* వ్యవసాయ క్షేత్రంలో ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సూచనలు
* కాన్వాయ్లోనే తిరుగుతూ పంటల పరిశీలన, పనుల పర్యవేక్షణ
* అడుగడుగునా ప్రజల వినతులు.. హైదరాబాద్కు తిరిగి వెళ్లిన సీఎం
జగదేవ్పూర్: ‘ఖరీఫ్ దగ్గరలో ఉంది.. ఎవుసం పనులు ఊపందుకోవాలి.. భూమిని మంచిగా దున్నండి.. ఎరువులు బాగా చల్లండి.. ఏ పంటలు వేస్తే బాగుంటుంది.. కొత్త బావిని తొందరగా పూర్తి చేయాలి..’ అంటూ ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన వ్యవసాయక్షేత్రంలో పర్యటిస్తూ ఫాంహౌస్ సూపర్వైజర్ జహంగీర్కు పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్కు చేరుకున్న సీఎం కేసీఆర్ రాత్రి ఇక్కడే బస చేశారు. ఉదయమే లేచి కాన్వాయ్ ద్వారా వ్యవసాయక్షేత్రంలో పర్యటించారు. ఎరువులు చల్లిన భూమిని పరిశీలించారు. అక్కడి నుంచి బయటకు వచ్చి, అదనంగా కొన్న 14 ఎకరాల భూమిని పరిశీలించారు. డ్రిప్ సౌకర్యాన్ని తొందరగా పూర్తి చేయాలని సూపర్వైజర్ను ఆదేశించారు. ఆదే దారిన మళ్లీ ఫాంహౌస్లోకి చేరుకుని నూతనంగా తవ్విస్తున్న బావిని, సొరకాయ తోటను పరిశీలించారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి 2.25 గంటలకు తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు.
సీఎంతోనే మంత్రి జగదీశ్వర్రెడ్డి..
శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫాంహౌస్కు వచ్చిన కొద్దిసేపటికే విద్యుత్శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి కూడా చేరుకొని,రాత్రి అక్కడే బస చేశారు. ఎర్రవల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభానికి మంత్రి ఫాంహౌస్కు వచ్చినట్లు తెలిసింది. అయితే అది పూర్తి కాకపోవడంతో వచ్చే నెలకు వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే రాష్ర్టంలో విద్యుత్ సరఫరాపై కేసీఆర్ మంత్రితో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. సీఎం కాన్వాయ్లోనే మంత్రి జగదీశ్వర్రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో ఉన్నారని తెలుసుకున్న ప్రజలు ఆదివారం ఉదయం నుంచే అక్కడకు వచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. ఎస్పీ సుమతి. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ అధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం తిరిగి హైదరాబాద్ వెళ్లే వరకు ఈ బందోబస్తు కొనసాగింది.
ఎవుసం పనులు ఊపందుకోవాలి
Published Mon, May 25 2015 2:56 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
- పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
- తనిఖీలు చేయండి.. నిఘా పెంచండి
- అబద్ధాల మోదీ
- Aravind Kejriwal: నేను వచ్చేశా...
- బీజేపీ వైపే ప్రజలు
- మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
Advertisement