నేనున్నానంటూ చేయి అందించింది..! | Sakshi
Sakshi News home page

నేనున్నానంటూ చేయి అందించింది..!

Published Sat, Aug 19 2017 6:09 PM

నేనున్నానంటూ చేయి అందించింది..! - Sakshi

వరంగల్: వరదలో చిక్కుకున్నామంటే జీవితం మీద ఆశలు లేనట్లే. కానీ వరదలో కొట్టుకుపోయిన ఓ కానిస్టేబుల్ అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ఇంకా వరదలోనే ఉన్నాడు. కొట్టుకుని పోతున్న అతనికి ఒక చెట్టు నేనున్నానంటూ చేయి అందించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మల్లెల నాగేశ్వరరావు గుండెపోటుతో చనిపోయిన మంగపేట ఏఎస్సై సారయ్య అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి బయలుదేరాడు.

ఆయన ములుగు మండలం పంచోత్కులపల్లి సమీపంలో వాగు వరదలో చిక్కుకుని కొంత దూరం కొట్టుకుపోయాడు. అయితే ఆ చెట్టును ఆసరాగా చేసుకుని సురక్షితంగా బయటపడ్డాడు.  వరదలో చిక్కుకున్న అతను రక్షించాలంటూ అక్కడి నుంచి కేకలు వేస్తున్నాడు. దీంతో ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Advertisement
Advertisement