జడ్చర్ల: మండలంలోని ఆల్వాన్పల్లిలో శుక్రవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు దాదాపు రూ.5 లక్షల విలువ చేసే బంగారు నగలు అపహరించుకెళ్లారు. సీఐ జంగయ్య కథనం మేరకు... ఆల్వాన్పల్లికి చెందిన మన్నెం కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సొంత పనినిమిత్తం జడ్చర్లకు వెళ్లారు. అనంతరం కృష్ణారెడ్డి ఇంటికి తాళం వేసి తాళం చెవిని ఇంటి ముందు పందిరి గుంజకు ఏర్పాటు చేసిన డబ్బాలో పెట్టి పొలం దగ్గరకు వెళ్లాడు.
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వచ్చి చూడగా, తలుపు తెరచి ఉండడం గమనించి ఆందోళనపడ్డాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 18 తులాల బంగారు నగలను దొంగలించినట్లు గుర్తించాడు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కొన్ని నెలల ముందే కృష్ణారెడ్డి కుమారుడి వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా కోడలికి బంగారు నగలు పెట్టారని, వాటిని బీరువాలో దాచినట్లు బాధితుడు తెలిపాడు.
క్లూస్ టీమ్ పరిశీలన, డాగ్ స్క్వాడ్తో గాలింపు
దొంగతన ం విషయం తెలియగానే జడ్చర్ల సీఐ జంగయ్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్టీమ్ వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్వాడ్ను రప్పించి గాలించారు. అయితే జాగిలం గ్రామంలో కొద్ది దూరం వెళ్లి ఆగిపోయినట్లు తెలిసింది. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆల్వాన్పల్లిలో భారీ చోరీ
Published Sat, Oct 18 2014 4:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement