సాక్షి,సిటీ బ్యూరో : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ లో కంచే చేను మేసింది. ప్రజలకు సౌలభ్యం కోసం ప్రవేశ పెట్టిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు అవినీతి మయంగా మార్చివేశారు. నాలుగేళ్లలో సుమారు వేల కోట్ల విలువల ప్రభుత్వ నిషేధిత భూములు యథేచ్చగా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. మరోవైపు తమకున్న విచక్షణ అధికారాలు సైతం అడ్డం పెట్టుకొని నిర్ధేశిత ధర విలువను తగ్గించి స్టాంప్ డ్యూటీ కింద పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ఫలితంగా సబ్రిజిస్ట్రార్లకు కాసుల వర్షం కురిసింది.
ఆది నుంచి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారినప్పటికి నామమాత్రపు చర్యలతో అవినీతి అధికారులు మరింత రెచ్చిపోయారు. క్షేత్ర స్ధాయి నుంచి ఉన్నత స్ధాయి వరకు ఆమ్యామ్యాలు కారణంగా ఎనీవేర్ అడిందే అట పాడిందే పాట తయారైంది. గత రెండేళ్ల క్రితం నగర శివారులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవేర్ కింద జరిగిన రిజిస్ట్రేషన్ల పై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ కమిటీ వేసి కాగితాలకు పరిమితం చేశారు. ఇప్పటి వరకు విచారణ కమిటీ ఎలాంటి నివేదిక సమర్పించలేదంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. మంత్రి పేషి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు ఎనీ వేర్ కింద వచ్చిన ఫిర్యాదులు తొక్కి పెడుతూ వచ్చారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి.
సీఎంవో కదిలికతోనే...
సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారించనంత వరకు ఎనీవేర్ దందా అక్రమాల అడ్టుకట్ట లేకుండా పోయింది. కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ రమేష్చంద్రారెడి, బాలనగర్ సబ్రిజిస్ట్రార్ మహ్మద యూసుఫ్లపై ఫిర్యాదులు బహిరంగ రాహస్యమైనప్పటకి ఫలితం లేకుండా పోయింది. సీఎంవో స్పందించి ఆదేశాలు జరీ చేసేంత వరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ల శాఖలో చలనం లేకుండా పోయింది. అతర్వాత ఉన్నతాధికారులు హడావుడిగా సెస్పెండ్ చేసి క్రిమినల్ కేసుల పెట్టారు. సీఎంఓ నుంచి ఫిర్యాదులు అంది సెస్పెండ్ అయ్యే వరకు సదరు మంత్రి దృష్టికి రాకపోవడం గమనార్హం. మియామూర్లో సుమారు 693 ఎకరాలు, బాలనగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, కుత్బుల్లాపూర్ లలో సైతం వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఎనీవేర్ కింద రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.
85 శాతం అక్రమాలే..
ఎనీవేర్ కింద నమోదైన దస్తావేజుల్లో సుమారు 85 శాతం వరకు అక్రమాలు జరిగి ఉండవచ్చని సాక్షాత్తు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి నాలుగేళ్ళలో మొత్తం మీద 40 లక్షల వరకు దస్తావేజులు నమోదు కాగా, అందులో నాలుగున్నర లక్షల వరకు ఎనీవేర్ ప్రక్రియ కింద నమోదైనట్లు అధికార గణాంకలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 11.01 లక్షల దస్తావేజులకు గాను ఎనీవేర్ కింద 1.97 లక్షలు దస్తావేజులు నమోదయ్యాయి. ఎనీవేర్ నమోదు లో వరంగల్, హైదరాబాద్లలో సైతం 19 శాతం తగ్గకుండా నమోదైనట్లు గణాంకలు స్పష్టం చేస్తున్నాయి.
నాలుగేళ్లలో ఎనీవేర్ కింద దస్తావేజుల నమోదు ఇలా....
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
జిల్లా మొత్తం దస్తావేజులు ఎనీవేర్ దస్తావేజులు శాతం
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఆదిలాబాద్ 1,70,440 4,714 2.77
హైదరాబాద్ 2,25, 265 44,305 19.69
నల్లగొండ 4,86, 501 42,767 8.79
మెదక్ 3,74,942 23,763 6.34
మహబూబ్నగర్ 5.15.640 39,907 7.74
ఖమ్మం 2,16, 291 22,526 10.41
రంగారెడ్డి 11,01,550 1,97,570 17.94
కరీంనగర్ 3.27,093 17,496 5.35
నిజామాబాద్ 2,42,531 5,952 2.45
వరంగల్ 2,67897 53,546 19.99
'ఎనీవేర్' తో ఎన్నెన్నో అక్రమాలు
Published Wed, May 31 2017 10:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement