వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, తాగునీరు, రహదారులకు అధిక ప్రాధాన్యం
ద్రవ్యపరపతి విధానం వెల్లడించిన మంత్రి ఈటెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మొదటి సంవత్సరంలోనే మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ద్రవ్యలోటు భారీగా కనిపిస్తున్నదని, దీనిని రానున్న కాలంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఉండేలా కృషి చేస్తామని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ద్రవ్యపరపతి విధానాన్ని ఆయన శుక్రవారం సభ ముందుంచారు.
పన్నుల ఆదాయం పెంచుకోవడం, ప్రజాధనాన్ని ఉత్పాదకత పెంచే రంగాలపై వ్యయం చేయనున్నట్టు తెలి పారు. ఆదాయమార్గాలను పెంచుకుంటామని, పన్నుల హేతుబద్దీకరణ, లావాదేవీల వ్యయం తగ్గించుకోవడం, రెవెన్యూ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పదినెలల కాలానికి 35,378 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశామని ఇది దాదాపు 15 శాతం అధికమని వివరించారు. కాగా పన్నేతర ఆదాయం కింద అన్ని విభాగాల నుంచి రూ. 13,242 కోట్లు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భూముల క్రమబద్దీకరణతో 6,500 కోట్లు వస్తాయని అంచనా వేసినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు.
ఆదాయం అంచనా వేయలేం
తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని గతంలో ఆదాయానికి సంబంధించి లెక్కలు లేనందున 2015-16 సంవత్సరం, 2016-17 సంత్సరానికి నిజమైన ఆదాయ అంచనా వేయడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. తెలంగాణలో 2004-05 నుంచి 2013-14 వరకు సరాసరి అభివృద్ధి రేటు 9.83 శాతంగా ఉందని, రాష్ట్ర స్థూలఉత్పత్తి 2004-05 స్థిరధరలతో పోలిస్తే రూ. 2,07,069 కోట్లు అని పేర్కొన్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే.. ఇది 5.55 శాతం అధికమని పేర్కొన్నారు. అయితే 2009-10 సంవత్సరం నుంచి అభివృద్ధి తగ్గుతూ వచ్చిందని మంత్రి సభకు వివరించారు. పారిశ్రామికరంగం బాగా దెబ్బతినగా, సేవారంగంలో పురోగతి నెమ్మదించిందని మంత్రి వివరించారు. అయినప్పటికీ, జాతీయ స్థూలఉత్పత్తితో పోలిస్తే, రాష్ట్ర పురోగతి మెరుగ్గానే ఉన్నట్టు మంత్రి వివరించారు. 2013-14 సంవత్సరంలో రాష్ట్ర స్థూలఉత్పత్తిలో సేవారంగంలో 7.15 శాతంగానూ, వ్యవసాయం 4.58 శాతం, పరిశ్రమల రంగం 2.70 శాతం ఉన్నట్టు తెలిపారు. అసంఘటిత ఉత్పత్తుల రంగంలో 2.29 శాతం, మైనింగ్, క్వారీల్లో 2.58 శాతం నెగెటివ్ గ్రోత్ ఉన్నట్టు వివరించారు. మొత్తం ఆదాయంలో 90 శాతానికి మించి ప్రభుత్వ గ్యారంటీలు ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు.
పెరిగిన వ్యక్తిగత ఆదాయం
కాగా తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగత తలసరి ఆదాయం పెరిగిందని వివరించారు. 2009-10 సంవత్సరంలో వ్యక్తిగత తలసరి ఆదాయం 51,955 రూపాయలుంటే.. 2013-14 సంవత్సరం నాటికి అది 93,151 రూపాయలకు చేరిందని పేర్కొన్నారు.
భారీ పెట్టుబడుల వల్లే ద్రవ్యలోటు
Published Sat, Nov 29 2014 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement