మాటలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ దొందూదొందే
హైదరాబాద్: ‘ప్రధాని నరేంద్రమోదీకి జ్ఞానం పూజ్యం (శూన్యం). అహంకారం పరిపూర్ణం. చరిత్ర తెలియని అజ్ఞాని మోదీ. ఆయన అధికార మదాందంతో వ్యవహరిస్తున్నారు’ అని కాంగ్రెస్ జాతీయ నాయకులు ఎస్.జైపాల్రెడ్డి విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ, నేతలు జి.వివేక్, శ్రవణ్, ఉద్దెమర్రి నర్సింహ్మారెడ్డితో కలసి గాంధీభవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తక్షశిల అనే నగరం పాకిస్తాన్లో ఉందనే విషయం తెలియకుండా బిహార్లో ఉందని చెప్పడం మోదీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
అలెగ్జాండర్కు గంగానది విషయ మే తెలియకున్నా, గంగానది ఒడ్డున ఓడించారని మోదీ చెప్పారన్నారు. మోదీకి చరిత్ర, భూగోళశాస్త్రం తెలియదని, ఇలాంటి అజ్ఞానిని ఎక్కడా చూడలేదన్నారు. మంచివక్తగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్ను మోదీ డమ్మీని చేశారని, మోదీకి రాజకీయ గురువుగా ఉన్న అద్వానీని మమ్మీగా మార్చేశారని జైపాల్ విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కి తెప్పించి, ప్రతీ పౌరునికి 15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామన్న మోదీ.. ఈ ఏడాదిలో ఎంత జమచేశారని ప్రశ్నించారు. రైతులకు భూములపై హక్కుల్లేకుండా తెచ్చిన భూసేకరణ చట్టానికి టీఆర్ఎస్ ఎలా మద్దతిచ్చిందని ప్రశ్నించారు. దీంతో రెండు పార్టీలూ రైతు వ్యతిరేక పార్టీలేనని తేలిపోయిందన్నారు. హామీలను అమలుచేయకుండా మోసం చేయడంలో అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం కేసీఆర్ దొందూదొందేనని వ్యాఖ్యానించారు.
మోదీకి జ్ఞానం పూజ్యం: జైపాల్
Published Thu, May 28 2015 2:24 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement