అనంతపురం: జల్సాలకు అలవాటుపడి చోరీల బాటపట్టిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 23 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీపీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ నగసుబ్బన్న వివరాలు తెలిపారు.