్ 70 రోజుల పాలనలో 140 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదు అని పొన్నాల విమర్శించారు. 
 
రుణమాఫీపై స్పష్టమైన హామీలేనందువల్లే  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పొన్నాల అన్నారు. రైతుల కష్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పొన్నాల మండిపడ్డారు. 

Advertisement
Advertisement