ఎంతో కాలంగా వేచిచూసిన వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మంగళవారం గ్లోబల్ గా లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఇప్పటివరకు ఎన్నో రూమర్లు మార్కెట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే అంతా కొత్తదనంతో కూడిన డిజైన్, తాజా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లతో కంపెనీ ఈ ఫోన్ ను కస్టమర్లకు ముందుకు ప్రవేశపెట్టింది. కేవలం డిజైన్, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లు మాత్రమేకాక, కెమెరా కూడా ఎంతో అద్భుతమైనదిగా అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 479 డాలర్లు, అంటే దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం 30,958.97రూపాయలు. గ్లోబల్ గా జూన్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చని ఈ చైనీస్ కంపెనీ చెప్పింది.
గ్లోబల్ గా మంగళవారం లాంచ్ అయిన ఈ ఫోన్ ను భారత్ మార్కెట్లో జూన్ 22న ప్రవేశపెట్టబోతున్నారు. భారత్ లో దీన్ని ప్రారంభ ధర రూ.32,999గా ఉండబోతుందని తెలుస్తోంది. టాప్ ఎండ్ మోడల్ రూ.37,999గా నిర్ణయించనున్నారని తెలుస్తోంది. భారత్ లో మాత్రం లాంచ్ అయిన రోజు నుంచే తమ ప్లాట్ ఫామ్ పై విక్రయానికి రాబోతుందని అమెజాన్ ఇండియా ధృవీకరించింది. ముంబైలో ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ బ్రాండు అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకున్న వన్ ప్లస్ ఫోన్లలో పలుచనైన ఫోన్ ఇదేనని, అంతేకాక అత్యంత పవర్ ఫుల్ ఫోన్ కూడా ఇదేనని లాంచింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది.
గ్లోబల్ గా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....