అధికారం అండగా పేట్రేగిపోతున్న టీడీపీ నేతలు
బలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని వ్యూహం
సాక్షి ప్రతినిధి, కడప/ తిరుపతి రూరల్ : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి. బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలు పొందడానికి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఇందుకు పోలీసులు సైతం బరితెగించి సహకరిస్తుండటం నివ్వెర పరు స్తోంది. వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ బీఫాంపై గెలుపొందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 521 మంది, టీడీపీ బీఫాంపై గెలుపొందిన వారు 300 మంది, కాంగ్రెస్ బీఫాంపై గెలుపొందిన వారు 10 మంది ఉన్నారు. ఈ లెక్కన ఈ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ పోటీ చేయడం కూడా దండగ. అలాంటిది ఇక్కడ ఎలాగైనా గెలుపు సాధించాలని ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాపుల పర్వానికి తెరలేపింది.
ఇందులో భాగంగా రామాపురం మండలం చిట్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మిదేవిని రెండు వారాల క్రితం కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమెను ఫలానా వాళ్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, వారి చెర నుంచి విడిపించాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. తన తల్లికి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేశారని, తను వెళ్లి చూడాల్సిందేనని పట్టు పట్టడంతో కిడ్నాపర్లు.. పోలీసు బందోబస్తు నడుమ ఆమెను తీసుకెళ్లారు. పోలీసు ఎస్కార్టు వాహనం ముందుండి కిడ్నాపర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సహకరించడం వింతల్లోకెల్లా వింత.
విషయం తెలియడంతో ఎంపీటీసీ సభ్యురాలిని విడిపించుకెళ్దామని ఆసుపత్రి వద్దకు వచ్చిన చంద్రగిరి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చి పక్కకు పడేశారు. అయినా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు వెనక్కు తగ్గక పోవడంతో ఎంపీటీసీ సభ్యురాలిని వైఎస్ఆర్ జిల్లా పోలీసులకు అప్పగిస్తామని తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మిదేవిని రాత్రి పొద్దుపోయాక సంబేపల్లి పోలీసుస్టేషన్లో బంధువులకు అప్పగించారు.
‘దేశం’ కిడ్నాప్నకు ఖాకీ కవచం
Published Mon, Feb 13 2017 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement