నటుడు విశాల్, నటి లక్ష్మీమీనన్ల కాంబినేషన్ బాగానే వర్క్అవుట్ అయ్యింది. వీరి మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్ లాంటివికూడా బాగా కుదిరాయని చెప్పవచ్చు. కారణం ఈ జంట తొలిసారిగా నటించిన పాండియనాడు, మలిసారి నటించిన నాన్ శివప్పు మనిదన్ చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. దీంతో ఈ సంచలన జోడి ముచ్చటగా మూడోసారి కలిసి నటించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం హరి దర్శకత్వంలో పూజై చిత్రంలో నటిస్తున్న విశాల్ ఆ చిత్ర నిర్మాణం పూర్తి కానుండడంతో తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు ఈయన హీరోగా నటించి, సొం తంగా నిర్మించిన తొలిచిత్రం పాండియనాడు.
చిత్రాన్ని తెరకెక్కించిన సుశీంద్రన్ ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనుండడం విశేషం. కాగా ప్రస్తుతం పూజై చిత్రంలో విశాల్కు జంటగా నటిస్తున్న శ్రుతిహాసన్నే ఈ చిత్రంలో నూ నటింప చేయడానికి ప్రయత్నించారు. అయితే వెంటవెంటనే విశాల్తో నటించడం బాగుండదనో, కాల్షీట్స్ సమస్య కారణంగానో శ్రుతిహాసన్ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.
దీంతో లక్ష్మీమీనన్ నటించడానికి రెడీ అవుతోంది. దీనిపై విశాల్ మాట్లాడుతూ పాండియనాడు వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మళ్లీ సుశీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిపారు. హీరోయిన్కు మంచి అవకాశం ఉన్న పాత్ర కావడంతో శ్రుతి హాసన్ నటిస్తే బాగుంటుందని భావించిన మాట నిజమేనన్నారు. ఆమె ఈ చిత్రంలో పాత్రకు అంతగా నొప్పదనిపించిందన్నారు. తాను, లక్ష్మీమీనన్, సుశీంద్రన్లది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని పేర్కొన్నారు. అయినా చాలామంది నటీమణుల పేర్లు పరిశీలించిన తరువాత లక్ష్మీమీనన్నే బెటర్ అని, ఆమెను ఎంపిక చేసినట్లు నటుడు విశాల్ వివరించారు.
మరోసారి విశాల్తో..
Published Sun, Sep 21 2014 12:08 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement